కలగానే.. కొత్త బస్సుల కొనుగోలు!
కొండలా పేరుకుపోతున్న అప్పులు, వెంటాడుతున్న నష్టాలు.. వెరసి ఆర్టీసీలో నూతన బస్సుల కొనుగోలు అంశం తీరని కలగానే మిగిలింది.. మరోవంక.. సంస్థలో కాలం చెల్లిన బస్సుల సంఖ్య పెరుగుతోంది.. పాత బండ్లకు రంగులద్ది నెట్టుకొచ్చే దైన్యస్థితి కొనసాగుతోంది.
సర్కారిచ్చే నిధులూ అరకొరే
ఆర్టీసీలో డొక్కు బండ్లే లెక్కకు మిక్కిలి
ఫెమా-2 పథకాన్నీ వినియోగించుకోని తీరు
కొండలా పేరుకుపోతున్న అప్పులు, వెంటాడుతున్న నష్టాలు.. వెరసి ఆర్టీసీలో నూతన బస్సుల కొనుగోలు అంశం తీరని కలగానే మిగిలింది.. మరోవంక.. సంస్థలో కాలం చెల్లిన బస్సుల సంఖ్య పెరుగుతోంది.. పాత బండ్లకు రంగులద్ది నెట్టుకొచ్చే దైన్యస్థితి కొనసాగుతోంది. కొత్త బస్సుల కొనుగోలుకు రాష్ట్ర సర్కారిచ్చే నిధులూ అరకొరగానే ఉన్నాయి.
గతమే ఘనం.. నేడంతా దైన్యం!
తెలంగాణ ఆర్టీసీలో గతంలో సుమారు 12వేల వరకు బస్సులు ఉండేవి. ఇపుడున్నవి 9,708 మాత్రమే.. వాటిలోనూ 3,107 అద్దె బస్సులే. 2014 నుంచి 4,991 బస్సులను కాలం చెల్లినవిగా భావించి తొలగించారు. పక్కన పెట్టాల్సినవి మరో 1,200 వరకు ఉన్నట్లు అంచనా. అధికారికంగా అలాంటి 854 బస్సులను గుర్తించారు. ఉన్నవాటిలోనూ సుమారు 30శాతం వాహనాలు 13లక్షల కిలోమీటర్లకు మించి తిరిగినవే. ఒక్కో బస్సు 15 ఏళ్లు నడపాలనుకుంటే ఏటా 750 బస్సుల వరకు కొనాలని, ఇందుకయ్యే వ్యయం రూ.300 కోట్ల మించదన్నది నిపుణుల అంచనా. కర్ణాటక, తమిళనాడులు కొత్త బస్సులను సమకూర్చుకుంటున్నాయి. మూడేళ్లలో కొత్త బస్సుల కోసం ఏపీఎస్ఆర్టీసీ రూ.1000 కోట్ల వెచ్చించినట్లు సమాచారం.
కొన్నది 1,826 బస్సులే..
గత అయిదేళ్లలో తెలంగాణ ఆర్టీసీ కొనుగోలు చేసింది 1,826 బస్సులే. అందులో 200 వరకు మినీ బస్సులున్నాయి. కాలుష్య కట్టడికి అనువుగా కేంద్రం ప్రవేశపెట్టిన ఫెమా-1 పథకం కింద సమకూరిన బ్యాటరీ ఆధారిత బస్సులు 40 ఉన్నాయి. ఫెమా-2 పరిధిలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లకు మరిన్ని బస్సులు లభించే అవకాశమున్నా సర్కారు సద్వినియోగం చేసుకోలేదు. ఇక కాలనీల కోసం ప్రవేశపెట్టిన మినీ వజ్ర ఏసీ బస్సుల్లో సింహభాగం ఐరావతాల్లా మారాయి. వాటిని విక్రయించాలని నిర్ణయించినా వ్యవహారం కొలిక్కి రాలేదు. హైదరాబాద్లో నడిపేందుకు వీలుగా 80 వరకు మెట్రో లగ్జరీ బస్సులను 2014లో కొన్నారు. ఏసీ బస్సులుగా నగరంలో తిప్పారు. వాటికి మార్పులుచేర్పులు చేసి దూరప్రాంతాలకు వెళ్లే రాజధాని బస్సులుగా నడుపుతున్నారు. కరోనా కారణంగా హైదరాబాద్లో సుమారు 900 బస్సులను తగ్గించారు. ప్రస్తుతం 2,850 వరకు తిరుగుతున్నాయి. ఇక్కడున్న వాటిలో సగం బస్సుల్ని మార్చాల్సి ఉందని ఉద్యోగ వర్గాలు చెప్తున్నాయి.
ప్రజాప్రతి‘నిధులు’ తలచుకుంటే..
ప్రస్తుతం ఆర్టీసీకి ఉత్సాహవంతులైన ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు ఉన్నారు. వారు చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కలవాలి. వారికుండే నియోజకవర్గ అభివృద్ధి నిధి నుంచి నూతన బస్సుల కొనుగోలుకు కొంత మొత్తం రాబట్టగలిగితే ఆర్టీసీ, ప్రభుత్వంపైనా భారం పడకుండా ఉంటుంది. సామాజిక బాధ్యత(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద ఆదాయ పన్ను మినహాయింపు ఉన్న నేపథ్యంలో నిధులు సమీకరించి నూతన బస్సులు కొనాలి.
- ఎం.నాగేశ్వరరావు, ఆర్టీసీ మాజీ డైరెక్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM