Disha Encounter Case: ఇక హైకోర్టులో విచారణ
దిశ హత్యాచారం అనంతరం జరిగిన ఎన్కౌంటర్ కేసులో విచారణ ఇకపై తెలంగాణ హైకోర్టులోనే జరుగుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసులో ఇక్కడ విచారణ చేపట్టబోమని.. మిగతా అంశాలు హైకోర్టు చూసుకుంటుందని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ స్పష్టం చేశారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం
కమిషన్ నివేదికను గోప్యంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి
బహిరంగ విచారణ జరిగాక దాపరికమెందుకన్న ధర్మాసనం
‘కేసును హైకోర్టుకు బదిలీ చేస్తున్నాం. కమిషన్ కార్యాలయం తమ నివేదిక ప్రతుల(సాఫ్ట్ కాపీలు)ను పిటిషనర్లకు, ప్రతివాదులకు పంపించాలి. నివేదికలోని ఏ అంశంపైనైనా తమకు అభ్యంతరాలుంటే ప్రతివాదులు, పిటిషనర్లు హైకోర్టుకు చెప్పుకొనే అవకాశం ఇస్తున్నాం. హైకోర్టు వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను హైకోర్టుకు పంపుతాం’
- సుప్రీంకోర్టు ధర్మాసనం
ఈనాడు, దిల్లీ: దిశ హత్యాచారం అనంతరం జరిగిన ఎన్కౌంటర్ కేసులో విచారణ ఇకపై తెలంగాణ హైకోర్టులోనే జరుగుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసులో ఇక్కడ విచారణ చేపట్టబోమని.. మిగతా అంశాలు హైకోర్టు చూసుకుంటుందని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ స్పష్టం చేశారు. ఎన్కౌంటర్పై జస్టిస్ వి.ఎస్.సిర్పుర్కర్ కమిషన్ సమర్పించిన తుది నివేదికపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. హైదరాబాద్ శివార్లలో దిశ హత్యాచారం ఘటన అనంతరం నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై న్యాయవాదులు జి.ఎస్.మణి తదితరులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు దీనిపై విచారణకు జస్టిస్ సిర్పుర్కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ను నియమించిన విషయమూ విదితమే. శుక్రవారం విచారణ సందర్భంగా కమిషన్ నివేదికను సీల్డు కవరులో ఉంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీన్ని తిరస్కరించిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ.. ‘కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నేరానికి పాల్పడిన వారిపై హైకోర్టు విచారణ చేపడుతుంది’ అన్నారు. దయచేసి నివేదికను తిరిగి సీల్ చేయాలని శ్యామ్ దివాన్ అభ్యర్థించారు. ‘బహిరంగంగా విచారణ చేపట్టిన తర్వాత గోప్యత ఏముంది? మీరు కోరితే నేను బయటకు చదివి వినిపిస్తా. రోజువారీగా ఈ కేసును మేం విచారించలేం. తర్వాత ఏం చర్యలు తీసుకోవాలనేదే ఇక్కడ ప్రశ్న. ఈ అంశంపై హైకోర్టు విచారణ చేపడుతుంది. పిటిషన్దారులకు, ప్రతివాదులకు నివేదిక ప్రతులు అందజేస్తాం’ అని సీజేఐ తెలిపారు. ఈ అంశం ట్రయల్ కోర్టుకు వెళ్లేముందు విచారణలపై ఏ ప్రభావమూ పడకూడదని భావిస్తున్నామని శ్యామ్ దివాన్ విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు కమిటీని నియమించిన తర్వాత నివేదిక ఏ విధంగానైనా రావచ్చని... దానికి కోర్టు ఏం చేస్తుందని సీజేఐ ప్రశ్నించారు. సీల్డు కవరులో నివేదికలు ఉంచాలని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని శ్యామ్ దివాన్ గుర్తుచేశారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలకు అది వర్తిస్తుందని.. ఇది ఎన్కౌంటర్ కేసని సీజేఐ బదులిచ్చారు. నివేదికను బహిర్గతం చేస్తే అది న్యాయపాలనపై ప్రభావం చూపుతుందని శ్యామ్ దివాన్ అన్నారు. న్యాయస్థానం ఆ నివేదికను ఎందుకు పబ్లిక్డొమైన్లో పెట్టకూడదని జస్టిస్ హిమా కోహ్లి ప్రశ్నించారు. బహిరంగ విచారణ తర్వాత అందులో గోప్యత ఏముందని ప్రశ్నించిన సీజేఐ.. దేశంలో ఎటువంటి దారుణమైన పరిణామాలు నెలకొన్నాయో తాము చూస్తున్నామన్నారు. నివేదిక ఆధారంగా జాతీయ అంశాలను ధర్మాసనం స్పృశించినందున నివేదికను తిరిగి సీల్ చేసి హైకోర్టుకు పంపాలని.. లేని పక్షంలో వేసవి సెలవులయ్యే వరకు పక్కన పెట్టి.. తర్వాత దాన్ని గోప్యంగా ఉంచాలో, బహిర్గతం చేయాలో నిర్ణయించాలని శ్యామ్ దివాన్ కోరారు. ఈ దశలో పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది వ్రిందా గ్రోవర్ జోక్యం చేసుకున్నారు. మణిపుర్లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం కింద సైన్యం చేసిన హత్యలకు సంబంధించిన నివేదికలను బహిర్గతం చేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించిందన్నారు. కమిషన్ బహిరంగ విచారణ చేపట్టి.. ఆ వివరాలు నమోదు చేసిందనే విషయం గుర్తించాలని కోరారు. మీరు వాయిదా కోరుకుంటే అది వేరే అంశమని, మీ క్లయింట్ను (రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు) అడిగి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని శ్యామ్ దివాన్కు సీజేఐ సూచించారు. పది నిమిషాల పాటు విచారణను వాయిదా వేశారు. తర్వాత కేసు విచారణ పునఃప్రారంభమైంది. విచారణను వేసవి సెలవుల తర్వాత చేపట్టాలని.. లేకుంటే నివేదికను బహిర్గతం చేయొద్దని మరోసారి శ్యామ్ దివాన్ అభ్యర్థించారు. దీన్ని తిరస్కరించిన ధర్మాసనం.. కేసు విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది.
* విచారణ మధ్యలో పది నిమిషాల వాయిదా అనంతరం పిటిషన్ వేసిన న్యాయవాది జి.ఎస్.మణి కల్పించుకొని తాను ఇక్కడే ఉన్నానని తెలిపారు. అప్పటికీ శ్యామ్ దివాన్ కోర్టు హాల్లోకి రాలేదు. ‘మీరు అంత కంగారు పడాల్సిన పని లేదు. ప్రచారం కోసం మీరు అనేక రిట్ పిటిషన్లు వేస్తారనే విషయం తెలుసు’ అంటూ మణిని సీజేఐ మందలించారు.
* ఈ కేసు విచారణ సందర్భంగా.. ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్గా వ్యవహరించిన సజ్జనార్, కేసుతో సంబంధం ఉన్న ఇతర పోలీసు అధికారులు సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ