Nara Lokesh: వెలిగొండ పూర్తి చేస్తానని ఆరుసార్లు తేదీలు మార్చారు!
‘ ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు 2019 ఎన్నికల్లో తెదేపా గౌరవాన్ని నిలబెట్టారు. నాలుగు సీట్లు గెలిపించారు. వైకాపా ఎనిమిది సీట్లతో పాటు తెదేపాలో గెలిచిన ఒక ఎమ్మెల్యేని తీసుకుంది.
నాలుగేళ్లలో వైకాపా చేసిన అభివృద్ధి శూన్యం
తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్
ఈనాడు, నెల్లూరు: ‘ ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు 2019 ఎన్నికల్లో తెదేపా గౌరవాన్ని నిలబెట్టారు. నాలుగు సీట్లు గెలిపించారు. వైకాపా ఎనిమిది సీట్లతో పాటు తెదేపాలో గెలిచిన ఒక ఎమ్మెల్యేని తీసుకుంది. అంటే జిల్లాను వైకాపా ఎంత అభివృద్ధి చేయాలి? నంబర్ 1గా ప్రకాశం ఉండాలి. నాలుగేళ్లలో జిల్లాలో చే¸సిన అభివృద్ధి శూన్యం. వెలిగొండ ప్రాజెక్ట్ పనులు ఏడాదిలో పూర్తి చేస్తానని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చి ఆరుసార్లు తేదీలు మార్చారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే పనులు పూర్తయ్యాయా? నేషనల్ ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు తెదేపా హయాంలో భూసేకరణ చేస్తే ఆ ప్రాజెక్ట్ను జగన్ పట్టించుకోలేదు. రాయల్టీ, కరెంట్ ఛార్జీలు, పన్నులు పెంచి గ్రానైట్ పరిశ్రమను దెబ్బతీశారు. దొనకొండ వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయాలని తెదేపా ప్రణాళిక సిద్ధం చేస్తే దానిని వైకాపా అటకెక్కించింది. గుండ్లకమ్మ ప్రాజెక్టును నాశనం చేశారు. గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టులోని నీరు మొత్తం ఖాళీ చేశారు. జగన్ అసమర్థత కారణంగా ఆ ప్రాజెక్టు పరిస్థితి ప్రమాదంలో పడింది’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెంలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని చంద్రబాబు 72 శాతం పనులు పూర్తి చేశారు. అయితే కమీషన్ల కోసం రివర్స్ టెండరింగ్కు వెళ్లి జగన్ ప్రాజెక్టుని ప్రమాదంలో పడేశారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి, గైడ్బండ్ కుంగిపోవడానికి జగన్ కక్కుర్తే కారణం. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలని జగన్ కోరుకుంటున్నారు’ అని లోకేశ్ విమర్శించారు.
డేటా దొంగ అవతారం ఎత్తారు
‘జగనన్న సురక్ష పేరుతో జగన్ డేటాదొంగ అవతారమెత్తారు. క్యాబినెట్ సమావేశం జరిగిన రోజు సచివాలయానికి వచ్చిన పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ‘సురక్ష కార్యక్రమంలో వాలంటీర్లు వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారు, ఫింగర్ ప్రింట్లతో పాటు, ఏ పార్టీకి చెందిన వారు? సాక్షికి అనుకూలమా కాదా అనే వివరాలు కూడా సేకరిస్తున్నారంటూ వస్తున్న వార్తలను నానీ వద్ద మీడియా ప్రస్తావించగా.. అలా జరిగే ప్రసక్తే లేదని లైవ్లో నిరూపిస్తా అంటూ వాలంటీర్కు ఆయన ఫోన్ చేశారు. ‘వేలిముద్రలు తీసుకుంటున్నాం, సాక్షికి, వైకాపాకు అనుకూలమా కాదా అని కూడా వివరాలు సేకరిస్తున్నామని ఆ వాలంటీరు సమాధానమిచ్చారు. అప్పుడది మీడియాలో లైవ్ ప్రసారం అవుతుండటంతో ఆయనకు ఫోన్ కూడా కట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజలు తమ వ్యక్తిగత సమాచారం ఇస్తే వైకాపా నాయకులు వారి ఆస్తి కూడా కొట్టేయడం ఖాయం’ అని లోకేశ్ అన్నారు. కార్యక్రమంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కందుకూరు తెదేపా ఇంఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు, దివి శివారం, ఇంటూరి రాజేశ్, చల్లా శ్రీనివాసులు, కోటపాటి జనార్దన్, యువగళం కోఆర్డినేటర్ కిలారి రాజేశ్, మీడియా కోఆర్డినేటర్ బి.వి.వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లాలోకి పాదయాత్ర..
యువగళం పాదయాత్ర 156వ రోజు నెల్లూరు జిల్లాలో పూర్తి చేసుకుని ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సరిహద్దుకు చేరుకుంది. సోమవారం నుంచి ప్రకాశం జిల్లాలో యాత్ర సాగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వయనాడ్ను వదులుకోనున్న రాహుల్.. ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ..?
Priyanka Gandhi: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాహుల్ గెలిచిన వయనాడ్ స్థానం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. -
జూనియర్లకు మంత్రి పదవులివ్వడాన్ని ఆహ్వానిస్తాం: అయ్యన్నపాత్రుడు
‘జూనియర్లకూ మంత్రులుగా పనిచేసే అవకాశం ఇవ్వాలి. వారికి పదవులివ్వడాన్ని ఆహ్వానిస్తాం. సీనియర్లుగా ప్రోత్సహిస్తాం, అండగా ఉంటాం’ అని నర్సీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. -
దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా వైకాపా తీరు: ఎమ్మెల్యే రఘురామ
‘దొంగే.. దొంగా దొంగా అన్నట్లు ఉంది వైకాపా నేతల తీరు. ఎవరూ ఎవరినీ ఏమీ అనకముందే వారిని కొట్టారంటూ దిల్లీలో విజయసాయిరెడ్డి పెడబొబ్బలు పెడుతున్నారు. -
చంద్రబాబు దార్శనికత రాష్ట్రానికి అవసరం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబుకు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సామాజికవేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్లో పోస్టు చేశారు. -
హింసాత్మక ఘటనలకు వైకాపా వాళ్లే బాధ్యులు
పల్నాడు జిల్లాలో తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య సహా అనేక మంది తెదేపా కార్యకర్తల్ని కిరాతకంగా చంపడం దారుణం కాదా? అని తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. -
ప్రజాపాలన మొదలు.. సీఎంగా చంద్రబాబు రాకతో మంచిరోజులు
ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ వచ్చిందని తెదేపా సీనియర్ నేతలు వర్ల రామయ్య, టీడీ జనార్దన్ తెలిపారు. -
పింఛన్ల పెంపు గొప్ప విషయం: రామకృష్ణ
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
మెగా డీఎస్సీపై తొలి సంతకం హర్షణీయం
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై చేయడాన్ని హర్షిస్తూ తెదేపా ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి, వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్లు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. -
ఎన్నికల ఫలితాలపై భాజపా సమీక్ష
వచ్చే నెల నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని భాజపా రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఆ పార్టీ పోటీ చేసిన శాసనసభ, లోక్సభ స్థానాల వారీగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం సమీక్షలు జరిగాయి. -
విజయసాయి విచారణ ఎదుర్కోవాల్సిందే: బుద్దా వెంకన్న
ఉత్తరాంధ్రను దోచుకున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని వదిలే ప్రసక్తే లేదని, సమగ్ర విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెదేపా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బుద్దా వెంకన్న హెచ్చరించారు. -
రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు సమష్టి కృషి
రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు సమష్టిగా కృషి చేద్దామని జనసేన నాయకులకు మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఏపీ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కోరారు. -
మహారాష్ట్రపై పట్టుకు గట్టి ప్రయత్నం
మహారాష్ట్రపై పూర్తి పట్టు సాధించేందుకు తమ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ గురువారం తెలిపారు. -
మాది చేతల ప్రభుత్వమని నిరూపించాం
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఒకే రోజు ఐదు ఫైళ్లపై సంతకాలు చేసి తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని నిరూపించామని మంత్రులు నిమ్మల రామానాయుడు, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఎస్.సవిత అన్నారు. -
పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరిస్తాం
పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించడంపై ఎక్స్ వేదికగా గురువారం ఆయన స్పందించారు. -
రాజ్యసభ బరిలో సునేత్రా పవార్
మహారాష్ట్రలోని బారామతి నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగి ఓడిపోయిన సునేత్రా పవార్ (ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య) రాజ్యసభ ఎన్నికల బరిలో దిగారు. -
కళ్లు మూసుకుంటే ఐదేళ్లూ గడిచిపోయాయి
అలా కళ్లు మూసుకుంటే 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. అలాగే ఇప్పుడూ కళ్లు మూసుకుంటే 2029 వచ్చేస్తుంది. అప్పుడు మనదే అధికారం. -
ధరలను మోదీ అదుపు చేయలేరు: కాంగ్రెస్
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మే నెల ద్రవ్యోల్బణం గణాంకాలపై కాంగ్రెస్ పార్టీ గురువారం విరుచుకుపడింది. -
బాధ్యతగా నడుచుకుంటా: తీన్మార్ మల్లన్న
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)తో గురువారం శాసనమండలిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రమాణం చేయించారు. -
కేసీఆర్, హరీశ్రావు, వెంకట్రామిరెడ్డిలకు ముందుంది ముసళ్ల పండగ: రఘునందన్రావు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఈడీ కేసు నమోదు చేసిందని.. ఆయనతో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిలకు ముసళ్ల పండగ ముందుందని మెదక్ భాజపా ఎంపీ రఘునందన్రావు అన్నారు. -
కేసీఆర్కు సంజాయిషీ నోటీసులా?: శ్రవణ్
పగలు, ప్రతీకారాలకు, రాజకీయ కుయుక్తులకు సీఎం రేవంత్రెడ్డి పాలన పరాకాష్ఠగా మారిందని భారాస నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. -
అమిత్ షాతో ‘సీరియస్ చర్చ’.. ఆ విషయం గురించే: తమిళిసై
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగిన సంభాషణపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టత ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆర్ఆర్ఆర్’ రికార్డును బ్రేక్ చేసిన ‘కల్కి’.. సోషల్ మీడియాలో వైరలవుతోన్న విశేషాలివే
-
‘నేను సమస్యల్లో పడతానేమో’: టీ20ల్లో అమెరికా చేతిలో పాక్ ఓటమిపై మిల్లర్ వ్యాఖ్య
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం.. ఎస్వీ యూనివర్సిటీలో సంబరాలు
-
సూపర్-8 పోరుకు ముందే.. ఆ ఇద్దరు స్వదేశానికి!
-
ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే సీఎం సతీమణి రాజీనామా