Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై అతిగా మాట్లాడొద్దు..!
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సీనియర్ నేత శశిథరూర్ పోటీ చేయనుండటంపై కొందరు హస్తం పార్టీ నేతలు బహిరంగంగానే విముఖత వ్యక్తం చేస్తున్నారు
అధికార ప్రతినిధులకు సూచించిన అధిష్ఠానం
దిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సీనియర్ నేత శశిథరూర్ పోటీ చేయనుండటంపై కొందరు హస్తం పార్టీ నేతలు బహిరంగంగానే విముఖత వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేత గౌరవ్ వల్లభ్ ఆయనపై విమర్శలు గుప్పించారు. దీంతో ఇది కాస్తా అంతర్గత విభేదాలకు దారితీస్తుండటంతో అధిష్ఠానం రంగంలోకి దిగింది. అధ్యక్ష ఎన్నికలు, పోటీ చేస్తున్న అభ్యర్థులపై పార్టీ అధికార ప్రతినిధులెవరూ అతిగా మాట్లాడొద్దని గట్టిగానే సూచించింది.
అధిష్ఠానం సూచనల మేరకు ఈ వ్యవహారంపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జైరాం రమేశ్.. పార్టీ అధికార ప్రతినిధులు, ఆఫీస్ బేరర్లకు సందేశం పంపినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అధ్యక్ష పదవికి పోటీ చేస్తోన్న అభ్యర్థులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని ఆ సందేశంలో స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘మనందరికీ వ్యక్తిగత అభిప్రాయాలు, ప్రాధాన్యాలు ఉంటాయి. కానీ, పార్టీ పరంగా మన బాధ్యత ఒక్కటే. అధ్యక్ష ఎన్నికల్లో ప్రజాస్వామ్య, పారదర్శక వ్యవస్థను కలిగి ఉన్న ఏకైక రాజకీయ పార్టీ మనది. దాన్ని మనమంతా చాటిచెప్పాలి. అధ్యక్ష పదవికి పోటీ చేసే ఏ అభ్యర్థికైనా నామినేషన్ వేసేందుకు 10 మంది పీసీసీ ప్రతినిధుల మద్దతు ఉంటే సరిపోతుంది. ఇంకెవరి అనుమతులు అవసరం లేదు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారిక ప్రతినిధులదే’’ అని జైరాం రమేశ్ పార్టీ సభ్యులను సూచించారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని శశిథరూర్ చెప్పిన తర్వాత అనేక మంది కాంగ్రెస్ నేతలు ఆయనపై విమర్శలు వ్యక్తం చేశారు. గౌరవ్ వల్లభ్ కూడా దీనిపై స్పందించారు. జీ23 నేతల లేఖను ప్రస్తావిస్తూ థరూర్ను విమర్శించారు. అదే సమయంలో ఈ అధ్యక్ష ఎన్నిక బరిలో ఉన్న మరో సీనియర్ నేత అశోక్ గహ్లోత్కు మద్దతు ప్రకటించారు. ‘‘గత ఎనిమిదేళ్లలో శశిథరూర్ పార్టీ కోసం చేసిన ఏకైక సహకారం.. సోనియాజీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమెకు లేఖ పంపడమే. ఇది నాలాంటి ఎంతోమంది పార్టీ కార్యకర్తలకు ఆవేదన కలిగించింది. కానీ, గహ్లోత్ మాత్రం మూడు సార్లు ముఖ్యమంత్రిగా, ఐదు సార్లు ఎంపీగా పార్టీకి ఎంతో సేవ చేశారు. మోదీ-షాను నేరుగా ఎదుర్కొ్న్నారు. అందువల్ల అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే దానిపై అందరికీ స్పష్టత ఉంది’’ అని వల్లభ్ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 24వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. ఒకరు కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే అక్టోబరు 17న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ పదవికి పలువురు సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ప్రధానంగా శశిథరూర్, గహ్లోత్ మధ్యే పోటీ ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే, గహ్లోత్కు పార్టీలో అత్యధికుల మద్దతు లభిస్తోంది. దీంతో ఆయనే తదుపరి అధ్యక్షుడి అయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు జప్తు
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది. -
మండపేట ఎమ్మెల్యేపై ఎట్రాసిటీ కేసు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం వల్లూరులో చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి మండపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన సమన్వయకర్త వేగుళ్ల లీలాకృష్ణ, తెదేపా నాయకుడు వల్లూరి వీరబాబుపై అంగర పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
నాతో చర్చకు మోదీ రారు: రాహుల్
ప్రధాని మోదీ తనతో బహిరంగ చర్చకు ఎన్నటికీ రారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. అదానీ వంటి కొందరు పారిశ్రామికవేత్తలతో సంబంధాలు, ఎలక్టోరల్ బాండ్ల దుర్వినియోగం వంటి అంశాలపై తాను అడిగే ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానాలు లేకపోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు.