Rohit Sharma: రోహిత్‌ గ్రాండ్‌ ఎంట్రీ.. హెలికాప్టర్‌లో ధర్మశాలకు చేరుకున్న కెప్టెన్‌

ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టు(IND vs ENG) ఆడేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది.

Published : 05 Mar 2024 16:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌(IND vs ENG)ను 3-1తో కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా.. ధర్మశాలలో జరిగే చివరి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే జట్టు సభ్యులు అక్కడికి చేరుకోగా.. కాస్త ఆలస్యంగా సారథి రోహిత్‌శర్మ(Rohit Sharma) గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ధర్మశాలకు అతడు ప్రైవేట్‌ హెలికాప్టర్‌లో రావడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది.

అశ్విన్‌ మ్యాజికా.. బెయిర్‌స్టో షోనా.. వందో టెస్టులో మెరిసేదెవరో!

ఈనెల 7 నుంచి ఆఖరి టెస్టు జరగనుంది. ఇందుకోసం ముందుగానే జట్టు సభ్యులంతా అక్కడికి చేరుకున్నారు. రోహిత్‌ మాత్రం మంగళవారం హెలికాప్టర్‌లో ధర్మశాలకు వచ్చి జట్టుతో చేరిపోయాడు. రాంచీ టెస్టు అనంతరం రోహిత్‌.. కాస్త విరామం తీసుకుని గుజరాత్‌ జామ్‌నగర్‌లో జరిగిన అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు హాజరయ్యాడు. సతీమణి రితికాతోపాటు ఈ ఈవెంట్‌లో మెరిశాడు. తర్వాత ధర్మశాలకు చేరుకున్నాడు.

ఇంగ్లాండ్‌తో నామమాత్రమైన ఆఖరి టెస్టులోనూ విజయం సాధించి.. తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని రోహిత్‌ సేన చూస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని