ఇసుక ఉంది కొంటారా?
హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో పెద్ద లారీ లోడ్ తీసుకుంటే దొడ్డు ఇసుక రూ.1,250- రూ.1,300కు, సన్నరకం రూ.1,350-1,400కు దొరుకుతోంది. నవంబరులో 8.33 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయాలు జరిగాయి.ఇంటి నిర్మాణ పనులు మొదలైతే యజమానులు ఎక్కువగా ఆందోళన చెందేది ఇసుక గురించే. గతంలో అది దొరకడమే గగనంగా ఉండేది. దళారులు అడిగినంత ధర చెల్లించాల్సి వచ్చేది. కానీఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది.
గతంలో బుకింగ్ మొదలైన అరగంటలోపే ఖాళీ
ఇప్పుడు రోజంతా అందుబాటులో
హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో పెద్ద లారీ లోడ్ తీసుకుంటే దొడ్డు ఇసుక రూ.1,250- రూ.1,300కు, సన్నరకం రూ.1,350-1,400కు దొరుకుతోంది. నవంబరులో 8.33 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయాలు జరిగాయి.
ఈనాడు, హైదరాబాద్: ఇంటి నిర్మాణ పనులు మొదలైతే యజమానులు ఎక్కువగా ఆందోళన చెందేది ఇసుక గురించే. గతంలో అది దొరకడమే గగనంగా ఉండేది. దళారులు అడిగినంత ధర చెల్లించాల్సి వచ్చేది. కానీఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. ఇసుక కొనేవారి కోసం అటు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ)తో పాటు విక్రయదారులు ఎదురుచూస్తున్నారు. గతంలో ఆన్లైన్లో పెట్టిన అరగంటలోపే బుకింగ్ అయిపోయేది. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ సమయంలో ప్రయత్నం చేసినా దొరుకుతోంది. అయినా 50శాతం వరకు ఇసుక మిగిలిపోతోంది. గత ఏడాది కాలంలో సిమెంటు, స్టీలు ధరలు బాగా పెరగ్గా.. ఇసుక ధరలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట సహా 10 జిల్లాల్లోని స్టాక్యార్డుల్లో ఇసుక ఉంది. కొద్ది రోజులుగా రోజుకు 50వేల క్యూబిక్మీటర్లకుపైగా ఇసుకను టీఎస్ఎండీసీ అందుబాటులో ఉంచుతోంది. ఆన్లైన్ విక్రయాలు 25-30వేల క్యూబిక్మీటర్లలోపే జరుగుతున్నాయి. బుధవారం 26,111 క్యూబిక్మీటర్ల ఇసుకను విక్రయించారు.
ఎందుకు తగ్గింది?
గతంలో వర్షాకాలంలో టీఎస్ఎండీసీ స్టాక్ తక్కువ పెట్టేది. దీంతో ఇసుక లభ్యత తగ్గి బ్లాక్ మార్కెటింగ్ భారీగా జరిగేది. వానలు తగ్గాక డిమాండ్ ఒక్కసారిగా పెరిగి, ధరలకు రెక్కలువచ్చేవి. స్టాక్ ఎంత పెట్టినా నిమిషాల్లోనే బుకింగ్ పూర్తయ్యేది. ఈసారి ఇసుక బుకింగ్లపై వర్షాకాల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించినట్లు టీఎస్ఎండీసీ వర్గాలు చెబుతున్నాయి.
* గోదావరి, మానేరు, మూసీ వంటి నదుల నుంచి వర్షాకాలంలో ఇసుక తీసే పరిస్థితి ఉండదు. స్టాక్ యార్డుల్లో నిల్వలు తీసుకెళ్లాలన్నా ఆ మార్గంలో రోడ్లు దెబ్బతింటే సరఫరాపై ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా వానాకాలంలో ఇసుక అమ్మకాలు తక్కువ ఉండేవి. ఆ పరిస్థితి ఈ ఏడాది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గతేడాది జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో 5,06,458 క్యూబిక్ మీటర్ల ఇసుకను టీఎస్ఎండీసీ అమ్మితే, ఈసారి అదే మూడు నెలల్లో 16,45,498 క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయించారు. ఫలితంగా నవంబరు నుంచి ఇసుక డిమాండ్ తగ్గినట్లు భావిస్తున్నారు.
వర్షాకాల ప్రభావాన్ని తగ్గించాం
భవన నిర్మాణాలకు సంబంధించి ధర పెరగనిది ఒక్క ఇసుకకే. వానాకాలంలో ఎక్కువ కాలం విక్రయాలు ఆగకుండా చూశాం. సంవత్సరం అంతా ఇసుక అందుబాటులో ఉండడంతో వర్షాకాల అనంతర డిమాండ్ తగ్గింది. ఆన్లైన్లో పెట్టే స్టాక్లో దాదాపు సగం మిగిలిపోతోంది. త్వరలో మరికొన్ని కొత్త ఇసుక రీచ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
- మల్సూర్, వీసీ ఎండీ, టీఎస్ఎండీసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు