Rajendra Prasad: ఓటీటీ బాటలో రాజేంద్ర ప్రసాద్.. ఆసక్తి పెంచుతున్న టైటిల్‌!

కరోనా వైరస్‌/లాక్‌డౌన్‌ తర్వాత ఓటీటీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. అందుకే కొత్తవారితో పాటు అనుభవం ఉన్న నటులూ డిజిటల్‌ మాధ్యమం వైపు అడుగులు వేస్తున్నారు.

Published : 12 Dec 2021 20:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కరోనా వైరస్‌/లాక్‌డౌన్‌ తర్వాత ఓటీటీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. అందుకే కొత్తవారితో పాటు అనుభవం ఉన్న నటులూ డిజిటల్‌ మాధ్యమం వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్‌ నటులు ఓటీటీ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల్లో కనిపించి మెప్పించారు. ఇప్పుడా జాబితాలోకి రాజేంద్ర ప్రసాద్‌ చేరనున్నారు. రాజేంద్ర ప్రసాద్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు పవన్‌ సాధినేని ఓటీటీ ఫిల్మ్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ సినిమాకి ‘సేనాపతి’ అనే టైటిల్‌ ఖరారైంది. సంబంధిత వీడియోలో.. రాజేంద్ర ప్రసాద్‌ ఓ బాలుడికి చెప్పిన ‘ఏడు చేపల కథ’ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. ఈ సినిమాని విష్ణు ప్రసాద్‌, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు ఓటీటీ ‘ఆహా’లో విడుదలకానుంది. రాజేంద్ర ప్రసాద్‌ ఈ ఏడాది ‘గాలి సంపత్‌’, ‘క్లైమాక్స్‌’, ‘గల్లీరౌడీ’, ‘పెళ్లి సందD’ తదితర చిత్రాలతో ప్రేక్షకులకు వినోదం పంచారు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని