Vijay Devarakonda: మొన్న విజయ్‌-రష్మిక.. నిన్న విజయ్‌-అనన్య.. ఇప్పుడిలా..!

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా ప్రేక్షకాదరణ పొందిన సెలబ్రిటీ చాట్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’. సుమారు 6 సీజన్లపాటు సాగిన ఈ షోలో ఎంతోమంది బాలీవుడ్‌ సెలబ్రిటీలు పాల్గొని తమ తదుపరి...

Updated : 30 May 2022 11:51 IST

ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా ప్రేక్షకాదరణ పొందిన సెలబ్రిటీ చాట్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’. 6 సీజన్లపాటు సాగిన ఈ షోలో ఎంతోమంది బాలీవుడ్‌ సెలబ్రిటీలు పాల్గొని తమ సినిమాలను ప్రమోట్‌ చేసుకున్నారు. ఎన్నో ఏళ్ల పాటు సక్సెస్‌ఫుల్‌గా సాగిన ఈ షో సరికొత్త సీజన్‌ రానున్న రోజుల్లో డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో కరణ్‌ షోలో పాల్గొనే సెలబ్రిటీల జాబితా నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. ఈ జాబితాలో విజయ్‌ దేవరకొండ-రష్మిక ఉన్నారంటూ మొన్నటిదాకా ప్రచారం సాగింది. ఆ వార్తలన్నీ అవాస్తవాలని.. తన మొదటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘లైగర్‌’ రిలీజ్‌ని దృష్టిలో ఉంచుకుని .. విజయ్‌-అనన్య ఈ షోలో పాల్గొంటున్నారని మరికొంతమంది చెప్పుకొన్నారు. తాజా సమాచారం మేరకు కరణ్‌ షోలో విజయ్‌ దేవరకొండ ఒక్కడే పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌ షూట్‌ కూడా పూర్తైందంటూ, సెట్‌లో విజయ్‌ సంతకం చేసిన ఓ కాఫీ కప్‌ ఫొటో అంటూ పలువురు ప్రచారం చేస్తున్నారు. ఇక, కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘లైగర్‌’ చిత్రానికి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. విజయ్‌-అనన్య జంటగా నటించిన ఈసినిమాలో రమ్యకృష్ణ, మైక్‌ టైసన్‌ కీలకపాత్రలు పోషించారు. ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆగస్టు నెలలో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని