US: కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. ఆరుగురి మృతి

అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో నగరంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా......

Published : 03 Apr 2022 19:47 IST

కాలిఫోర్నియా: అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో నగరంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు పౌరులు మృతిచెందారు. మరో తొమ్మిది మందికి బులెట్‌ గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న శాక్రమెంటో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ తరహా నిబంధనలు విధించారు. అయితే ఈ కాల్పులకు తెగబడింది ఒకే దుండగుడా? లేక మరికొందరు ఉన్నారా అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు