BJP: చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోయాలని కేసీఆర్ కుట్రపన్నారు: మాజీ మంత్రి చంద్రశేఖర్
ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై భాజపా నేత, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై భాజపా నేత, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగోలులోని తట్టిఅన్నారం జె.కన్వెన్షన్లో భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అమరుల యాదిలో ఉద్యమ ఆకాంక్ష సాధన’ సభలో చంద్రశేఖర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘2001కి ముందు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూలదోయాలని కేసీఆర్ కుట్ర పన్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యేలను సంప్రదించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా 60 మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు. 61వ వ్యక్తిగా జ్యోతుల నెహ్రూను సంప్రదించారు. జ్యోతుల నెహ్రూ వెళ్లి చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు’’ అని వెల్లడించారు.
‘‘2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటైంది. అంతకు ముందు కేసీఆర్ గారు, నేను ఒకేసారి మంత్రులం అయ్యాం. మరలా జరిగిన ఎన్నికల తర్వాత కేసీఆర్కు మంత్రి పదవి రాలేదు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే కేసీఆర్కు అధికార దాహం ఎంత ఉందో చెప్పడానికి ఉదాహరణ మాత్రమే. కేసీఆర్కు మంత్రి పదవి రాని పరిస్థితుల్లో డిప్యూటీ స్పీకర్గా ఉండి కూడా చంద్రబాబుపై యుద్ధం ప్రకటించారు. తెలంగాణలో ఆరోజు ఉన్న ఎమ్మెల్యేల్లో చీలిక తేవాలని అనేక ప్రయత్నాలు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నేను.. మరికొంత మంది మిత్రులతో కలిసి చంద్రబాబును దించేయాలని కుట్ర పన్నారు. చంద్రబాబును దించేసిన వెంటనే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని భావించారు. ఈ క్రమంలో 3.. 4 నెలలు చర్చలు, ప్రయత్నాలు జరిగాయి. ఒక సమయంలో... చంద్రబాబుకు వ్యతిరేకంగా 60 మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు. చంద్రబాబును దించడానికి దగ్గరికొస్తున్నాం కాబట్టీ ఒకరోజు రాత్రి ప్లాన్ చేశాం. కేసీఆర్ ఏం చేప్పారంటే.. సీఎంను దించటానికి 60మంది ఎమ్మెల్యేలు చాలు. 20 హెలికాప్టర్లు తెచ్చుకుందాం. 20 హెలికాప్టర్లలో నేరుగా గవర్నర్ వద్దకు వెళ్దాం అని చెప్పారు. చంద్రబాబును దించేసి వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలని ఆకాంక్ష. కానీ, 61వ వ్యక్తిగా జ్యోతుల నెహ్రూను సంప్రదించారు. జ్యోతుల నెహ్రూ వెళ్లి చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు. కేసీఆర్కు ఉన్నంత అధికార దాహం ప్రపంచంలో ఎవరికీ ఉండకపోవచ్చు’’ అని చంద్రశేఖర్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించి మేడ్చల్ పరిసరాలలోని ఆస్తులపై విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరతామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. -
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
Lok Sabha Elections: ఐదో విడతలో మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, రాహుల్గాంధీ వంటి ప్రముఖులు ఉన్నారు. -
ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపొందుతుందని.. చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ పేర్కొన్నారు. -
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాజయం ఎదురు కాబోతోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పష్టం చేశారు. -
గెలిస్తే బాలీవుడ్కు వీడ్కోలు!.. మండీ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే బాలీవుడ్కు వీడ్కోలు పలుకుతానని హిమాచల్ప్రదేశ్లోని మండీ భాజపా అభ్యర్థి, సినీనటి కంగనా రనౌత్ పేర్కొన్నారు. -
బెంగాల్లో కాంగ్రెస్ కార్యాలయం ఎదుట పార్టీ అధ్యక్షుడు ఖర్గే పోస్టర్ల చెరిపివేత
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పోస్టర్లను, హోర్డింగ్లను దుండగులు చెరిపి వేశారు. -
రుణమాఫీ అమలుకు అడ్డుపడుతున్న భాజపా, భారాస
రైతులకు వెంటనే రుణమాఫీ అమలు కాకుండా భాజపా, భారాస నేతలే అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. -
విపక్ష నేతలంతా రావణుడి అనుచరులే..
విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలంతా రావణుడి అనుచరులని.. సనాతన ధర్మాన్ని, ప్రధాని మోదీని, భాజపాను, ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి మాట్లాడటమే వారి పని అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మండిపడ్డారు. -
ఆమ్ఆద్మీ పార్టీ అంతానికి ‘ఆపరేషన్ ఝాడూ’
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని ముప్పుగా భావిస్తున్న భాజపా తమ పార్టీని అణచేసేందుకు ‘ఆపరేషన్ ఝాడూ’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు. -
వైకాపా సోషల్మీడియా విభాగంపై కేసు
వైకాపా సోషల్ మీడియా విభాగంపై కేసు నమోదైంది. పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారాలు నిషిద్ధమైనా.. వైకాపా సోషల్ మీడియా విభాగం నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం కొనసాగించిందని విశాఖపట్నానికి చెందిన న్యాయ విద్యార్థి కొండేటి సోమశేఖర్ తగిన ఆధారాలతో ఈ నెల 12న కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేశారు. -
పోలీసులే.. నేరస్థులు: అంబటి రాంబాబు
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో తలలు పగులుతుంటే పోలీసులు స్పందించకుండా అలసత్వం వహించారని, అసలు నేరస్థులు పోలీసులేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. -
సూత్రధారులపై చర్యలు తీసుకోండి
తనపై జరిగిన హత్యాయత్నం ఘటనలో సూత్రధారులను గుర్తించి అరెస్టు చేయాలని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని సిట్ అధికారులను కోరారు. -
అప్పుడు లేని లేఖ.. ఇప్పుడెలా వచ్చింది?: తెదేపా
విజయనగరం తహసీల్దారు కార్యాలయం నుంచి పోస్టల్ బ్యాలట్ తరలింపుపై ఇంకా ఆందోళన సాగుతోంది. తాజాగా ఏఆర్వో, తహసీల్దారు రత్నం విడుదల చేసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. -
పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లెల్లో పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన ఘర్షణలో.. అక్కడ లేనివారిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని బాధితుడు మురళీధర్ వాపోయారు. -
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
సీఐని బెదిరించి, ఆయన విధులకు ఆటంకం కలిగించినందుకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఆయన బావమరిది పురపాలిక వైస్ఛైర్మన్ బంగారు మునిరెడ్డి, తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యకేసు నిందితుడు కుండా రవితో పాటు మరొకరిపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. -
మమత గురించి ఖర్గే చెప్పినా వినను: అధీర్
మమతా బెనర్జీ విషయంలో సంయమనం పాటించాలని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం చెబుతున్నా అంగీకరించేది లేదని బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధరి తేల్చిచెప్పారు. -
పెద్దలను మోదీ అలా అనొచ్చా!
లోక్సభ ఎన్నికల తరవాత విపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, అందులోని మిత్రపక్షమైన ఆప్ దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాకు యత్నిస్తుందని భాజపా ఆందోళనలో ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
సుస్థిర విధానాలతో సుసంపన్న భారత్
ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే దేశ ఆర్థిక రంగం ఒడుదొడుకులకు గురవుతుందని, స్టాక్ మార్కెట్లు పతనమవుతాయంటూ భాజపా నేతలు మదుపరుల్లో భయాందోళనలు రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. -
రాహుల్, అఖిలేశ్ సభలో తొక్కిసలాట
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పాల్గొన్న సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. -
రాహుల్ నోట మావోయిస్టుల భాష.. వాళ్లొస్తే పెట్టుబడులు రావు
బలవంతపు ధన సమీకరణ వంటి కొత్త పద్ధతుల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ యువరాజు (రాహుల్గాంధీని ఉద్దేశించి) మావోయిస్టుల భాష వింటే ఆ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఒకటికి యాభైసార్లు ఆలోచిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!