ఐపీఎల్ది గట్టి బుడగేనా? నిర్వహణకు సవాళ్లెన్నో!
జరుగుతుందో లేదోనన్న పొట్టి క్రికెట్ వేడుక జరుగుతుందని తెలియగానే అందరూ ఎగిరి గంతేశారు. జరిగేది భారత్లో కాదు యూఏఈలో అన్నప్పటికీ టీవీ తెరల్లో చూడొచ్చని ఆనందించారు. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు లీగ్ అనగానే ఇక ప్రతిరోజూ పండగే అని భావించారు.....
స్పాన్సర్, ఫిట్నెస్, కరోనా, కుటుంబ సమస్యలు
బీసీసీఐ, ఫ్రాంచైజీలు ఏం చేయనున్నాయి?
జరుగుతుందో లేదోనన్న పొట్టి క్రికెట్ వేడుక జరుగుతుందని తెలియగానే అందరూ ఎగిరి గంతేశారు. జరిగేది భారత్లో కాదు యూఏఈలో అన్నప్పటికీ టీవీ తెరల్లో చూడొచ్చని ఆనందించారు. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు లీగ్ అనగానే ఇక ప్రతిరోజూ పండగే అని భావించారు. అభిమానుల వైపు నుంచి ఓకే గానీ బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి, ఆటగాళ్లు ఎదుర్కొనే సవాళ్లు మాత్రం అత్యంత కఠినంగా ఉండబోతున్నాయి. ఈ కరోనా కాలం పెట్టే పరీక్షలు ఏంటి? అవెలా ఉండనున్నాయో తెలుసా?
కొత్త స్పాన్సర్ దొరికేనా?
నిజానికి ఐపీఎల్ మార్చి ఆఖర్లో మొదలై మేలో ముగియాల్సిన వేడుక. కొవిడ్-19 వల్ల వాయిదా పడింది. ప్రపంచకప్, ఆసియాకప్ వాయిదాతో అనుకూలమైన విండో దొరికింది. కానీ ఈ సీజన్ కుదరకపోతే బీసీసీఐ దాదాపు రూ.4,500 కోట్ల వరకు నష్టపోయేది. సాధారణంగా భారత్లో నిర్వహిస్తే టోర్నీ నిర్వహణకు అయ్యే ఖర్చు తక్కువే. ఇప్పుడు యూఏఈలో కాబట్టి ఎక్కువగానే ఖర్చు చేయాల్సి రావొచ్చు. అందులోనూ ఖాళీ స్టేడియాల్లోనే కాబట్టి గేట్మనీ రాదు. ఫ్రాంచైజీలు ఆ మేరకు నష్టపోక తప్పదు. యాజమాన్యాలు కొంతైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి. దీనికి తోడు ‘చైనా వస్తు బహిష్కరణ’ సెగ బోర్డుకు గట్టిగానే తగిలింది. దాంతో టైటిల్ స్పాన్సర్ హోదా నుంచి తప్పుకొనేందుకు వివో సిద్ధమైంది. అంటే రూ.440 కోట్ల వరకు ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. మరి ఈ నష్టాన్ని పూడ్చుకొనేందుకు అదే స్థాయిలో మరో స్పాన్సర్ దొరకడం కరోనా కాలంలో కష్టమే. అందులో సగం చెల్లించేందుకైనా ఒక్కరు ముందుకొచ్చినా గొప్పేనని మార్కెట్ నిపుణుల మాట. మరి ఈ సవాల్ను బోర్డు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
గట్టి బుడగేనా?
ఐపీఎల్కు మరో సవాల్ బయో బుడగ! వెస్టిండీస్, పాకిస్థాన్తో సిరీసులకు ఇంగ్లాండ్ ఇదే ప్రయోగం చేసి విజయవంతమైంది. అయితే అక్కడ కేవలం రెండు జట్లు మాత్రమే సురక్షిత వాతావరణంలో ఉన్నాయి. మొత్తంగా 50 మందికి మించి ఉండరు. కానీ ఐపీఎల్లో మాత్రం అత్యంత కష్టం. ఒక్కో జట్టులో కనీసం 20+ ఆటగాళ్లు ఉంటారు. కోచింగ్, ఫ్రాంచైజీ సిబ్బంది అదనం. ఒక్కో ఫ్రాంచైజీ నుంచి అందరూ కలిపి 35 మంది ఉన్నా ఎనిమిది ఫ్రాంచైజీలకు 280 మంది అవుతారు. వీరే కాకుండా ఐపీఎల్ నిర్వహక కమిటీ సభ్యులు, అధికారులు, సాంకేతిక, అంపైరింగ్, లాజిస్టిక్స్, ప్రసారదారు, రవాణా సిబ్బందీ ఉంటారు. అంటే ఈ లీగ్లో మొత్తంగా 350-400 మంది ఉండే అవకాశం ఉంది. అంత మందితో బయో బబుల్ విజయవంతమైతే చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఆటగాళ్లలో ఏ ఒక్కరికైనా కొవిడ్-19 సోకితే ఏం చేస్తారో ఇంకా నిర్ణయించలేదు! క్వారంటైన్, చికిత్స, ప్రైమరీ కాంటాక్టుల పరంగా ఏం చేస్తారో తెలియదు.
ఫిట్నెస్ ఎలా?
లీగ్ పరంగా ఆటగాళ్లు ఎదుర్కొనే సమస్యలు చాలానే ఉన్నాయి. లాక్డౌన్ వల్ల వారంతా దాదాపుగా నాలుగు నెలలు ఇంటికే పరిమితం అయ్యారు. ఇప్పుడు వీరు దేహదారుఢ్యం సంతరించుకోవడం అత్యంత ముఖ్యం. అయితే ఇదంత సులభం కాదు. మ్యాచ్ నిడివి మూడున్నర గంటలే అయిన ఆడేందుకు అవసరమైన ఫిట్నెస్ స్థాయి మాత్రం చాలా ఎక్కువ. సీజన్ ఆరంభానికి ఇంకా ఉన్నది నెల రోజుల కాలమే. ఈ స్వల్ప సమయంలో ఆటగాళ్లంతా వేగంగా లయ అందుకోవాలి. బౌలర్లకు ఇదెంతో కష్టం. అతిగా శ్రమిస్తే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే గాయాల పాలవుతారు. ప్రస్తుతం ఎంఎస్ ధోనీ, కోహ్లీ, రోహిత్ సహా కొందరు క్రికెటర్లు ఇంటి వద్దే సాధన చేస్తున్నారు. సురేశ్ రైనా, రిషభ్ పంత్, మహ్మద్ షమి సహా అనేక మంది సొంత రాష్ట్రాలకు చెందిన మైదానాల్లో శిక్షణ పొందుతున్నారు. దుబాయ్, షార్జా, అబుదాబి వాతావరణానికి అలవాటు పడాలని 20 రోజులు ముందుగానే ఆటగాళ్లను దుబాయ్కి చేర్చేందుకు ఫ్రాంచైజీలు పనులు మొదలెట్టాయి.
ఫ్యాన్స్కు ప్రత్యామ్నాయం ఏంటి?
ఇన్నాళ్లుగా ఆటగాళ్లు వేలాది మంది అభిమానుల మధ్య ఆడేందుకు అలవాటు పడ్డారు. వారు ఉత్సాహపరుస్తుంటే పరుగుల వరద పారించేవారు. కళ్లు చెదిరే సిక్సర్లు బాదేవారు. బౌలర్లు సైతం కసికసిగా బంతులు విసిరేవారు. హఠాత్తుగా వారిప్పుడు ఖాళీ స్టేడియాల్లో ఆడాల్సి వస్తోంది. ఇది క్రికెటర్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియదు. తమ ఆటలో తీవ్రతేమీ తగ్గదని కోహ్లీ గతంలో చెప్పినప్పటికీ అభిమానులు ఉన్నప్పటి మజా, అనుభూతి ఎప్పటికీ రాదన్నాడు. ఈ లోటును పూడ్చేందుకు స్టేడియంలో కటౌట్లు పెట్టడం, అభిమానుల కేరింతల ధ్వనులు వినిపించడం వంటివి నిర్వాహకులు చేపట్టొచ్చు. ఇక మైదానంలో కరోనా కట్టుబాట్లకు వారెలా సర్దుకుపోతారన్నది మరో సవాల్. ఇప్పటికే బంతిపై ఉమ్మి రుద్దడాన్ని ఐసీసీ నిషేధించింది. వికెట్లు తీసినప్పుడు ఒకరినొకరు ముట్టుకోవడానికి వీల్లేదు. కౌగిలించుకొని మనసారా అభినందించడం కుదరదు. ఇది వారిని మానసికంగా దెబ్బతీసేదే!
కుటుంబ సభ్యులు వస్తారా?
ద్వైపాక్షిక సిరీసులు ఆడేటప్పుడు కుటుంబ సభ్యులను కలిసేందుకు క్రికెటర్లకు అనుమతి ఉండదు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడూ అంతే. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇందుకు భిన్నంగా ఉంటుంది. భార్యా పిల్లలతో డ్రస్సింగ్ రూముల్లో సందడి వాతావరణం నెలకొటుంది. స్టేడియంలో కూర్చొని వారు ప్రోత్సహించడం కనిపిస్తుంది. చెన్నై సూపర్కింగ్స్ ఇందుకు సరైన ఉదాహరణ. ధోనీ, రైనా, జడ్డూ, భజ్జీ, రాయుడు వంటి క్రికెటర్ల జీవిత భాగస్వాములు, పిల్లలు సరదాగా ఉండటం మనకు తెలిసిందే. ఐపీఎల్లో రోహిత్ శర్మ తన సతీమణి రితిక సజ్దె లేకుండా అస్సలు కనిపించడు. మరి యూఏఈకి కుటుంబ సభ్యులను అనుమతించడంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ అంశాన్ని ఫ్రాంచైజీలకే వదిలేస్తున్నామని బీసీసీఐ చెప్పింది. అయితే కచ్చితమైన నిర్వాహక విధాన ప్రక్రియ (ఎస్ఓపీ) లేకుండా నిర్ణయం తీసుకోవడం కష్టమని యాజమాన్యాలు వాదిస్తున్నాయి. కుటుంబీకులు కూడా వస్తే బయో బుడగ మరింత కష్టం. భౌతిక దూరం పరంగా ఇబ్బందులు తలెత్తుతాయి.
పరీక్షించే పరీక్షలు?
ఆటగాళ్లు, సిబ్బందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం మరో సవాల్. డోపింగ్ కోసం తప్ప గతంలో ఇలా పరీక్షలు చేయించుకోవడం వారికి అలవాటు లేదు. మానసికంగా ఇది వారిపై పెను ప్రభావమే చూపించే అవకాశం ఉంది! ఎందుకంటే నమూనాలు తీసుకున్న తర్వాత ఫలితాలు ఎలా వస్తాయోనని ఆందోళన చెందడం సహజం. ఎందుకంటే వాటిపై ఆధారపడే లీగ్లో ఆడాల్సి ఉంటుంది. పెద్ద క్రికెటర్లకు ఒత్తిడి అలవాటే కాబట్టి ప్రశాంతంగా ఉండగలరు. యువ క్రికెటర్లు సర్దుకుపోవడం మాత్రం కష్టం. వారిపై ఒత్తిడి లేకుండా చూడాలి. నిబంధనల ప్రకారం యూఏఈలో సాధన ఆరంభించాలంటే కనీసం అయిదుసార్లు నెగెటివ్ రావాలి. టోర్నీలోనూ ప్రతి ఐదు రోజులకు ఒకసారి పరీక్షలు చేస్తారు. ఐపీఎల్ ఆడే భారత ఆటగాళ్లు తమ జట్లతో 14 రోజులు క్వారంటైన్ వెళ్లేందుకు వారం ముందు ఒక్కో రోజు వ్యవధిలో రెండు ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయించుకోవాలి. పాజిటివ్ వస్తే 14 రోజుల తర్వాత 24 గంటల వ్యవధిలో రెండుసార్లు చేయించుకోవాలి. అప్పుడు నెగెటివ్ వస్తేనే యూఏఈకి టికెట్ లభిస్తుంది. మొత్తంగా ఈ ప్రకియంతా ఆటగాళ్లను మానసికంగా కుంగదీసే అవకాశం లేకపోలేదు.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
మైదానంలో దిగి ఆడే ప్లేయర్లే కాదు... డగౌట్లో కూర్చుని జట్టు వ్యూహాలను రచించే కోచ్లూ ముఖ్యమే. ఐపీఎల్లో అలా కీలకంగా నిలుస్తూ.. ఇంపాక్ట్ చూపిస్తున్న కోచ్లు వీరే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?
ఈ సీజన్లో బెంగళూరు పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఎనిమిదింట్లో ఏడు ఓడి.. ప్లేఆఫ్స్ అవకాశాలకు దాదాపు దూరమైంది . -
200+ స్కోరు... చాలడం లేదు బాసూ!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం చివరి వరకూ జట్లకు రావడం లేదు. -
సగం IPL పూర్తి.. బాదుడు నుంచి ఫ్లైయింగ్ కిస్ వరకు... ఆసక్తికర విశేషాలివే!
సుదీర్ఘమైన ఐపీఎల్ టోర్నీలో సగం మ్యాచ్లు ముగిశాయి. అనూహ్యంగా కొన్ని జట్లు చెలరేగగా.. మరికొన్ని డీలా పడిపోయి పాయింట్ల పట్టికలో అడుగుకు చేరాయి. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
వీరుడొచ్చాడు.. సన్రైజర్స్కు దొరికిన మరో వార్నర్
సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్లో ఓ ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head). -
పరుగులివ్వడు.. వికెట్లు వదలడు... బెంబేలెత్తిస్తున్న బుమ్రా
ఐపీఎల్లో అదరగొడుతున్న బౌలర్ల జాబితా రాస్తే తొలి స్థానంలో కనిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. అతని బౌలింగ్లో ఆడటానికి బ్యాటర్లు బాగా ఇబ్బందిపడుతున్నారు. -
వీళ్లు ఆడితే మామూలుగా ఉండదు!
ఐపీఎల్.. ఈ టోర్నీ పేరు చెప్పగానే వెస్టిండీస్ ఆటగాళ్లే గుర్తొస్తారు. గత 16 ఏళ్లుగా కరీబియన్ ఆటగాళ్ల విన్యాసాలే అభిమానుల మనసుల్లో మెదులుతాయి. ఎందుకంటే తమ ఆటతోనే కాదు తమ హవభావాలతో మైదానంలో, మైదానం బయట ఈ విండీస్ వీరుల సందడి అంతాఇంతా కాదు. -
‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’.. సత్తా చాటేందుకు విదేశీ సంచలనాల తహతహ
ఐపీఎల్లో తమ సత్తా నిరూపించుకోవడానికి ఆటగాళ్లు ఎదురు చూస్తుంటారు. ఫామ్ను అందుకోవడంతోపాటు ఫ్రాంచైజీ దృష్టిలో పడాలనేది కొందరి ఆశ. -
నితీశ్ రెడ్డి.. భారత్ క్రికెట్కు మరో పేస్ ఆల్రౌండర్ లభించినట్లేనా?
హైదరాబాద్ తరఫున మరో ఆణిముత్యం వంటి ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. అదీనూ తెలుగు కుర్రాడు కావడం ఇక్కడ విశేషం. జట్టును గెలిపించే ప్రదర్శన చేయడం అభిమానులను ఆకట్టుకుంది. -
ఫామ్తో తంటాలా.. ఆర్సీబీ ఉందిగా!
ఈ ఐపీఎల్ సీజన్లో బెంగళూరుపై ఫామ్లో లేని ఆటగాళ్లు కూడా చెలరేగుతున్నారు. అంతేకాదు వారే మ్యాచ్ విన్నర్లుగా అవతరిస్తున్నారు. -
అప్పుడు వేస్ట్.. ఇప్పుడు బెస్ట్... ‘విఫల’ ముద్ర తొలగించుకున్న బ్యాటర్లు
ఐపీఎల్లో ఇప్పటివరకు సరిగ్గా ఆడని కొంతమంది ప్లేయర్లు ఈ సీజన్ ఐపీఎల్లో అదరగొట్టేస్తున్నారు. వాళ్లెవరు, వాళ్ల సంగతేంటో చూద్దాం! -
యశ్ ఠాకూర్.. ధోనీలా మారదామని వచ్చి.. పేసర్గా అదరగొట్టి!
లఖ్నవూ పేస్ బౌలర్లు పెను సంచలనంగా మారారు. ఇదివరకు మయాంక్ యాదవ్ తన ఫాస్ట్తో బెంబేలెత్తించగా.. తాజాగా యశ్ ఠాకూర్ అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్పై దిల్లీ విజయం
-
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్పై స్పందించిన కంగనా
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM