Ravichandran Ashwin: అందుకే అశ్విన్ టెస్టు మధ్యలోనే రావాల్సి వచ్చింది.. ఫ్యామిలీ ఎమర్జెన్సీపై సతీమణి వివరణ
రాజ్కోట్ టెస్టు మధ్యలోనే అశ్విన్ (Ravichandran Ashwin) మైదానాన్ని వీడి ఇంటికి తిరిగివచ్చాడు. అప్పుడు తలెత్తిన ఫ్యామిలీ ఎమర్జెన్సీని అతడి సతీమణి తాజాగా వివరించారు.
ఇంటర్నెట్ డెస్క్ : టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) రాజ్కోట్ టెస్టు (IND vs ENG 2024) మధ్యలోనే ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎమర్జెన్సీయే ఇందుకు కారణమని అప్పట్లో పేర్కొన్న బీసీసీఐ.. అసలు ఏమైంది అనే విషయం తెలపలేదు. ఆ తర్వాత దీనిపై అశ్విన్ కూడా ఎక్కడా స్పందించలేదు. అయితే తల్లి అనారోగ్యం వల్లే అశ్విన్ ఇంటికొచ్చేశాడని వార్తలొచ్చాయి. గురువారం నుంచి వందో టెస్టు ఆడుతున్న నేపథ్యంలో అశ్విన్ సతీమణి ప్రీతి ఈ విషయంపై తొలిసారి స్పందించారు. తల్లికి అనారోగ్యం కారణంగానే అశ్విన్ ఆ టెస్టు నుంచి అర్ధాంతరంగా వెనక్కి రావాల్సి వచ్చిందని ఆమె ఓ మీడియాకు తెలిపారు. ఆ రోజు ఏం జరిగిందో వివరించారు.
‘‘రాజ్కోట్ టెస్టు జరుగుతోంది. అశ్విన్ 500 వికెట్ల ఘనత సాధించాడు. కాసేపటికే మా పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చారు. మేమంతా అశ్విన్కు అభినందనలు చెబుతూ కాల్ చేస్తున్న వారికి సమాధానమిస్తున్నాం. ఆ సమయంలో మా అత్తయ్య ఒక్కసారిగా కుప్పకూలారు. దాంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఆ సమయంలో అశ్విన్కు ఈ విషయాన్ని వెంటనే చెప్పకూడదని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే రాజ్కోట్ నుంచి చెన్నైకి విమాన కనెక్టివిటీ సరిగా లేదు’’ అని ప్రీతి తెలిపారు.
‘‘దాంతో ఛెతేశ్వర్ పుజారాకు కాల్ చేసి పరిస్థితి వివరించాను. పుజారా కుటుంబం మాకు గొప్ప సాయం చేసింది. రాజ్కోట్ నుంచి అశ్విన్ చెన్నై రావడానికి ఉన్న మార్గాలను తెలుసుకున్నాం. స్కానింగ్ రిపోర్టులు చూశాక.. వైద్యులు కూడా అశ్విన్ తల్లి వద్ద ఉంటే బాగుంటుందని సూచించారు. వెంటనే అశ్విన్కు కాల్ చేశాం. ఇక్కడి పరిస్థితి వివరించాం. ఆ తర్వాత అతను తిరిగి కాల్ చేయడానికి మరో 20 - 25 నిమిషాలు పట్టింది. అశ్విన్ తన తల్లి దగ్గరకు రావడానికి సహకరించిన కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐకి ధన్యవాదాలు. అతడు ఇంటికి చేరుకోవడానికి వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ రోజు రాత్రి పొద్దుపోయాక అశ్విన్ ఇంటికి వచ్చాడు’’ అని ప్రీతి ఆ రోజు పరిస్థితిని వివరించారు.
అశ్విన్ నేరుగా ఆస్పత్రికి చేరుకుని ఐసీయూలో తల్లిని చూశాడు. ఆ తర్వాతే ఆమె కోలుకున్నారు. దీంతో తిరిగి రాజ్కోట్ చేరుకుని నాలుగో రోజు ఆటలో భాగమయ్యాడు. ‘‘తల్లిని ఐసీయూలో చూడటం అశ్విన్కు భారమైన క్షణంగా గడిచింది. ఆమె కోలుకున్న తర్వాత.. జట్టులో తిరిగి చేరాలని కోరాం. గేమ్ను మధ్యలోనే వదలడం అతడి వ్యక్తిత్వం కాదు. తన జట్టును గెలిపించలేకపోతే గిల్టీగా ఫీలవుతాడు. ఆ రెండు రోజులు తల్లి కోసం పడిన ఆరాటాన్ని గ్రహించాను’’ అని ప్రీతి వివరించారు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో భాగంగా ధర్మశాల వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్ అశ్విన్ కెరీర్లో వందోది కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!