NRI: తెలుగు భాష, సంస్కృతిని కాపాడుకోవాలి: కృష్ణ లాం
తెలుగు భాష, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు.
వాషింగ్టన్ డీసీ (అమెరికా): తెలుగు భాష, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు. జీడబ్ల్యూటీసీఎస్(బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం) ఆధ్వర్యంలో శోభాకృత ఉగాది ఉత్సవాలు అత్యంత ఆహ్లాదకరంగా, వైభవంగా జరిగాయి. తొలుత జ్యోతిప్రజ్వలన చేసి వేద పండితుల ఆశీర్వచనాలతో కార్యక్రమం ప్రారంభమైంది. వాషింగ్టన్ డీసీలోని ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. తెలుగు వారి అభిరుచులకు తగిన విధంగా పసందైన విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని లైవ్ బ్యాండ్ మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కృష్ణలాం అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా సతీష్ వేమన, సత్యనారాయణ మన్నె, మన్నవ సుబ్బారావు, మూల్పూరి వెంకట్రావు, డా.హేమప్రసాద్ యడ్ల, స్టేట్ డెలికేట్ సుహాస్ సుబ్రహ్మణ్యం, బుటా బీబీ రాజ్, గంటి భాస్కర్, బాబూరావు సామల, విష్షు కల్వాల, నాగిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ప్రముఖ గాయని సునీత ఉపద్రష్ట బృందం తమ పాటలతో ప్రేక్షకులను మైమరపించారు. ఈ సందర్భంగా జీడబ్ల్యూటీసీఎస్ చేస్తున్న సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. సునీత సినీ నేపథ్య గాయనిగా తన 25 ఏళ్ల ప్రస్థానం పూర్తిచేసుకోవడాన్ని పురస్కరించుకుని ఆమెను ఘనంగా సత్కరించి “సుమధుర సుస్వర సుహాసిని” బిరుదు ప్రదాన చేశారు.
ఈ సందర్భంగా కృష్ణ లాం మాట్లాడుతూ.. అందరికీ శోభాకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.‘‘భాషను, ఆచార వ్యవహారాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. తీపి, చేదు కలిసిందే జీవితం. ఈ ఉగాది ప్రారంభం నుంచి అందరి జీవితాలు ఆనందమయం కావాలి. జీడబ్ల్యూటీసీఎస్ లాంటి సుదీర్ఘ చరిత్ర ఉన్న సంస్థకు అతి చిన్న వయసులో నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. తెలుగువారు అందరికీ వివిధ రూపాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అందజేయాలన్నదే మా అభిలాష. మీరిస్తున్న ప్రోత్సాహం, ఆశీస్సులు మమ్ముల్ని మరింత ఉత్సాహ పరుస్తున్నాయి. మా సంస్థ పట్ల భవిష్యత్ లోనూ ఇలాంటి ఆదరణే చూపాలని కోరుకుంటున్నా’’ అని కృష్ణ లాం తెలిపారు.
సతీష్ వేమన మాట్లాడుతూ.. ‘‘ఉగాది కొత్త ఆలోచనలు, సరికొత్త ఆశయాలు మీ జీవితాల్లో నింపాలని ఆకాంక్షిస్తున్నా. తెలుగు జాతి అస్థిత్వాన్ని, ప్రత్యేకతను చాటిచెప్పేది ఉగాది పండుగ’’అన్నారు. సత్యనారాయణ మన్నె మాట్లాడుతూ.. తెలుగుదనానికి అద్దంపట్టే పండుగ ఉగాది. చాలా కాలం నుంచి ఇక్కడున్న తెలుగువారందరికీ చక్కటి వినోదాన్ని, వికాసాన్ని జీడబ్ల్యూటీసీఎస్ అందిస్తోందన్నారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. సుదీర్ఘ చరిత్ర కలిగిన జీడబ్ల్యూటీసీఎస్ క్రమం తప్పకుండా తెలుగువారి అస్థిత్వాన్ని కాపాడుకుంటూ అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ తెలుగుదనాన్ని ఒక గొడుకు కిందకు చేర్చి వారి మధ్య సామాజిక సంబంధాలను బలోపేతం చేస్తున్నారన్నారు.
మూల్పూరి వెంకట్రావు మాట్లాడుతూ.. సంక్రాంతి సంబరాలకు ధీటుగా ఉగాది వేడుకలను నిర్వహించారు. భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు జీడబ్ల్యూటీసీఎస్ ద్వారా చేపట్టాలన్నారు. ఫ్యాషన్ షో, రాఫెల్స్, ఫోటో బూత్స్, కిడ్స్ ఆర్ట్ కాంపిటీషన్, షాపింగ్ స్టాల్స్, డాజ్లింగ్ కల్చరల్ పెర్ఫామెన్స్ వంటి అనేక సాంస్కృతిక, క్రీడా, వినోద కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని అలరించాయి.చిన్నారుల నృత్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులకు, ప్రేక్షకులకు ఈ కార్యక్రమం ఒక మధురానిభూతిని మిగిల్చింది. నరేన్ కొడాలి, సుశాంత్ మన్నె, విజయ్ అట్లూరి, సుష్మ అమృతలూరి, రవి అడుసుమిల్లి, భాను మాగులూరి, ప్రవీణ్ కొండక, శ్రీనివాస్ గంగా, యాష్ బొద్దులూరి, శ్రీవిద్య సోమ, కార్తీక్ కోమటి, ఫణి తాళ్లూరు, ఉమాకాంత్ రఘుపతి, రాజేష్ కాసరనేని, శ్రీమతి సుధ పాలడుగు, సత్య సూరపనేని, రమాకాంత్ కోయ, రామ్ చౌదరి ఉప్పుటూరి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..