ఓ కన్నేసి ఉంచుదాం
తొలుత రుచి చూడాలనే తహతహతో మత్తు ఊబిలోకి దిగిన చాలామంది..క్రమంగా బానిసలుగా మారుతున్నారు. అప్పటికిగానీ కుటుంబ సభ్యులు గుర్తించలేకపోతున్నారు. వారికి తెలిసేసరికే పరిస్థితి చేయి దాటిపోతుండటంతో
గంజాయి సహా మాదకద్రవ్యాల వలలో యువత
తల్లిదండ్రులూ బహుపరాక్
తొలుత రుచి చూడాలనే తహతహతో మత్తు ఊబిలోకి దిగిన చాలామంది..క్రమంగా బానిసలుగా మారుతున్నారు. అప్పటికిగానీ కుటుంబ సభ్యులు గుర్తించలేకపోతున్నారు. వారికి తెలిసేసరికే పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఆయా కుటుంబాల బాధ వర్ణనాతీతంగా ఉంటోంది. తల్లిదండ్రులు పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని, ప్రాథమిక దశలోనే పసిగట్టగలిగితే ‘మత్తు’ వదిలించేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు వాహనం నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. అతడు గంజాయి మత్తులో ఉన్నట్లు చికిత్సచేసే సమయంలో వైద్యులు గుర్తించారు. అప్పటివరకు తమ బిడ్డకు ఆ అలవాటు ఉన్నట్లు తెలుసుకోలేని తల్లిదండ్రులు నివ్వెరపోయారు. వైద్యుల సూచన మేరకు కుమారుడిని పునరావాస కేంద్రంలో చేర్పించారు. అతడు మూడేళ్ల క్రితమే సిగరెట్లు, మద్యం తాగడం మొదలుపెట్టి ప్రస్తుతం గంజాయితోపాటు ఇతర మాదకద్రవ్యాల్ని తీసుకుంటున్నట్టు తేలింది. తరచూ గోవా నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్టు అతడు నిపుణుల కౌన్సెలింగ్లో వెల్లడించాడని తెలుసుకుని తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
జడలు విప్పుతున్న మత్తు మహమ్మారి కారణంగా ఇలాంటి అనుభవం ఎందరో తల్లిదండ్రులకు ఎదురయ్యే ప్రమాదం ముంచుకొస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో మత్తు పదార్థాల వినియోగం భారీగా పెరగడంతో యువత, ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యార్థులు ఎక్కువగా మాదకద్రవ్యాల బారినపడ్డారు. లాక్డౌన్తో హైదరాబాద్ నుంచి గ్రామాలకు వెళ్లిన ఇలాంటివారు..అక్కడి స్నేహితులకూ వీటిని అలవాటుచేశారు. ‘సులభంగా, చవగ్గా లభ్యమవడంతో మాదకద్రవ్యాల వ్యసనానికి గంజాయి గేట్వేలా మారిపోయిందని’ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇలాంటివి మీ ఇంట్లో జరుగుతున్నాయా?
* పిల్లలు ఇంట్లో తీసుకునే డబ్బులకు కచ్చితమైన లెక్కలు అడగాలి. తరచూ సాధారణం కంటే ఎక్కువ డబ్బులు అడుగుతుంటే అప్రమత్తమై ఆరా తీయాలి. ఇంటికి దూరంగా ప్రైవేటు గదుల్లో, వసతిగృహాల్లో ఉంటే వాటిని ఆకస్మికంగా సందర్శిస్తూ పరిస్థితుల్ని గమనించాలి. ఇంటికి తరచూ ఆలస్యంగా వస్తున్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో(మాట తడబాటు, కళ్లు ఎర్రబారడం, మగతగా అనిపించడం వంటివి) గమనించాలి.
* విద్యార్థుల బ్యాగుల్లో ఒ.సి.బి.పేపర్, లైటర్ తదితర వస్తువులుంటే గంజాయి తాగుతున్నట్టు అనుమానించాలి. ఎక్కువగా తినడం, ఎక్కువగా నిద్ర పోవడమూ గంజాయి తాగే వారి ప్రాథమిక లక్షణంగా గుర్తించాలి. బ్యాక్లాగ్స్ పెరిగినా కారణాలను అన్వేషించాలి.
* ముందు మీ పిల్లల స్నేహితులు ఎలాంటి వారో గమనించాలి. వారితో కలిసి టెర్రస్పై ఎక్కువ సమయం గడుపుతుంటే.. ఏం చేస్తున్నారో కనిపెట్టాలి. పుట్టినరోజు వేడుకలు, లేదా ఇతరత్రా సాకులతో తరచూ బయటకువెళ్లి ఎక్కువ సేపు గడుపుతుంటే అనుమానించాలి. పర్యవేక్షకులెవరూ లేకుండా గోవా లాంటి పర్యాటక ప్రాంతాలకు పంపేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.
* అనవసరంగా అరవడం, ముభావంగా ఉండటం లాంటి విపరీత ధోరణుల్ని వ్యక్తం చేస్తుంటే వారి చరవాణుల్లో వాట్సప్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, టెలీగ్రామ్లాంటి యాప్లను తనిఖీ చేయాలి. సాధారణంగా ఇలాంటి వేదికల్లోనే డ్రగ్స్ కోసం సంభాషణలు సాగించే అవకాశముంది. చాటింగ్లలో weed, score, stuff,stamp, acid, paper, ocb, coke, MD, joint,stash, mal, khash, stoner, peddler, dum,crystal, boom లాంటి పదాలు ఎక్కువగా వాడుతుంటే అనుమానించాల్సి ఉంటుంది.
ఒకసారి రుచిచూస్తే.. అంతే సంగతులు
జీవితంలో ఒక్కసారైనా ప్రయత్నించకూడని అంశాల్లో మాదకద్రవ్యాలు మొదటి వరసలో ఉంటాయి. ఎక్కువసార్లు తీసుకుంటేనే వ్యసనపరులవుతామనేదీ అపోహే. ఒక్కడోసు కూడా ప్రమాదకరమే. మత్తుపదార్థాలు సృజనాత్మకతను, ఏకాగ్రతను పెంచుతాయనేది పచ్చి అబద్ధం. వాటిని తీసుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదురవుతాయనేది మాత్రం వాస్తవం. గంజాయికి అలవాటుపడిన వారిని డీఅడిక్షన్ కేంద్రాల్లో చేర్చి దాన్నుంచి విముక్తుల్ని చెయ్యొచ్చు.
- అంజిరెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఎన్ఫోర్స్మెంట్), హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని
కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
పదిలో 91.31% ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు. 4,94,207 మంది రెగ్యులర్గా పరీక్ష రాయగా 4,51,272 మంది (91.31%) ఉత్తీర్ణత సాధించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావుల ప్రమాణం
తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. -
అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి అందజేత
స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భారాస నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. -
50 మంది రచయిత్రులకు ‘మాతృవందనం’ పురస్కారాలు
హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ‘మాతృవందనం’ (షష్టిపూర్తి కలాలకు సత్కారం) కార్యక్రమాన్ని నిర్వహించారు. -
జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్ చేయాలని) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. -
అనుమానం వచ్చిందంటే.. ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఉల్లిపాయ.. సాగు తగ్గిపాయే..!
మహబూబ్నగర్ జిల్లా గోప్లాపూర్కు చెందిన రైతులు ఉల్లిని పండించారు. మార్కెట్లలో తిరిగినా గిట్టుబాటు ధర రావడం లేదని, పైగా రవాణా ఖర్చులు భారమవుతున్నాయని ఇలా రోడ్డును ఆనుకొనే కుప్పలు పోసి విక్రయిస్తున్నారు -
సుర్రుమంటూ.. నీరంతా జుర్రేస్తూ..
భానుడు నీటిని పీల్చేస్తున్నాడు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన జలాశయాల్లో నీటి ఆవిరి శాతం పెద్దఎత్తున ఉంటోంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 41.5, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే ఉంటున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
టీఎస్ఈఏపీసెట్ ఇంజినీరింగ్ హాల్టికెట్ల విడుదల
టీఎస్ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష హాల్టికెట్లు మంగళవారం విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ బీడీ కుమార్ తెలిపారు. -
ఆలస్యరుసుంతో పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2024)కు రూ.100 ఆలస్యరుసుంతో దరఖాస్తు గడువును మే ఏడో తేదీ వరకు పెంచామని ఎస్బీటీఈటీ కార్యదర్శి ఎ.పుల్లయ్య తెలిపారు. -
వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కొత్త రిజిస్ట్రార్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్ట్రార్గా రఘురామిరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. -
7న బీసీ సంక్షేమ సంఘం కీలక సమావేశం: ఆర్.కృష్ణయ్య
రాష్ట్రంలోని బీసీల డిమాండ్లపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంతో ఈ నెల 7న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సమాజ సేవకులను సత్కరించుకోవాలి
‘‘లాభాపేక్ష లేకుండా సమాజం కోసం పనిచేసే వారిని గుర్తించి సత్కరించుకోవాలి. అయితే దురదృష్టవశాత్తూ ప్రస్తుత సమాజం రాజకీయాల్లో ఉన్నవారికి అధిక ప్రాధాన్యమిస్తూ గౌరవించుకుంటోంది’’ అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. -
నేత్రాధికారులకు న్యాయం చేయాలి
రాష్ట్రంలోని నేత్రాధికారుల (ఆఫ్తాల్మిక్ ఆఫీసర్స్)కు న్యాయం చేసి, పదోన్నతులను చేపట్టాలని రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర నేత్రాధికారుల సంఘం కోరింది. -
ఎన్వోసీల పేరుతో..కాసులవేట!
భవన నిర్మాణాలకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు నీటిపారుదల శాఖలోని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు లేవంటూ ధ్రువీకరించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. -
ఓయూలో సర్క్యులర్ ప్రచారంపై పోలీసు కేసు
సర్క్యులర్ను తప్పుగా మార్చి ప్రచారం చేస్తూ ఉస్మానియా ప్రతిష్ఠకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని అధికారులు మంగళవారం ఓయూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఎండ.. ప్రచండం
రాష్ట్రంలో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం ఎండ తీవ్రత తారస్థాయికి చేరింది. జగిత్యాల, నల్గొండ, కరీంనగర్లు మసిలిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
కొలిక్కి రాని కుక్కర్ కూపన్ల కథ.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కోసం గాలింపు
-
ఏసీబీ, విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు.. స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు!
-
వడదెబ్బ చికిత్సలకు.. హీట్స్ట్రోక్ క్లినిక్లు
-
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది
-
ప్రేయసితో లాడ్జికి.. ప్రియుడి అనుమానాస్పద మృతి
-
సింహాచలం కొండపై.. ‘భూ’చోళ్లు