యూఏఈలో ఘనంగా ఉగాది సంబరాలు..

గల్ఫ్ ఆంధ్ర కేసరి త్రిమూర్తులు ఆధ్వర్యంలో యూఏఈ అజ్మన్‌లో అంగరంగ వైభవంగా

Published : 03 Apr 2022 12:36 IST

గల్ఫ్ ఆంధ్ర కేసరి త్రిమూర్తులు ఆధ్వర్యంలో యూఏఈ అజ్మన్‌లో అంగరంగ వైభవంగా తెలుగువారు ఉగాది వేడుకలను జరుపుకొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతిఒక్కరికి ఉగాది పచ్చడి రుచి చూపించారు. ఈ వేడుకలకు అతిథిగా విచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్ రఘుకుంచె తనపాటలతో అలరించారు. అనంతరం  సాయి శ్రీనివాస్  నూతన సంవత్సర పంచాంగ పఠనం చేశారు.

మరో అతిథి మెజీషియన్ రవిశంకర్ మ్యాజిక్‌ షో చిన్నారులను  అలరించింది. అనంతరం చిన్నారులు ఆటాపాటలతో ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా ఇండియన్ అసోసియేషన్ షార్జా అధ్యక్షులు ఈఫి జాన్సన్ మాట్లాడుతూ.. గల్ఫ్‌ ఆంధ్రా కార్యక్రమాలు అద్భుతంగా ప్రవాసీయులను ఉత్సాహపరిచే విధంగా ఉన్నాయని కొనియాడారు. తెలుగు ప్రజలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. వారు ఇతరులమీద చూపించే ప్రేమ, ఆప్యాయత మరిచి పోలేనిదని అన్నారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ.. అందరికీ మంచిజరగాలని కోరుకున్నారు. అనంతరం వివిధ విభాగాల్లో పోటీల్లో పాల్గొన్న 
చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు.
 అనంతరం ప్రత్యేకమైన  వంటకాలతో ఉగాది భోజనాల చేసి.. అందరూ సంబరాలు జరుపుకొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని