అట్లాంటాలో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. త్వరలో విగ్రహావిష్కరణ
అమెరికాలోని అట్లాంటా నగరంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. త్వరలోనే కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు అట్లాంటా ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు.
అట్లాంటా: అమెరికాలో ‘ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా’ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు విజయవంతంగా నిర్వహించారు. అట్లాంటా నగరంలోని మే 13న స్థానిక లాంబర్ట్ హైస్కూల్లో జరిగిన ఈ వేడుకలకు 2500మందికి పైగా తరలివచ్చారు. తొలుత మాలతి నాగభైరవ ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా కమిటీ సభ్యులు, ముఖ్య అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జీవితాన్ని ప్రతిబింబింపజేసేలా వీడియో ప్రదర్శనతో పాటు స్థానిక డ్యాన్స్ స్కూల్ వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఎన్టీఆర్ నటించిన పలు పాత్రలను నృత్యరూపకంగా చేసిన ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వచ్చిన గుడివాడ నియోజకవర్గం నేతలు, వెనిగండ్ల ఫౌండేషన్ ఛైర్మన్ వెనిగండ్ల రాము, తెదేపా రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష, గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మీల పరిచయ వీడియోలను ప్రదర్శించి వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు.
త్వరలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహావిష్కరణ!
ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని భారత్లో తయారుచేయిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్టు అట్లాంటా సభ్యులు భరత్ మద్దినేని తెలిపారు. త్వరలోనే అట్లాంటాకు తీసుకొచ్చి పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమంలో విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని సభాముఖంగా వీడియో ప్రదర్శించి తెలియజేశారు. అట్లాంటాకు చెందిన మోహన్ దేవు ఎన్టీఆర్ కీర్తిని వివరిస్తూ ఆ యుగపురుషుని అద్భుత విజయాలను, ప్రజాహిత పాలనను అందరూ మరోసారి గుర్తు చేసుకొనేలా చేశారు. ఈ సందర్భంగా వీరందరినీ పుష్పగుచ్చం, శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమం మధ్యలో ప్రదర్శించిన ఎన్టీఆర్కు సంబంధించిన ప్రత్యేక ఏవీలు ఇప్పటికీ ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో ఎలా జీవిస్తున్నారో చాటిచెప్పాయి.
అలరించిన ధనుంజయ్-వైష్ణవి సంగీత విభావరి..
టాలీవుడ్ గాయనీగాయకులు ధనుంజయ్, వైష్ణవిల మ్యూజికల్ ట్రిబ్యూట్ అందరినీ ఒక్కసారి ఎన్టీఆర్ యుగానికి తీసుకెళ్లినట్లయింది. కొన్ని దశాబ్దాల క్రితం పాటలను సైతం అవలీలగా పాడి అందరినీ అలరించిన ధనుంజయ్, వైష్ణవిలను నిర్వాహకులు అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. న్యూజెర్సీ, వర్జీనియా, వాషింగ్టన్ డీసీ, మేరీల్యాండ్, డల్లాస్, షార్లెట్, చికాగో, సెయింట్ లూయిస్, బర్మింగ్ హామ్ వంటి నగరాల నుంచి పలువురు ఎన్టీఆర్ అభిమానులు సైతం అట్లాంటాకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో డా. నరేన్ కొడాలి, డా. ప్రసాద్ నల్లూరి, రాజా కసుకుర్తి, జానీ నిమ్మలపూడి, పురుషోత్తమ చౌదరి గుదే, శ్రీనివాస్ కూకట్ల, ఠాగూర్ మల్లినేని, నాగ పంచుమర్తి, రాజా సూరపనేని, డా. ఉమ కటికి ఆరమండ్ల, బాల, కళ్యాణ్ లింగమనేని తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ఎన్టీఆర్ గురించి చేసిన ప్రసంగం ఆహుతులలో ఎంత స్ఫూర్తిని నింపింది.
పలువురికి సన్మానం..
అట్లాంటాలోని పలు స్థానిక, జాతీయ సంఘాల ప్రతినిధులందరినీ వేదికపైకి ఆహ్వానించి వారి సేవలను కొనియాడుతూ సన్మానించారు. ఎన్టీఆర్ కళారంగానికి చెందినవారు కావడంతో ఆయన శతజయంతి వేడుకల సందర్భంగా అట్లాంటాలోని కళాకారులైన స్థానిక గాయనీ గాయకులను, సంగీత, నృత్య పాఠశాలల గురువులు, సాహితీవేత్తలను ఘనంగా సన్మానించారు. పిల్లలకు ఫేస్ పెయింటింగ్ ఏర్పాటు చేయడంతో వారంతా ఈ కార్యక్రమంలో కోలాహలంగా తిరుగుతూ కనిపించారు. 2000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. నాన్వెజ్తో కూడిన పసందైన భోజనాలు అందించిన సంక్రాంతి రెస్టారెంట్ శ్రీనివాస్ నిమ్మగడ్డను నిర్వాహకులు అభినందించారు.
అలాగే, ఆడియో, వీడియో, ఫోటోగ్రఫీ, LED స్క్రీన్స్, డెకొరేషన్ సేవలందించిన బైట్ గ్రాఫ్ ప్రశాంత్ కుమార్ కొల్లిపర అండ్ టీం, ఫోటోగ్రఫీ సేవలందించిన శ్రీ ఫొటోస్ సురేష్ ఓలం అండ్ టీం, లాంబర్ట్ హై స్కూల్ క్రూలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. అట్లాంటా నగరంలో 2008లోనే NTR Trust స్థాపించి ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలు ఒక ఎత్తయితే.. తాజాగా విశ్వవిఖ్యాత, పద్మశ్రీ, స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు వేడుకలు నిర్వహించడం మరో ఎత్తు అని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సహకరించిన వారిలో అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్ లావు, అనిల్ యలమంచిలి, భరత్ మద్దినేని, మధుకర్ యార్లగడ్డ, శరత్ పుట్టి, ఇన్నయ్య ఎనుముల, రవి కల్లి, సాయిరాం కారుమంచి, సురేష్ బండారు, సుబ్బారావు మద్దాళి, వెంకట్ మీసాల, సురేష్ ధూళిపూడి, శ్రీనివాస్ రామిశెట్టి, కిరణ్ గోగినేని, శ్యామ్ మల్లవరపు, మహేష్ కొప్పు, రామ్ మద్ది, నగేష్ దొడ్డాక, వెంకట్ పోలాకం, సునీల్ దేవరపల్లి, శ్రీరామ్ రొయ్యల, కమల్ సాతులూరు, శ్రీనివాస్ ఉప్పు, సునీత పొట్నూరు, పూలని జాస్తి, ప్రియాంక గడ్డం, పూర్ణ వీరపనేని, సుధాకర్ బొర్రా, తిరుమల కొసరాజు, రామ్ నెక్కంటి, సూర్య, కృష్ణ ఇనపకుతిక, శశికుమార్ రెడ్డి దగ్గుల, వినయ్ మద్దినేని, రాజేష్ జంపాల, గిరి సూర్యదేవర, విజయ్ కొత్తపల్లి, మురళి బొడ్డు, సుధాకర్ బొడ్డు, వెంకీ గద్దె, సాయిబాబు మాదినేని, విజయ్ కొత్త, యశ్వంత్ జొన్నలగడ్డ, భరత్ అవిర్నేని, బాల మద్ద, చందు అవిర్నేని, శ్రీనివాస్ జీవీ, ముఖర్జీ వేములపల్లి, సత్య నాగేందర్ గుత్తుల, రుపేంద్ర వేములపల్లి, తిరు చిల్లపల్లి, వెంకట్ గోక్యాడ, వెంకట్ నల్లూరితో పాటు దాదాపు 100 మంది వాలంటీర్లు ఉన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అట్లాంటా ఎన్టీఆర్ ట్రస్టు ధన్యవాదాలు తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
suez canal: సూయిజ్ కాలువలో ఆగిపోయిన చమురు ట్యాంకర్
-
World News
china: తియానన్మెన్ స్క్వేర్ వద్దకు ప్రవేశాలపై ఆంక్షలు
-
Movies News
‘ది ఫ్యామిలీ మ్యాన్’.. కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటున్నావని నా భార్య అడిగింది: మనోజ్
-
Crime News
Suicide: నలుగురు పిల్లల్ని చంపేసి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి!
-
Sports News
WTC Final: ఫామ్పై ఆందోళన అవసరం లేదు.. కానీ, ఆ ఒక్కటే కీలకం: వెంగ్సర్కార్
-
Movies News
Siddharth: ‘టక్కర్’తో నా కల నెరవేరింది.. ఆయనకు రుణపడి ఉంటా: సిద్ధార్థ్