ATA Seminer: ‘ఆటా’ ఆధ్వర్యంలో హైదరాబాద్లో బిజినెస్ సెమినార్
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తెలుగు వారిని ప్రోత్సహించేందుకు అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో బిజినెస్ సెమినార్ నిర్వహించారు.......
* తెలుగు వ్యాపారవేత్తలకు మెంటారింగ్, ఫండింగ్తో సహకారంపై దృష్టి
* తెలంగాణలోని టైర్-2 నగరాల్లో వ్యాపార వాతావరణాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం
హైదరాబాద్: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తెలుగు వారిని ప్రోత్సహించేందుకు అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో బిజినెస్ సెమినార్ నిర్వహించారు. వ్యాపారాలకు సంబంధించిన ఆలోచనల్ని ప్రోత్సహించడం, యువ వ్యాపారవేత్తలకు మెంటారింగ్, వెంచర్ క్యాపిటలిస్టులకు ఒక వేదిక కల్పించడం, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికా, భారత్లకు చెందిన సుమారు 100 మంది మెంటార్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, వ్యాపారవేత్తలు, సాంకేతిక రంగ నిపుణులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆటా వేడుకల బిజినెస్ కమిటీ ఛైర్మన్ కాశీ కొత్త మాట్లాడుతూ.. ‘‘ఈ బిజినెస్ సెమినార్ ఎజెండా బహుముఖం. అమెరికాలో స్థిరపడిన తెలుగు వ్యాపారవేత్తలు, తెలంగాణలోని వ్యాపారవేత్తల మధ్య అనుసంధానం, అనుబంధాన్ని పెంచడం, భారత్లో మరీ ముఖ్యంగా తెలంగాణలో స్టార్టప్ కంపెనీలకు మాంటారింగ్ చేసి వాటిలో పెట్టుబడులు పెట్టడం, ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ లాంటి టైర్-2 నగరాలకు మరిన్ని కంపెనీలను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యం’’ అని అన్నారు.
‘తెలుగు వాణిజ్యవేత్తలు అమెరికాతో పాటు ప్రపంచమంతా మంచి గుర్తింపు పొందుతున్నారు. భారత్-అమెరికా భాగస్వామ్యాలను ప్రోత్సహించి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారుల్ని ప్రోత్సహించేందుకు ఆటా బిజినెస్ సెమినార్ ఒక మంచి ప్రయత్నం. 2014 నుంచి హైదరాబాద్లో ప్రతి రెండేళ్లకొకసారి ఆటా ఇలాంటి సెమినార్లు నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఇప్పటివరకు భారతీయ స్టార్టప్లలో దాదాపు 20 మిలియన్ డాలర్లు (రూ.150 కోట్లకు పైగా) పెట్టుబడులు వచ్చాయి. ఈ బిజినెస్ సెమినార్ల వల్ల పలు సంస్థలు టైర్-2 నగరాలకు తరలివెళ్లాయి. ఖమ్మం పట్టణంలో టి-హబ్ ప్రారంభించడం ఆటా బిజినెస్ కో-ఛైర్ లక్ష్ చేపూరి సాధించిన ఓ అతిపెద్ద విజయం” అని అమెరికా తెలుగు సంఘం కాన్ఫరెన్స్ సలహా కమిటీ ఛైర్మన్ జయంత్ చల్లా అన్నారు.
మరోవైపు, మెంటారింగ్, పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులు, వాణిజ్యవేత్తల మధ్య పెట్టుబడులకు సంబంధించిన మంచి చర్చలు జరగడంతో పాటు ఈ బిజినెస్ సెమినార్ అనేది ద్వితీయ శ్రేణి నగరాలకు వెళ్లాలనే కంపెనీలకు, ప్రభుత్వ అధికారులకు మధ్య నిరంతర చర్చలకు కూడా ఓ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తెలంగాణ ఐటీ పెట్టుబడుల విభాగం సీఈవో విజయ్ రంగినేని, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సీఈవో శ్రీకాంత్ సిన్హతో పాటు ఆటా అధ్యక్షుడు భువనేష్ బూజల, ఆటా ఉపాధ్యక్షుడు (ఎలక్ట్) మధు బొమ్మినేని, సదస్సు సలహా కమిటీ ఛైర్మన్ జయంత్ చల్లా, కిరణ్ పాశం (సదస్సు సమన్వయకర్త), కాశీ కొత్త (ఆటా వేడుకలు బిజినెస్ ఛైర్), లక్ష్ చేపూరి (ఆటా వేడుకలు బిజినెస్ కో ఛైర్) తదితరులు పాల్గొన్నారు. అనంతరం, ద్వితీయశ్రేణి నగరాలకు తరలాలని భావించే కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రతిపాదించింది.
ఆటా గురించి.. అమెరికా వ్యాప్తంగా ఉన్న దాదాపు 5 లక్షల మందికి పైగా తెలుగువారికి ప్రాతినిధ్యం వహించేందుకు 1990లో ఏర్పాటైన ప్రధాన జాతీయ సంస్థ అమెరికా తెలుగు సంఘం (ఆటా). ఇందులోని ప్రతినిధుల్లో అధికంగా తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వచ్చిన తొలితరం వారే. సమాజ సేవ, వాణిజ్యం, సంస్కృతి, సామాజిక కార్యకలాపాలు, విద్యార్థులకు సాయం, తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణ, ప్రోత్సాహం తదితర సేవల్ని అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ నిర్వహిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్