న్యూజెర్సీలో సందడిగా జొన్నవిత్తుల సాహితీ సమావేశం
న్యూజెర్సీ రాష్ట్రంలోని సోమర్సెట్లో న్యూజెర్సీ తెలుగు కళా సమితి, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) సంయుక్తంగా జూన్ 3న ప్రత్యేక సాహితీ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు.
అమెరికా: మనుషులే కాదు, ఒక మంచి పుస్తకం, లేదా ఒక పద్యం, ఒక పాట ఎదురుకావడం కూడా మానవ జీవితంలో ఒక పెద్ద సంఘటనే అని ప్రముఖ సినీ గేయరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరావు అన్నారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని సోమర్సెట్లో న్యూజెర్సీ తెలుగు కళా సమితి, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) సంయుక్తంగా జూన్ 3న ప్రత్యేక సాహితీ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషా, సాహిత్య రంగాలలో విశిష్ట కృషి చేసిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసమావేశంలో పలువురు సాహితీ ప్రియులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు.
ఈ కార్యక్రమంలో ముందుగా కల్చరల్ కార్యదర్శి బిందు యలమంచిలి ఈ సదస్సుకు వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం చిరంజీవి శ్రీహన్ గరిమెళ్ల వినాయక శ్లోకాన్ని ఆలపించారు. కమ్యూనిటీ కార్యదర్శి శ్రీదేవి పులిపాక ఈ సందర్భంగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకు స్వాగతం పలికి వారిని ప్రసంగించాల్సిందిగా కోరారు. శతక సాహిత్యంలో ప్రత్యేక ముద్రవేసిన జోన్నవిత్తుల మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి తనకు సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువగా ఉండేదని తెలిపారు. అందువల్ల పద్యాలు, పాటలు రాస్తూ వుండేవాడినని పేర్కొన్నారు. ఇప్పటికి 24వ శతకాలు రాసినట్లు తెలిపి వాటి గురించి వివరించారు. ఇంతమంది తెలుగు భాషాభిమానులు ఈ సాహితీ సమావేశం ఏర్పాటు చేయటం ఒక గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు. తాను రచించిన శతకాలలోని అనేక పద్యాలను జొన్నవిత్తుల శ్రావ్యంగా పాడి వినిపించారు. దీంతో సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది.
అనంతరం తెలుగు కళా సమితి అధ్యక్షులు మధు రాచకుళ్ల మాట్లాడుతూ కొత్తగా బాధ్యతలను చేపట్టిన తమ కార్యవర్గం తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ కోసం చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. తరువాత కార్యదర్శి రవి కృష్ణ అన్నదానం తెలుగు కళా సమితి నూతన కార్యవర్గాన్ని సభికులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాట్స్ ప్రతినిధులు, న్యూజెర్సీ తెలుగు కళా సమితి కార్యవర్గ బృందం జొన్నవిత్తులను శాలువా, జ్ణాపికలతో సత్కరించారు. సమావేశంలో నాట్స్ ప్రతినిధులు, శ్యాం నాళం, శ్రీహరి మందాటి, రవి కృష్ణ, వంశీకృష్ణ వెనిగళ్ల, చంద్ర శేఖర్ కొణిదెల, శేషగిరి కంభంపాటి, రమేష్ బేతంపూడి తదితరులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. న్యూజెర్సీలో కళాంజలి నృత్య శిక్షణశాల స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జొన్నవిత్తుల, ఉపాధ్యక్షురాలు అనూరాధ దాసరి, కోశాధికారి శ్రీనివాస్ చెరువు, మెంబర్ షిప్ కార్యదర్శి జ్యోతి కామరసు, తెలుగు కళా సమితి యువజన కార్యదర్శి సుధా దేవులపల్లిని ఘనంగా సత్కరించారు.
కార్యక్రమాన్ని విజయవంతానికి కృషి చేసిన వాలంటీర్లు రవి శంకర్ అప్పన, శ్రీని తోడుపునూరి, మోహన్ ములే, సత్య నేమాన తదితరులతో పాటు ఇందిరా రెడ్డి, శ్రీరామ్ కొల్లూరి, రవి కృష్ణ, శ్రీదేవి జాగర్లమూడి, జనని కృష్ణ, ఆనంద్ పాలూరి,సుధాకర్ ఉప్పల, శరత్ వేట, ధనలక్ష్మి రాచకుళ్ళ తదితరులకు తెలుగు కళా సమితి కార్యవర్గం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో కువైట్లో ఎన్నికల ప్రచారం
ఎన్నారై తెదేపా కువైట్ ఆధ్వర్యంలో తెదేపా-జనసేన-భాజపా కూటమికి మద్దతుగా విస్త్రృత ప్రచారం నిర్వహించారు. -
లండన్లో వైభవంగా ‘తాల్’ ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
‘సామెతలు.. తెలుగు భాషకు సింగారం..’
సామెతలు మన తెలుగు భాషకు సింగారం అని, వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిదీ అని తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు అన్నారు. తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 67వ సమావేశం ‘తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు’ అనే కార్యక్రమం ఆసాంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగింది. -
యూకేలో ఘనంగా ఉగాది సంబరాలు.. TAS నూతన కార్యవర్గం ఎన్నిక
యూకేలోని స్కాట్లాండ్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
ఘనంగా ‘కెంటకీ తెలుగు సంఘం’ ఉగాది వేడుకలు
కెంటకీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ఘనంగా COTA ఉగాది ఉత్సవాలు..
COTA ఆధ్వర్యంలో యూకేలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం