సేవకు ప్రతిరూపం చేతనా ఫౌండేషన్‌: సాయిసుధ పాలడుగు

సేవకు ప్రతిరూపం చేతనా ఫౌండేషన్‌ అని ‘గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం’ అధ్యక్షురాలు సాయిసుధ పాలడుగు అన్నారు.

Published : 30 Aug 2022 13:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సేవకు ప్రతిరూపం చేతనా ఫౌండేషన్‌ అని ‘గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం’ అధ్యక్షురాలు సాయిసుధ పాలడుగు అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జీడబ్ల్యూటీసీఎస్‌, చేతనా ఫౌండేషన్‌ సంయుక్తంగా నిధుల సేకరణ, యోగా కార్యక్రమాలను నిర్వహించాయి. ఈ సందర్భంగా యోగా, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. 

అనంతరం సాయిసుధ మాట్లాడుతూ చేతన, జీడబ్ల్యూటీసీఎస్‌ సంయుక్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. చేతనా ఫౌండేషన్‌ ద్వారా మనదేశంలోని అనేక ప్రాంతాల్లో పేద విద్యార్థినీ విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు, స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నామన్నారు. కరోనా సమయంలో పేదలకు ఉచితంగా వ్యాక్సినేషన్‌తో పాటు మందులు అందించినట్లు వివరించారు. శీతాకాలంలో చలి బారి నుంచి కాపాడేందుకు కావాల్సిన సామగ్రిని అమెరికాలోని నిరాశ్రయులకు అందజేశామని.. పేద విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాల సామగ్రిని అందించామని తెలిపారు. ప్రతి నెలా పేదలకు ఆహార సామగ్రితో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామన్నారు.

 

అనంతరం మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ తోటి మనిషి కష్టాన్ని గుర్తించలేనపుడు మానవత్వానికి అర్థం లేదన్నారు. సేవలోనే ఆధ్యాత్మికతకు పరిపూర్ణత చేకూరుతుందని చెప్పారు. నలుగురి కోసం అన్న భావన మనిషి స్వభావంలో ఒక భాగం కావాలని ఆయన ఆకాంక్షించారు. చేతన, జీడబ్ల్యూటీసీఎస్‌ చేస్తున్న సామాజిక సేవల్ని మన్నవ సుబ్బారావు కొనియాడారు.

చేతనా ఫౌండేషన్‌ ప్రతినిధి శ్రీలత నార్ల మాట్లాడుతూ రెండు సంఘాలు కలిసి మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. ఉదారంగా పేదలకు ఉన్నత విద్య అందించేందుకు తమ సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయన్నారు. పేదలకు వివిధ రూపాల్లో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె వివరించారు.

 

ఈ కార్యక్రమంలో టీడీఎఫ్‌ అధ్యక్షులు కవిత చల్లా, సత్యనారాయణ మన్నె, భాను మాగులూరి, నరేన్‌ కొడాలి, నాగ్‌ నెల్లూరి, అనిల్‌ ఉప్పలపాటి, రవి అడుసుమిల్లి, సత్య సూరపనేని, రమాకాంత్‌ కోయ, ధూళిపాళ్ల వీరనారాయణ, సుశాంత్‌ మన్నె, బబిత సుఖవాసి, రీటా పట్నాయక్‌, చరిత తమ్మారెడ్డి, లక్ష్మి నన్నపనేని, యూత్‌ వాలంటీర్లు తేజ్‌ మండవ, అక్షర మండవ, సరయు దారపనేని, రోషన్‌ మొహంతితో పాటు పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని