YASH: కొత్తింట్లోకి అడుగుపెట్టిన యశ్‌

కన్నడ స్టార్‌ హీరో యశ్ కొత్తింటిలోకి అడుగుపెట్టారు. బెంగళూరులోని అత్యంత ఖరీదైన ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్‌మెంట్స్‌లో యశ్‌ ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు ఎన్నో రోజుల నుంచి వార్తలు....

Published : 02 Jul 2021 13:43 IST

బెంగళూరు: కన్నడ స్టార్‌ హీరో యశ్ కొత్తింటిలోకి అడుగుపెట్టారు. బెంగళూరులోని అత్యంత ఖరీదైన ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్‌మెంట్స్‌లో యశ్‌ ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ మేరకు యశ్‌ - రాధికా పండిట్‌ దంపతులు గురువారం ఉదయం నూతన గృహంలోకి అడుగుపెట్టారు. పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు తాజాగా నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ నూతన గృహప్రవేశ వేడుకలో యశ్‌ తల్లిదండ్రులతోపాటు ఇతర కుటుంబసభ్యులు, అత్యంత ఆప్తులు మాత్రమే పాల్గొన్నారు. మరోవైపు, తమ అభిరుచులకు అద్దం పట్టేలా యశ్‌-రాధిక ఈ ఇంటిని డిజైన్‌ చేయించుకోనున్నారు.

యశ్‌ ప్రస్తుతం ‘కేజీఎఫ్‌-2’ రిలీజ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన రాఖీబాయ్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించారు. రవీనా టాండన్‌, రావు రమేష్‌, ప్రకాశ్‌రాజ్‌ ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని