షార్లెట్లో తెదేపా అభిమానుల ఆత్మీయ సమావేశానికి హాజరైన వైకుంఠం ప్రభాకర్ చౌదరి
అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి అమెరికాలోని షార్లెట్ నగరంలో ఘన స్వాగతం లభించింది. బోస్టన్లో ఈ నెల 20, 21 నిర్వహించనున్న ఎన్నారై తెదేపా యూఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహానాడులో పాల్గొనేందుకు వైకుంఠం ప్రభాకర్ చౌదరి అమెరికా వచ్చారు.
అమెరికా: అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి అమెరికాలోని షార్లెట్ నగరంలో ఘన స్వాగతం లభించింది. బోస్టన్లో ఈ నెల 20, 21 నిర్వహించనున్న ఎన్నారై తెదేపా యూఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహానాడులో పాల్గొనేందుకు వైకుంఠం ప్రభాకర్ చౌదరి అమెరికా వచ్చారు. ఈ సందర్భంగా ఈ నెల 18న షార్లెట్లో తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా అభిమానులు దాదాపు 250 మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతపురం వాసులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు షార్లెట్లో ఎక్కువగా ఉండడంతో వారి కోరికను మన్నించి వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
షార్లెట్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పురుషోత్తం చౌదరి గుడే, రవి నాయుడు, ఠాగూర్ మల్లినేని, వెంకట్ మాలపాటి, ఆవులపాటి, మహేష్ సూరపనేని, వెంకట్ సూర్యదేవర, కృష్ణ, నరసింహ సమన్వయకర్తలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సురేష్ కాకర్ల, రామ్ అల్లు, సిద్ద కోనంకి, కేశవ్ వేముల తదితరులు పాల్గొన్నారు.
తెదేపా అభిమానుల ఆత్మీయ సమావేశంలో పురుషోత్తం చౌదరి గుడే స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా పిల్లలు పుష్పగుచ్ఛంతో ప్రభాకర్ చౌదరికి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. పలువురు మహిళలు, యువత తమ తమ ఆలోచనలను ప్రసంగ రూపంలో పంచుకున్నారు. అనంతరం ప్రభాకర్ చౌదరి సమావేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపన, విధివిధానాలు, తెదేపా అధికారంలో ఉన్నప్పుడు అణగారిన వర్గాలకు అందించిన చేయూత, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాలు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దురాగతాలు, స్వలాభాపేక్ష లేకుండా ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న వైనం, బోస్టన్ మహానాడు ఆహ్వానం తదితర విషయాలపై ప్రభాకర్ చౌదరి సుదీర్ఘంగా మాట్లాడారు. సభికులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానాలు చెప్పారు.
ఈ సందర్భంగా కార్యక్రమ సమన్వయకర్తలు ప్రభాకర్ చౌదరిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించారు. శాలువాతో సత్కరించబోగా ఆ శాలువాను తిరిగి ఠాగూర్ మల్లినేనికి కప్పి, తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఠాగూర్ లాంటి వాళ్లను ముందు సత్కరించాలని ప్రభాకర్ చౌదరి అనడంతో సభికులు హర్షధ్వానాలతో మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి యోగక్షేమాలు వైకుంఠం ప్రభాకర్ చౌదరి అడిగి తెలుసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. మహిళలు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు