జన్మభూమి సేవకు పునరంకితమవుతాం.. తెదేపా ఆవిర్భావ వేడుకల్లో ప్రవాసులు
తెలుగుదేశం 40వ ఆవిర్భావ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో తెదేపా కార్యకర్తలు, అభిమానులు జెండాలు చేతపట్టి ‘కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా’ అనే పాటలతో సందడి చేశారు. జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు....
వైకాపా అరాచకాలను ఎండగడతాం.. తెదేపాను అధికారంలోకి తెస్తాం
ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లోని 200 నగరాల్లో ఘనంగా తెదేపా 40 వసంతాల వేడుకలు
జెండాలు చేతపట్టి జై తెలుగుదేశం అంటూ నినదించిన కార్యకర్తలు
పసుపు జెండాలతో వివిధ దేశాల్లో వాహనాల ర్యాలీలు
అమరావతి: తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో తెదేపా కార్యకర్తలు, అభిమానులు జెండాలు చేతపట్టి ‘కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా’ అనే పాటలతో సందడి చేశారు. ‘జై తెలుగుదేశం.....జై జై తెలుగుదేశం’ అంటూ నినాదాలు చేశారు. అధిక సంఖ్యలో అభిమానులు కార్లతో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పార్టీ అభిమానులు కుటుంబాలతో సహా హాజరయ్యారు. అధిక సంఖ్యలో మహిళలు, చిన్నారులూ వేడుకల్లో పాల్గొన్నారు.
తెదేపాను అధికారంలోకి తెస్తాం..
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు సమష్టిగా పనిచేస్తామని వివిధ దేశాల్లోని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వ దుర్మార్గపు పాలనలో ప్రజాజీవితం దుర్భరంగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతోందని.. వీటన్నింటినీ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాల్సిన అవసరం ఉందని, అప్పటి వరకు విశ్రమించబోమని ప్రతిజ్ఞ చేశారు.
న్యూజెర్సీ సహా 40 నగరాల్లో తెదేపా ఆవిర్బావ వేడుకలు..
40 వసంతాల వేడుకలను అమెరికాలోని అట్లాంటా, ఆస్టిన్, బే ఏరియా, బోస్టన్, చికాగో, డల్లాస్, డెట్రాయిట్, హూస్టన్. న్యూజెర్సీ తదితర 40 నగరాల్లో వైభవంగా నిర్వహించారు. తెదేపా సీనియర్ నాయకులు కోమటి జయరాం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ అభిమానులు హాజరయ్యారు. చికాగోలో బీద రవిచంద్ర, డల్లాస్లో కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ముళ్లపూడి బాపిరాజు, న్యూజెర్సీలో మన్నవ మోహన్కృష్ణ, కలపటపు రామ్ప్రసాద్, షార్లెట్లో ఆరిమిల్లి రాధాకృష్ణ తదితరులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
డెట్రాయిట్లో...
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం మాత్రమే నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని ఆకాంక్షిస్తోందని అమెరికాలోని డెట్రాయిట్ తెదేపా కౌన్సిల్ సభ్యులు కొనియాడారు. ఎన్నారై తెలుగుదేశం అమెరికా విభాగం ఆధ్వర్యంలో డెట్రాయిట్లోని విందు రెస్టారెంట్లో సురేశ్ పుట్టగుంట, కిరణ్ దుగ్గిరాల, దంతేశ్వరరావు, మనోరమ గొంది, సీత కావూరి, ఉమామహేశ్వరరావు ఒమ్మి, జోగేశ్వరరావు పెద్దబోయిన తదితరుల ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆంధ్రప్రదేశ్లోని తెదేపా నేతలు జూమ్ ద్వారా వారితో మాట్లాడారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గద్దె రామ్మోహన్రావు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్, తెదేపా అధికార ప్రతినిధి గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ తదితరులు ప్రసంగించారు.
యూకే, యూరప్లో...
యూకే, యూరోప్లోని 40 పైగా నగరాల్లో ఎన్నారై కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్నారై తెదేపా నాయకుడు వేణు మాధవ్ పోపూరి, యూరోప్ తెదేపా కౌన్సిలర్లు ప్రసన్న నాదెండ్ల, నరేశ్ మల్లినేని, చక్రి మొవ్వా, శ్రీకాంత్ యర్రం, మహేంద్ర తాళ్లూరి, నారాయణరెడ్డి, విక్రమ్ పరిటాల, శివరాం కూరపాటి, సురేశ్ కోరం, జయ్కుమార్ గుంటుపల్లి, భాస్కర్ అమ్మినేని, వెంకట్ కంతేటి, ప్రభాకర్ అమిర్నేని, గిరి దొమ్మేటి, శ్రీనివాస్ లగడపాటి, సుందర్రాజు మల్లవరపు, శ్రీకిరణ్ పరుచూరి, శ్రీనివాస్ పాలడుగు, భానూజి కుక్కాల, చందు నారా, శ్రీధర్ నారా, చందు జాస్తి, యశ్వంత్, రవితేజ లింగ, హర్ష చప్పిడి, మహేశ్వర్ కందుల, రూప్ తేజ, లీలా సాయి ఈదర, రవితేజ నల్లమోతు, నరేంద్ర ములకలపల్లి, సాయి కుర్రా, అభినయ్ కాపా, రవి కిరణ్ అర్వపల్లి, వేణు పంగులూరి, వంశీ నాగళ్ల తదితరులు పాల్గొన్నారు. హాట్ఫీల్డ్లో జరిగిన కార్యక్రమంలో తెదేపా ఆవిర్భావం నుంచి వివిధ వర్గాల సంక్షేమానికి చేసిన కృషిని శివరామ్ కూరపాటి వివరించారు.
ఐర్లాండ్లో....
ఐర్లాండ్లో మురళి రాపర్ల, జర్మనీలో తిట్టు మద్దిపట్ల, శివ, పారిస్లో మహేశ్ గొపునూరు, జెనాలో వపన్ జాగర్లమూడి, అనుదీప్ పచ్చాల, బెల్పాస్ట్లో దినేశ్ కుదరవల్లి, బ్రసెల్స్లో దినేశ్వర్మ, పోలాండ్లో చందు తదితరులు ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అనే నినాదాలు చేశారు. 40 వసంతాల కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?