Ayush Badoni: టీమ్ఇండియాకు ఎంపికవ్వకుండానే.. మెరుస్తోన్న భారత కుర్రాళ్లు
భారత్లో టీ20 లీగ్ అంటేనే యువ ఆటగాళ్లు ప్రతిభను చాటుకునే వేదిక. అవకాశం రావాలే కానీ.. తమలోని అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తారు...
ఇంటర్నెట్డెస్క్: భారత్లో టీ20 లీగ్ అంటేనే యువ ఆటగాళ్లు ప్రతిభను చాటుకునే వేదిక. అవకాశం రావాలే కానీ.. తమలోని అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ప్రస్తుతం జరుగుతోన్న 15వ సీజన్లోనూ అచ్చం ఇలాంటి కుర్రాళ్లే ముగ్గురు ఉన్నారు. వారే ఆయుష్ బదోని, తిలక్ వర్మ, లలిత్ యాదవ్. ఇప్పటివరకు ఆడింది రెండు, మూడు మ్యాచ్లే అయినా వీరు రాణిస్తోన్న తీరు గొప్పగా ఉంది.
ఆయుష్ బదోని:
(Photo: Ayush Badoni Instagram)
ఫిబ్రవరిలో జరిగిన వేలంలో కొత్త ఫ్రాంఛైజీ లఖ్నవూ టీమ్ కనీస ధర రూ.20లక్షలకే సొంతం చేసుకున్న ఆటగాడు ఆయుష్ బదోని. ఈ సీజన్లో గుజరాత్తో ఆడిన తొలి మ్యాచ్లోనే అరంగేట్రం చేసిన అతడు (54; 41 బంతుల్లో 4x4, 3x6) అర్ధ శతకంతో మెరిశాడు. ప్రత్యర్థులు చురకత్తుల్లాంటి బంతులు సంధిస్తున్నా ఏమాత్రం భయపడకుండా ఆడాడు. 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును దీపక్ హుడా (55; 41 బంతుల్లో 6x4, 2x6)తో కలిసి ఆదుకున్నాడు. ఇక చెన్నైతో ఆడిన రెండో మ్యాచ్లోనూ 211 పరుగుల భారీ ఛేదనలో.. బదోని (19; 9 బంతుల్లో 2x6) చివర్లో మెరుపు బ్యాటింగ్ చేసి విలువైన పరుగులు అందించాడు. తాజాగా హైదరాబాద్తో ఆడిన మ్యాచ్లోనూ (19; 12 బంతుల్లో 3x4) ధాటిగా ఆడాడు. ఇలా ఇప్పటివరకు మొత్తం 3 మ్యాచ్లు ఆడిన బదోని 148.38 స్ట్రైక్రేట్తో 92 పరుగులు చేశాడు. దీంతో టీమ్ఇండియాకు ఎంపికవ్వకుండానే లఖ్నవూ జట్టు తరఫున అదరగొడుతున్నాడు.
తిలక్ వర్మ:
(Photo: Tilak Varma Instagram)
ప్రతిభావంతులైన యువకులను ప్రోత్సహించడంలో ముంబయి టీమ్ ముందువరుసలో ఉంటుంది. ఆ జట్టు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన ఆటగాళ్లు ఇప్పుడు టీమ్ఇండియా తరఫున ఆడుతున్నారు. అలానే ఇప్పుడు అదే జట్టు తరఫున అవకాశం దక్కించుకున్న యువ ఆటగాడు తిలక్ వర్మ. మెగా వేలంలో రూ.1.7 కోట్ల ధర దక్కించుకున్న ఇతడు ముంబయికి న్యాయం చేస్తున్నాడు. దిల్లీతో తలపడిన తొలి మ్యాచ్లో (22; 15 బంతుల్లో 3x4) పరుగులు చేసి.. తర్వాత రాజస్థాన్తో ఆడిన మ్యాచ్లో (61; 33 బంతుల్లో 3x4, 5x6) మెరుపులు మెరిపించాడు. దీంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఈ రెండు మ్యాచ్ల్లో ముంబయి ఓటమిపాలైనా తిలక్ వర్మకు బ్యాట్స్మన్గా మంచి గుర్తింపు దక్కింది. ఈ క్రమంలోనే ఆడిన 2 మ్యాచ్ల్లో 172.91 స్ట్రైక్రేట్తో 83 పరుగులు చేశాడు. దీంతో అతడు టీమ్ఇండియా భవిష్యత్ బ్యాట్స్మన్గా ఆశలు పెంచుతున్నాడు.
లలిత్ యాదవ్:
(Photo: Lalith Yadav Instagram)
ఇక టీమ్ఇండియాకు ఎంపికవ్వకుండానే ఈసారి బ్యాటింగ్లో అలరిస్తోన్న మరో యువ ఆటగాడు లలిత్ యాదవ్. గతేడాది ఈ టీ20 లీగ్లో అరంగేట్రం చేసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే, అతడిపై నమ్మకం ఉంచిన దిల్లీ ఈ సీజన్ మెగా వేలంలో రూ.65 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాన్ని అందింపుచుకున్న అతడు ముంబయితో ఆడిన తొలి మ్యాచ్లో (48 నాటౌట్; 38 బంతుల్లో 4x4, 2x6) ధనాధన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. దీంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆపై గుజరాత్తో జరిగిన మ్యాచ్లో (25; 22 బంతుల్లో 2x4, 1x6) బాగా ఆడినా ఊహించని పరిస్థితుల్లో రనౌటయ్యాడు. ఇలా ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనే 121.66 స్ట్రైక్రేట్తో మొత్తం 73 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ ముగ్గురూ ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్లుగా నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
ఈ ఏడాది ఐపీఎల్ (IPL)లో అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాంటి కొన్ని సంఘటనలు, విమర్శలు ఇవిగో... -
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ఎట్టకేలకు మళ్లీ జాతీయజట్టులోకి వచ్చాడు. పొట్టి కప్ కోసం ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కిన విషయం తెలిసిందే. -
కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వదిలేస్తాడా? వచ్చే మెగా వేలానికి ముందు భారీ షాక్ తప్పదా?
హైదరాబాద్ చేతిలో ఓడిపోవడం లఖ్నవూ కెప్టెన్పై తీవ్ర ప్రభావం పడేలా ఉంది. అంతకుముందు కోల్కతా చేతిలో ఘోర ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే. -
ఇంపాక్ట్ అవసరమా! వద్దంటున్న మాజీలు.. వచ్చే సీజన్లో ఉంటుందా?
క్రికెట్ ఆట ఆడేది పదకొండు మందే.. కానీ ఒక ఆటగాడిని జట్టులోకి అదనంగా చేర్చుకుని బౌలింగ్, బ్యాటింగ్లోనూ ఉపయోగించుకోవడమే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన (impact player rule). -
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
ఐపీఎల్లో మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోర్లు నమోదవుతూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే, టాప్ -4లో నిలిచి ప్లేఆఫ్స్కు అర్హత సాధించే జట్లేవనేది ఆసక్తికరంగా మారింది. -
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
మైదానంలో దిగి ఆడే ప్లేయర్లే కాదు... డగౌట్లో కూర్చుని జట్టు వ్యూహాలను రచించే కోచ్లూ ముఖ్యమే. ఐపీఎల్లో అలా కీలకంగా నిలుస్తూ.. ఇంపాక్ట్ చూపిస్తున్న కోచ్లు వీరే. -
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న నిలిచిన బెంగళూరు జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్లే. స్టార్లు ఉన్నా జట్టుగా ఆడి విజయం సాధించడంలో విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?
ఈ సీజన్లో బెంగళూరు పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఎనిమిదింట్లో ఏడు ఓడి.. ప్లేఆఫ్స్ అవకాశాలకు దాదాపు దూరమైంది . -
200+ స్కోరు... చాలడం లేదు బాసూ!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం చివరి వరకూ జట్లకు రావడం లేదు. -
సగం IPL పూర్తి.. బాదుడు నుంచి ఫ్లైయింగ్ కిస్ వరకు... ఆసక్తికర విశేషాలివే!
సుదీర్ఘమైన ఐపీఎల్ టోర్నీలో సగం మ్యాచ్లు ముగిశాయి. అనూహ్యంగా కొన్ని జట్లు చెలరేగగా.. మరికొన్ని డీలా పడిపోయి పాయింట్ల పట్టికలో అడుగుకు చేరాయి. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
వీరుడొచ్చాడు.. సన్రైజర్స్కు దొరికిన మరో వార్నర్
సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్లో ఓ ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head). -
పరుగులివ్వడు.. వికెట్లు వదలడు... బెంబేలెత్తిస్తున్న బుమ్రా
ఐపీఎల్లో అదరగొడుతున్న బౌలర్ల జాబితా రాస్తే తొలి స్థానంలో కనిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. అతని బౌలింగ్లో ఆడటానికి బ్యాటర్లు బాగా ఇబ్బందిపడుతున్నారు. -
వీళ్లు ఆడితే మామూలుగా ఉండదు!
ఐపీఎల్.. ఈ టోర్నీ పేరు చెప్పగానే వెస్టిండీస్ ఆటగాళ్లే గుర్తొస్తారు. గత 16 ఏళ్లుగా కరీబియన్ ఆటగాళ్ల విన్యాసాలే అభిమానుల మనసుల్లో మెదులుతాయి. ఎందుకంటే తమ ఆటతోనే కాదు తమ హవభావాలతో మైదానంలో, మైదానం బయట ఈ విండీస్ వీరుల సందడి అంతాఇంతా కాదు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్