జల పురాణం!
అది మన విశ్వంలో అతి చిత్రమైన వాటిల్లో ఒకటి. మన ఒంట్లో ఉంటుంది. తినే తిండిలో ఉంటుంది. అన్ని ప్రాణులకు అత్యవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే.. అది లేకపోతే మన మనుగడే లేదు. అలాగని దాన్ని ఎన్నడూ సంపూర్ణంగా వాడుకోలేం. ఒక స్థితి నుంచి మరొక స్థితికి చేరుకుంటూ పునర్వినియోగమవుతూ వస్తుందంతే.
ఇది ప్రపంచ జల వారం
ఒక పెద్ద నీటి బిందువులో సుమారు 3,000,000,000,000,000,000,000 అణువులు ఉంటాయి!
అది మన విశ్వంలో అతి చిత్రమైన వాటిల్లో ఒకటి. మన ఒంట్లో ఉంటుంది. తినే తిండిలో ఉంటుంది. అన్ని ప్రాణులకు అత్యవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే.. అది లేకపోతే మన మనుగడే లేదు. అలాగని దాన్ని ఎన్నడూ సంపూర్ణంగా వాడుకోలేం. ఒక స్థితి నుంచి మరొక స్థితికి చేరుకుంటూ పునర్వినియోగమవుతూ వస్తుందంతే. చెట్లు, జంతువులు, నదులు, సముద్రాలు, వాతావరణం మధ్య నిరంతరం మారుతూ వస్తుంది. ఇంతటి విచిత్రమైనదీ, అపురూపమైనదీ ఏంటో తెలుసా? నీరు! సమస్త ప్రాణికోటి జీవనానికి మూలాధారమైన దీనికి ఇంతటి విశిష్టత ఎలా లభించింది?
ఇతర గ్రహాల్లో నీరు ఉండొచ్చు గాక. మన సౌర మండలంలో ఎక్కువ మొత్తంలో నీరున్న గ్రహం మాత్రం కచ్చితంగా భూమే. ఇదే భూమికి ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఇంతకీ నీరంటే? రెండు హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువు కలయికతో ఏర్పడిన ఓ మామూలు అణువు. శాస్త్రీయంగా చెప్పాలంటే హెచ్2ఓ. మన విశ్వంలో ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉండే ఏకైక పదార్థం ఇదే. అంతరిక్షంలోంచి చూస్తే మన భూమి నీలం చుక్కలా కనిపిస్తుంటుంది కదా. దీనికి కారణం మన భూ ఉపరితలం 70 శాతానికి పైగా నీటితోనే కప్పుకొని ఉండటమే. నిజానికి శుద్ధమైన స్థితిలో నీటికి రంగు, రుచి, వాసనలేవీ ఉండవు. వాతావరణంలోని అణువులు మిగతా రంగుల కన్నా నీలి కాంతిని ఎక్కువగా వెదజల్లటం వల్ల ఆకాశం నీలంగా కనిపిస్తుంది కదా. చాలావరకు నీటికీ ఇలాంటి గుణమే ఉంది. అందుకే మహా సముద్రాలు, మంచు కొండల్లో మంచు నీలంగా కనిపిస్తుంటాయి. ఇలాంటి విశిష్ట గుణాలే మనకు వరంగా మారాయి. లేకపోతే భూమి మీద ఇంత పుష్కలంగా నీరు ఉండేది కాదు. ఒక పెద్ద నీటి బిందువు 0.1 గ్రాముల బరువుంటుంది. దీనిలో సుమారు 3,000,000,000,000,000,000,000 అణువులు ఉంటాయి!
ప్రత్యేకతే వేరు
నీరు మహా గొప్ప ద్రావణి. ఆయా పదార్థాలను కరిగించుకోవటంలో దిట్ట. దీని మూలంగానే ఇది జీవ కణాల్లో రసాయనాలను చేర వేసే వాహక ద్రవంగా పనిచేస్తోంది. ప్రాణులకు నీరు అత్యంత విలువైంది కావటానికి కొంతవరకు ఈ గుణమే కారణం. నీటి అణువుల్లో హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువులు త్రిభుజాకారంలో అమరి ఉంటాయి. రెండు పక్కల రెండు చిన్న హైడ్రోజన్ పరమాణువులుంటే.. పైన ఒక పెద్ద ఆక్సిజన్ పరమాణువు ఉంటుంది. దీని మూలంగానే ఎలక్ట్రాన్లు అసమతౌల్యంగా ఉంటాయి. ఆక్సిజన్ పరమాణువు గల నీటి అణువు అంచు కాస్త రుణావేశంతో, హైడ్రోజన్ పరమాణువు ఉన్నవైపు ధనావేశంతో ఉంటాయి. అందుకే ఇవి వివిధ పదార్థాలను ఆకర్షిస్తాయి. పదార్థాల అణువులకు అంటుకొని, వాటిని వేరు చేస్తాయి. ఇదే నీటిని ద్రావణిగా మార్చింది. ఇదంతా దీనిలోని అసాధారణ హైడ్రోజన్ బంధం గొప్పతనం. నీటి విశిష్ట గుణాలకు ఇదే కారణం. నీటి అణువుల్లోని హైడ్రోజన్ బంధాన్ని విడగొట్టటం చాలా కష్టం. కాబట్టే నీరు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది. లేకపోతే మైనస్ 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్దే మరిగేది. అప్పుడు భూమి మీద నీరు ద్రవరూపంలో ఉండేదే కాదు. ప్రాణులూ ఉండేవి కావు. నీటి అణువుల మధ్య హైడ్రోజన్ బంధాలు స్ఫటికాలకు ప్రత్యేక రూపాన్ని సంతరించి పెడతాయి. మంచు పెచ్చులు ఆరు కోణాలను కలిగుండటానికి కారణమిదే. అంటే ద్రవ రూపంలో ఉన్నప్పటి కన్నా నీటి స్ఫటికాల్లో మరింత ఎక్కువ ఖాళీ ఉంటుందన్నమాట. అందుకే నీటి కన్నా మంచు తక్కువ సాంద్రత కలిగుంటుంది. నీటి మీద మంచు తేలియాడటానికి కారణమిదే. లేకపోతే చలికాలంలో సరస్సులు అడుగు నుంచి గడ్డ కడుతూ వచ్చేవి. అప్పుడు నీటిలోని జీవుల మనుగడ కష్టమై ఉండేది.
ప్రాణులకు అత్యవసరం
మనకే కాదు, భూమి మీద జీవులన్నింటికీ నీరు అత్యవసరం. వేడి, చలి వాతావరణాల్లో.. చివరికి గాలి లేని చోట కూడా ప్రాణులు జీవిస్తుంటాయి. కానీ నీరు లేకపోతే మాత్రం కష్టం. ఇది జీవ కణాలు కుప్పకూలిపోకుండా చూస్తుంది. కణాల్లో రసాయనాల కదలికలకు తోడ్పడుతుంది. అవయవాలకు షాక్ అబ్జార్బర్గానూ పనిచేస్తుంది. జీవకణాల్లో జరిగే సంక్లిష్ట పనుల్లోనూ పాలు పంచుకుంటుంది. ఉదాహరణకు- ప్రొటీన్లనే తీసుకోండి. ఆయా పనుల కోసం ప్రొటీన్లు ప్రత్యేకమైన ఆకారాల్లోకి మారాల్సి ఉంటుంది. ప్రొటీన్లలోని భాగాలు నీటితో చర్య జరపటంతోనే ఇది సాధ్యమవుతోంది.
సంక్షిప్త చరిత్ర
* 460 కోట్ల ఏళ్ల క్రితం: భూమ్మీద నీరు పుట్టుకొచ్చింది.
* 360 కోట్ల ఏళ్ల క్రితం: భూమ్మీద ప్రాణుల మనుగడకు బీజం వేసింది.
* చరిత్రపూర్వ యుగంలో: ప్రజలు సంచార జీవనం గడిపేవారు. తరచూ నీరు, ఆహారం ఎక్కువగా ఉన్నచోట్లకు తరలేవారు. నిరంతరం నీటి సౌకర్యం పొందటానికి నదుల తీరంలో స్థిర నివాసం ఏర్పరచుకోవటం ఆరంభించారు.
* క్రీస్తుపూర్వం 4000: మెసపొటోమియాలో పంటల సాగుకు నీటిని సరఫరా చేసే పద్ధతిని ఆవిష్కరించారు.
* క్రీస్తుపూర్వం 300: పురాతన రోమన్లు తమ దేశాలకు నీటి సరఫరా కోసం ఆనకట్టలను నిర్మించటం నేర్చుకున్నారు.
* 1783: నీరు హైడ్రోజన్, ఆక్సిజన్ మిశ్రమమని ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త ఆంటోనీ లావోయిసీర్ నిరూపించారు.
* 1804: ఆక్సిజన్తో హైడ్రోజన్ 2:1 నిష్పత్తిలో కలుస్తుందని ఫ్రెంచ్ శాస్త్రవేత్త జోసెప్ లూయిస్ గే, జర్మన్ శాస్త్రవేత్త అలెగ్జాండర్ వాన్ హంబోల్డ్ నిరూపించారు.
* 1932: అమెరికాకు చెందిన హోరాల్డ్ యురే అనే రసాయన శాస్త్రవేత్త డ్యుటీరియంను కనుగొన్నారు. ఇది మామూలు నీటిలోనూ కొంత మొత్తంలో ఉంటుందని నిరూపించారు.
* 1951: అమెరికా శాస్త్రవేత్త అరిస్టిడ్ వి.గ్రాసే మామూలు నీటిలో ట్రైటియమ్ను కనుగొన్నారు.
* 2008: నాసా అంగారకుడి మీద నీటిని గుర్తించింది.
ఎక్కడ్నుంచి వచ్చింది?
భూమి మీద నీరు ఎక్కడ్నుంచి పుట్టుకొచ్చిందనేది అంతు చిక్కని ప్రశ్న. భూమి ఏర్పడుతున్నప్పుడు ధూళి మేఘం నుంచి నీటి మిశ్రమం నుంచి పుట్టుకొచ్చిందని చాలామంది భావిస్తుంటారు. హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువులు కలిసి వేడి ఆవిరి మేఘంగా ఏర్పడ్డాయి. ఇది క్రమంగా నీరుగా మారి, భూమి మీద వర్షంలా కురిసింది. మహా సముద్రాలు ఏర్పడ్డాయి. ఖండాలు ఒక రూపాన్ని సంతరించుకున్నాయి. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల తొలిదశలో భూమి మీద నీరు కొంతవరకు ఆవిరై ఉండొచ్చు. గ్రహ శకలాలు, తోకచుక్కల వంటివి ఢీకొనటం వల్ల వాటిల్లోని నీరు భూమి మీదికి చేరుకొని ఉండొచ్చనీ చాలాకాలంగా భావిస్తూ వస్తున్నారు. కానీ భూమ్మీది నీటి కన్నా గ్రహ శకలాలు, తోకచుక్కల మీది నీటిలో డ్యుటీరియం అనే హైడ్రోజన్ ఐసోటోప్ పెద్ద మొత్తంలో ఉంటున్నట్టు ఇటీవలి పరిశోధనలు పేర్కొంటున్నాయి. భూమ్మీది నీరు చాలావరకు సౌర వ్యవస్థ ఆరంభం నాటికి సంబంధించిందే అయ్యిండొచ్చని ఇవి సూచిస్తున్నాయి. తొలినాళ్లలో నీరు భూ ఉపరితలం కింద చాలా లోతుల్లో నిక్షిప్తమై ఉండొచ్చు. వెయ్యి కిలోమీటర్ల లోతులో ఉన్న రాళ్లు సైతం నీటిని నిల్వ చేసుకోగలవని పరిశోధకులు ఇటీవల గుర్తించటం గమనార్హం.
అంతా చట్ర బద్ధం!
నీరు ఎప్పుడూ ఒకేలా ఉండదు. రూపం మారుతూ వస్తుంటుంది. సూర్యుడి వేడి ప్రభావంతో సముద్రాలు, సరస్సులు.. చివరికి మొక్కలు, నేల లోని నీరు నిరంతరం ఆవిరి అవుతుంటుంది. ఇది గాలి ద్వారా వివిధ ప్రాంతాలకు చేరుకుంటుంది. ఆవిరి చల్లబడినప్పుడు, నీటి అణువులు గట్టిపడతాయి. ఇవి సూక్ష్మ బిందువులుగా మారి, మేఘాలుగా ఏర్పడతాయి. ఈ బిందువులే పెద్దగా అయ్యి, చివరికి వర్షం రూపంలో కురుస్తాయి. ఇది కాలువలు, నదులు ద్వారా ప్రవహించి తిరిగి సముద్రంలో కలుస్తుంది. కొంత నీరు నేలలోకి ఇంకి భూగర్భజలంగా మారుతుంది. ఉపరితలం మీది నీరు తిరిగి ఆవిరవుతుంది. ఇదంతా ఒక చట్రంలా సాగుతూ వస్తుంది. ఒకసారి మనం వాడుకున్న నీరు భవిష్యత్తులో తిరిగి అందుబాటులోకి వస్తుంది కూడా.
పుష్కలమే అయినా..
గ్రహం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే భూమ్మీద నీరు పుష్కలమే. భూ ఉపరితలం మీద 70 శాతానికి పైగా నీరే ఆక్రమించుకొని ఉంటుంది. కానీ చాలావరకిది ఉప్పునీరే. సుమారు 97 శాతం నీరు మహా సముద్రాలు, సముద్రాల్లోనే ఉంది. తాగటానికి వీలైనది 3 శాతమే! ఈ మంచి నీటిలోనూ 70 శాతం నీరు హిమానీ నదాలు, మంచు ఖండాల రూపంలో ఉండగా.. మరో 29 శాతం భూగర్భంలో నిక్షిప్తమైంది. నదులు, చెరువుల్లో ఉండేది ఒక్క శాతమే. మనుషులు, మొక్కలు, జంతువులు వాడుకోగలిగింది దీన్నే. కాబట్టి నీటిని పొదుపుగా వాడుకోవాలి. ప్రపంచంలో 26% మందికి సురక్షిత మంచినీరు అందటం లేదని, 46% మందికి తగిన పారిశుద్ధ్య వసతులు లేవనే సంగతిని గుర్తుంచుకోవాలి. రోజూ మనం వాడుకునే నీటిలో తాగేది ఒక్క శాతమే.
విచిత్రం తలతన్యత
లోహాల కన్నా నీటి సాంద్రత తక్కువే అయినా కలప, ప్లాస్టిక్ వంటి వాటితో పోలిస్తే ఎక్కువే. అందుకే ఇవి నీటిలో తేలుతాయి. నీటి కన్నా ఎక్కువ సాంద్రత కలిగినవి మునిగిపోతాయి. నీరు సుమారు ఒక మిల్లీమీటరుకు ఒక గ్రాము సాంద్రత కలిగుంటుంది. ఇది నీటి ఉష్ణోగ్రత, దానిలో కలిసిన పదార్థాలను బట్టి మారుతుంటుంది. కొన్ని కీటకాలు నీటి మీద నడవటం చూసే ఉంటారు. దీనికి కారణం మన కంటికి కనిపించని నీటి ‘నిర్మాణం’. దీన్నే తలతన్యత (సర్ఫేస్ టెన్షన్) అంటారు. నీటి అణువులు ఒకదాంతో మరోటి బలంగా అనుసంధానమైనప్పుడు ఇది ఏర్పడుతుంది. దీన్ని ఆధారం చేసుకునే సాలీళ్ల వంటి కీటకాలు నీటిపై నడుస్తుంటాయి. అలా మనం నడవలేమా? సిద్ధాంత పరంగా చూస్తే సాధ్యమే. శరీర బరువును పెద్ద విస్తీర్ణంలో పరచుకునేలా చేయగలిగితే తలతన్యతను ఉపయోగించుకొని మనమూ నీటిపై నడవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాట్లాడే పరికరం!
మాటలను గుర్తించే స్పీచ్ రికగ్నిషన్ పరిజ్ఞానంలో ఐఐటీ గువహటి పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. నేరుగా స్వరపేటిక కంపన సంకేతాల నుంచి మాటలను సృష్టించే పద్ధతిని సృష్టించారు. -
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
లాలీపాప్తో నోటి క్యాన్సర్ జాడ
క్యాన్సర్లను నిర్ధరించటానికి కణజాలం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్ష చేస్తుంటారు (బయాప్సీ). ఇందుకోసం శరీరానికి కోత పెట్టాల్సి ఉంటుంది. నొప్పి పుడుతుంది. బయాప్సీ చేయటానికి నిపుణులు అవసరం. -
వరదొచ్చే.. వరదొచ్చే.. వారం ముందే అంచనా
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. కంపెనీలు వినూత్న టూల్స్ను సృష్టిస్తూ సత్తాను చాటుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో గూగుల్ ఇటీవల గొప్ప పురోగతిని సాధించింది. -
భూగర్భంలో నీరెంత?
భూమి మీద మూడొంతుల మేర ఉండేది నీరే. మరి భూగర్భంలో ఎంత నీరుంటుంది? ఎంతుంటే ఏంటని మనం అనుకుంటామేమో గానీ శాస్త్రవేత్తలు అలా కాదు. -
గది ఉష్ణోగ్రత వద్దే క్యూబిట్లు స్థిరంగా..
క్వాంటమ్ కంప్యూటింగ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సమాచార పరిశీలన, విశ్లేషణ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. -
పాలపుంత కేంద్రం తెలుసా?
మన నక్షత్ర మండలమైన పాలపుంత కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఐఫోన్ కొత్త యాప్ సాయం తీసుకోవచ్చు. -
పీసీఆర్ కథ
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పీసీఆర్ పరీక్ష అనగానే అంతా గుర్తుపట్టేస్తారు. కొవిడ్ విజృంభించినప్పుడు ఇదెంత ప్రాముఖ్యం సంతరించుకుందో తెలిసిందే -
పురాతన నక్షత్ర మండలం సరికొత్త సవాల్
కృష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) చుట్టూ ఉండే భారీ పరివేషాల సమీపంలో తొలి నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. -
సుదూర అంతరిక్షంలో మరో భూమి!
భూమి ఆయుష్షు ఏటికేడు తగ్గుతూ వస్తోంది. వనరులూ తగ్గుతూ వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన భూమిలాంటి నివాసయోగ్య గ్రహాల కోసం ఖగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా అన్వేషిస్తూనే ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా భూమి నివసించటానికి పనికిరాకుండా పోతే, మానవజాతి అంతరించకుండా చూడటం దీని ఉద్దేశం. ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ‘భారీ భూమి’ని (సూపర్ ఎర్త్) గుర్తించారు. -
ఇంటి గాలిని వడపోసే మొక్క
వాయు కాలుష్యం అనగానే రద్దీ రహదారులు, పారిశ్రామిక పాంతాలే గుర్తుకొస్తాయి. కానీ ఇళ్లు, కార్యాలయాలూ తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే బెంజీన్, టొల్యూన్, జైలీన్, ఫార్మాల్డిహైడ్ వంటి వాయు కాలుష్య కారకాలు ఆరుబయట కన్నా ఇంటి లోపలే 2 నుంచి 5 రెట్లు ఎక్కువని అమెరికాకు చెందిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజేన్సీ చెబుతోంది. -
అంగారకుడి శోధనకు వినూత్న వ్యోమనౌక
అంగారకుడి శోధనకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వినూత్న వ్యోమనౌకను రూపొందించనుంది. దీని పేరు మార్స్ ఏరియల్ గ్రౌండ్ ఇంటెలిజెంట్ ఎక్స్ప్లోరర్ (మ్యాగ్గీ). -
గోబర్ గ్యాస్ రాకెట్!
గోబర్ గ్యాస్తో వంట చేసుకోవటం పాత విషయమే. దీంతో రాకెట్లనూ నడపొచ్చని తెలుసా? జపాన్కు చెందిన ఒక అంతరిక్ష సంస్థ అలాంటి రాకెంట్ ఇంజిన్నే రూపొందించింది. -
హ్యామ్- అంతరిక్షంలోకి వెళ్లిన తొలి చింపాంజీ
మనుషుల కన్నా ముందు జంతువులే అంతరిక్షంలో అడుగుపెట్టాయి. వీటిల్లో హ్యామ్ అనే చింపాంజీ ఒకటి. అమెరికా చేపట్టిన మెర్క్యురీ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగాత్మక రాకెట్ ద్వారా ఇది అంతరిక్షంలోకి వెళ్లింది. అప్పుడు హ్యామ్ వయసు మూడున్నరేళ్లే. గంటకు 8,046 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్ ద్వారా ఇది 241 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. -
స్వయం ప్రయోగశాలలు
స్వయం చోదక వాహనాల గురించి తెలిసిందే. ఎక్కి కూర్చోగానే వాటంతటవే గమ్యానికి చేరుస్తాయి. మొదట్లో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా ఇప్పుడివి కొన్నిదేశాల్లో నిత్య జీవనంలోకీ వచ్చేశాయి. -
భారీ విశ్వదర్శిని!
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే(ఎస్కేఏ)లో మనదేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. -
కీటకం ఈత గుట్టు
కీటకాలకు ఒలింపిక్ క్రీడల పోటీలు నిర్వహిస్తే ఈతలో వర్లిగిగ్ బీటిల్ బంగారు పతకం కొట్టేయటం ఖాయం. ఉండేది సెంటీమీటరు పొడవే అయినా వేగంలో దీన్ని మించిన కీటకం లేదు -
కిరణజన్య సంయోగక్రియ మూలం!
మన భూమ్మీద ప్రాణులు జీవించి ఉండటానికి ఆక్సిజన్నే ఆధారం. దీనికి మూలం కిరణజన్య సంయోగక్రియ. వృక్షాలు, మొక్కలు గాల్లోంచి కార్బన్ డయాక్సైడ్, భూమిలోంచి నీరు, సూర్యుడి నుంచి కాంతిని గ్రహించి చక్కెరను సృష్టించుకుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM