ఆవిష్కరణ కేంద్రాలుగా.. ఐఐటీలు, ట్రిపుల్ఐటీలు
ఐఐటీలు, ట్రిపుల్ఐటీలు.. ఇకపై సరికొత్త సాంకేతికత అభివృద్ధి చేసే సంస్థలుగా, డాటా నిల్వ కేంద్రాలుగా మారనున్నాయి. ఇందుకోసం కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ ఆధ్వర్యంలో రెండేళ్ల కిందట ప్రత్యేకంగా నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్
దేశవ్యాప్తంగా 25 విద్యా సంస్థల ఎంపిక
తెలుగు రాష్ట్రాల నుంచి మూడింటికి చోటు
రూ.3,200 కోట్లతో ప్రత్యేకహబ్ల ఏర్పాటు
ఈనాడు, హైదరాబాద్: ఐఐటీలు, ట్రిపుల్ఐటీలు.. ఇకపై సరికొత్త సాంకేతికత అభివృద్ధి చేసే సంస్థలుగా, డాటా నిల్వ కేంద్రాలుగా మారనున్నాయి. ఇందుకోసం కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ ఆధ్వర్యంలో రెండేళ్ల కిందట ప్రత్యేకంగా నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ (ఎన్ఎం-ఐసీపీఎస్) పేరిట ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో భాగంగా ముందుగా ఆయా విద్యా సంస్థల్లో సెక్షన్-8 కంపెనీలుగా టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్లను ఏర్పాటుచేశారు. ఇవి వచ్చే ఐదేళ్లలో నిర్దేశించిన అంశాల వారీగా సాంకేతికతలను అభివృద్ధి చేయడంతోపాటు పేటెంట్లు దక్కించుకునేలా ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని తాజాగా నిర్దేశించారు. ఆవిష్కరణ హబ్లకు ఐదేళ్లలో భారీగా నిధులు దక్కనున్నాయి. మొత్తం 25 కేంద్రాల పరిధిలో రూ.3,200 కోట్లు వెచ్చించనున్నారు.
ప్రతిష్ఠాత్మక సంస్థలకు చోటు
ఐఐటీ-ఖరగ్పుర్, ఐఐటీ-వారణాసి, ఐఐఎస్సీ-బెంగళూరు, ఐఐటీ-బాంబే, ఐఐటీ-మద్రాస్, ఐఐటీ-కాన్పుర్, ట్రిపుల్ఐటీ-బెంగళూరు, బిట్స్-పిలానీ, ఐఎస్ఐ-కోల్కతా, ఐఐటీ-ఇండోర్, ట్రిపుల్ ఐటీ-దిల్లీ, ఐసర్-పుణె, ఐఐటీ-భిలాయ్, ఐఐటీ-దిల్లీ సహా దేశవ్యాప్తంగా 25 ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను ఇందుకోసం ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి మూడు విద్యాసంస్థలకు చోటు దక్కింది. కేంద్ర ప్రభుత్వం వాటికి ఆయా అంశాలను నిర్దేశించింది. ట్రిపుల్ఐటీ-హైదరాబాద్లో డాటా బ్యాంకు, డాటా సేవలు, డాటా విశ్లేషణ హబ్ ఏర్పాటు కానుంది. ఐఐటీ హైదరాబాద్ అటానమస్ నావిగేషన్ సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది. ఐఐటీ తిరుపతిలో పొజిషనింగ్ సాంకేతికతను అభివృద్ధి చేస్తారు. జీపీఎస్ తరహా వ్యవస్థలపైనా దృష్టి పెడతారు. ‘‘ప్రతి టెక్నాలజీ హబ్లో ప్రత్యేకంగా టెక్నాలజీ ఇంక్యుబేషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తారు. ఇందులో వెయ్యి అంకుర సంస్థలకు చేయూత అందిస్తారు. ప్రతి హబ్ నుంచి ఒక యూనికార్న్ సంస్థ తయారయ్యేలా తోడ్పాటు అందిస్తారు’’ అని ఐఐటీ హైదరాబాద్ వర్గాలు వెల్లడించాయి.
పరిశ్రమల భాగస్వామ్యం తప్పనిసరి
-డాక్టర్ కె.ఆర్.మురళీమోహన్, మిషన్ సంచాలకుడు, ఎన్ఎం-ఐసీపీఎస్, కేంద్ర శాస్త్ర,సాంకేతిక శాఖ
ఈ ఏడాది నుంచి సాంకేతికత అభివృద్ధిపై దృష్టిపెట్టాం. పరిశోధన, సాంకేతికత అభివృద్ధి, బదలాయింపు, వాణిజ్యం, ఆంత్రపెన్యూర్షిప్, స్టార్టప్లకు చేయూత, మానవ వనరుల అభివృద్ధి వంటి అంశాలపైనా హబ్లు పనిచేస్తాయి. పరిశ్రమల భాగస్వామ్యం తప్పనిసరి. ఆయా హబ్లు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపయుక్తమైన సాంకేతికతను అభివృద్ధి చేస్తాయి.
పేటెంట్ స్థాయికి తీసుకెళ్లేలా పరిశోధన
-ఎస్.బాపిరాజు, ఐ-హబ్ డాటా సెంటర్ హెల్త్కేర్ అధిపతి, ట్రిపుల్ఐటీ-హైదరాబాద్
ట్రిపుల్ఐటీలో ఐహబ్ డాటా సెంటర్ అందుబాటులోకి తీసుకువచ్చాం. ఆరోగ్య రంగం, స్మార్ట్ సంచారంపై సాంకేతికత అభివృద్ధి చేయడమనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని డాటా రూపొందిస్తున్నాం. ఆయా ఉత్పత్తులను రూపొందించి పేటెంట్ స్థాయికి తీసుకెళ్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని
కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
పదిలో 91.31% ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు. 4,94,207 మంది రెగ్యులర్గా పరీక్ష రాయగా 4,51,272 మంది (91.31%) ఉత్తీర్ణత సాధించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావుల ప్రమాణం
తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. -
అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి అందజేత
స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భారాస నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. -
50 మంది రచయిత్రులకు ‘మాతృవందనం’ పురస్కారాలు
హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ‘మాతృవందనం’ (షష్టిపూర్తి కలాలకు సత్కారం) కార్యక్రమాన్ని నిర్వహించారు. -
జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్ చేయాలని) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. -
అనుమానం వచ్చిందంటే.. ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఉల్లిపాయ.. సాగు తగ్గిపాయే..!
మహబూబ్నగర్ జిల్లా గోప్లాపూర్కు చెందిన రైతులు ఉల్లిని పండించారు. మార్కెట్లలో తిరిగినా గిట్టుబాటు ధర రావడం లేదని, పైగా రవాణా ఖర్చులు భారమవుతున్నాయని ఇలా రోడ్డును ఆనుకొనే కుప్పలు పోసి విక్రయిస్తున్నారు -
సుర్రుమంటూ.. నీరంతా జుర్రేస్తూ..
భానుడు నీటిని పీల్చేస్తున్నాడు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన జలాశయాల్లో నీటి ఆవిరి శాతం పెద్దఎత్తున ఉంటోంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 41.5, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే ఉంటున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
టీఎస్ఈఏపీసెట్ ఇంజినీరింగ్ హాల్టికెట్ల విడుదల
టీఎస్ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష హాల్టికెట్లు మంగళవారం విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ బీడీ కుమార్ తెలిపారు. -
ఆలస్యరుసుంతో పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2024)కు రూ.100 ఆలస్యరుసుంతో దరఖాస్తు గడువును మే ఏడో తేదీ వరకు పెంచామని ఎస్బీటీఈటీ కార్యదర్శి ఎ.పుల్లయ్య తెలిపారు. -
వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కొత్త రిజిస్ట్రార్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్ట్రార్గా రఘురామిరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. -
7న బీసీ సంక్షేమ సంఘం కీలక సమావేశం: ఆర్.కృష్ణయ్య
రాష్ట్రంలోని బీసీల డిమాండ్లపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంతో ఈ నెల 7న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సమాజ సేవకులను సత్కరించుకోవాలి
‘‘లాభాపేక్ష లేకుండా సమాజం కోసం పనిచేసే వారిని గుర్తించి సత్కరించుకోవాలి. అయితే దురదృష్టవశాత్తూ ప్రస్తుత సమాజం రాజకీయాల్లో ఉన్నవారికి అధిక ప్రాధాన్యమిస్తూ గౌరవించుకుంటోంది’’ అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. -
నేత్రాధికారులకు న్యాయం చేయాలి
రాష్ట్రంలోని నేత్రాధికారుల (ఆఫ్తాల్మిక్ ఆఫీసర్స్)కు న్యాయం చేసి, పదోన్నతులను చేపట్టాలని రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర నేత్రాధికారుల సంఘం కోరింది. -
ఎన్వోసీల పేరుతో..కాసులవేట!
భవన నిర్మాణాలకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు నీటిపారుదల శాఖలోని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు లేవంటూ ధ్రువీకరించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. -
ఓయూలో సర్క్యులర్ ప్రచారంపై పోలీసు కేసు
సర్క్యులర్ను తప్పుగా మార్చి ప్రచారం చేస్తూ ఉస్మానియా ప్రతిష్ఠకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని అధికారులు మంగళవారం ఓయూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఎండ.. ప్రచండం
రాష్ట్రంలో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం ఎండ తీవ్రత తారస్థాయికి చేరింది. జగిత్యాల, నల్గొండ, కరీంనగర్లు మసిలిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
-
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
-
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!