రాష్ట్రంలో డ్రగ్స్ విలయం
రాష్ట్రంలో మత్తుమందులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వాడకందారులు పెరగడంతో అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలు రాష్ట్రంపై కన్నేశాయి. తన ఉనికి బయటపడకుండా దేశవ్యాప్తంగా
గత ఏడాది పట్టుబడినవి రూ. 200 కోట్లకు పైనే
స్మగ్లర్ టోనీ అరెస్టుతో కదిలిన డొంక
సరఫరాదారుల కోసం పోలీసుల ఆరా
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మత్తుమందులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వాడకందారులు పెరగడంతో అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలు రాష్ట్రంపై కన్నేశాయి. తన ఉనికి బయటపడకుండా దేశవ్యాప్తంగా డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్న టోనీతో పాటు మరికొందరిని హైదరాబాద్ పోలీసులు తాజాగా అరెస్టు చేయడంతో మరోమారు డ్రగ్స్ తుట్టె కదిలింది. గత ఏడాది రాష్ట్రంలో దాదాపు రూ.200 కోట్లకు పైగా విలువైన మత్తుమందులు స్వాధీనం చేసుకోగా, పట్టుబడకుండా వినియోగదారులకు చేరింది ఇంతకు నాలుగైదు రెట్లు ఉంటుందన్న అంచనాలు పరిస్థితి తీవ్రతను చాటుతున్నాయి.
ఉత్పత్తికీ స్థావరంగా..
రసాయన మాదకద్రవ్యాల ఉత్పత్తికీ హైదరాబాద్ స్థావరంగా మారింది. జీడిమెట్ల పారిశ్రామికవాడలో 2020 డిసెంబరు నెలలో డీఆర్ఐ అధికారులు ఇలాంటి కర్మాగారాన్ని కనుగొని మూడువేల కిలోలకు పైగా మెఫెడ్రన్ను స్వాధీనం చేసుకున్నారు. అదే ఏడాది ఆగస్టులోనూ హైదరాబాద్ శివార్లలోని మత్తుమందుల కర్మాగారంలో సోదాలు చేసి, రూ.47 కోట్ల విలువైన రసాయన మత్తుమందులు, రూ.50 కోట్ల విలువైన ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నాచారం పారిశ్రామికవాడలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు కూడా ఇలాంటి కర్మాగారాన్నే స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది నవంబరులో డీఆర్ఐ అధికారులు రూ.5.5 కోట్ల విలువైన 14 కిలోల ఎపిడ్రిన్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఉత్తరాంధ్రలో పండుతున్న గంజాయి అటు బెంగళూరు, ఇటు మహారాష్ట్ర, రాజస్థాన్, దిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాలకు తెలంగాణ మీదుగానే సరఫరా అవుతోంది.
సాంకేతిక పరిజ్ఞానంతో ఎత్తుగడలు
సాంకేతిక పరిజ్ఞానం పెరగడం మత్తుమందుల విక్రయానికి వరంలా మారింది. టోనీకి హైదరాబాద్లో పెద్ద వ్యవస్థ ఉంది. అతడు ఇంటర్నెట్ ఫోన్ వాడుతుండడంతో ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది. డ్రగ్స్ వ్యాపారం కోసం ఇతడు పలు యాప్లతో వేర్వేరు గ్రూపులు ఏర్పాటు చేసుకుని, ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడుతున్నాడు.
ఎవరికివారే..
మత్తుమందుల నియంత్రణలో వివిధ దర్యాప్తు సంస్థల మధ్య సమన్వయం లేదు. మాదకద్రవ్యాలకు అడ్డుకట్ట వేయాల్సిన కేంద్ర సంస్థ ఎన్సీబీకి సిబ్బంది, సరైన కార్యాలయం లేవు. రాష్ట్ర ఆబ్కారీశాఖ ఎంతసేపూ మద్యం అమ్మకాలపైనే దృష్టి పెడుతోంది. పోలీసుశాఖ ఏదైనా సమాచారం ఉన్నప్పుడు మాత్రమే మత్తుమందులపై దర్యాప్తు చేస్తోంది. డీఆర్ఐ ప్రధాన బాధ్యత అక్రమ దిగుమతులు, ఎగుమతులను అడ్డుకోవడం. ఇది కూడా తగిన సమాచారం ఉంటే తప్ప మత్తుమందులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే మాదకద్రవ్యాల సరఫరాదారులను కట్టడి చేయలేకపోతున్నారు.
అడ్డా... హైదరాబాద్
రాష్ట్రంలో మత్తుకు బానిసలవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. టోనీ వద్ద మత్తుమందులు కొనుగోలు చేసి పట్టుబడిన తొమ్మిది మంది కూడా చాలాకాలంగా మాదకద్రవ్యాల సరఫరాలో చురుగ్గా పాల్గొంటున్నట్లు భావిస్తున్నారు. టోనీ అనుచరులు 15 మందికిపైగా ఉన్నారని వెల్లడైనా పోలీసులు ఇప్పటివరకు 9 మంది ఆచూకీ మాత్రమే తెలుసుకోగలిగారు. గత ఏడాది డీఆర్ఐ అధికారులు కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆఫ్రికా నుంచి వచ్చిన రూ.121 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది రాష్ట్రంలో దాదాపు 20 వేల కిలోల గంజాయి పట్టుబడడం గమనార్హం. అత్యధికంగా రాచకొండ పోలీసులు 5779 కిలోల గంజాయి పట్టుకున్నారు. ఇదంతా స్థానిక వినియోగానికి నిర్దేశించిందేనని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని
కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
పదిలో 91.31% ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు. 4,94,207 మంది రెగ్యులర్గా పరీక్ష రాయగా 4,51,272 మంది (91.31%) ఉత్తీర్ణత సాధించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావుల ప్రమాణం
తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. -
అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి అందజేత
స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భారాస నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. -
50 మంది రచయిత్రులకు ‘మాతృవందనం’ పురస్కారాలు
హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ‘మాతృవందనం’ (షష్టిపూర్తి కలాలకు సత్కారం) కార్యక్రమాన్ని నిర్వహించారు. -
జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్ చేయాలని) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. -
అనుమానం వచ్చిందంటే.. ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఉల్లిపాయ.. సాగు తగ్గిపాయే..!
మహబూబ్నగర్ జిల్లా గోప్లాపూర్కు చెందిన రైతులు ఉల్లిని పండించారు. మార్కెట్లలో తిరిగినా గిట్టుబాటు ధర రావడం లేదని, పైగా రవాణా ఖర్చులు భారమవుతున్నాయని ఇలా రోడ్డును ఆనుకొనే కుప్పలు పోసి విక్రయిస్తున్నారు -
సుర్రుమంటూ.. నీరంతా జుర్రేస్తూ..
భానుడు నీటిని పీల్చేస్తున్నాడు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన జలాశయాల్లో నీటి ఆవిరి శాతం పెద్దఎత్తున ఉంటోంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 41.5, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే ఉంటున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
టీఎస్ఈఏపీసెట్ ఇంజినీరింగ్ హాల్టికెట్ల విడుదల
టీఎస్ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష హాల్టికెట్లు మంగళవారం విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ బీడీ కుమార్ తెలిపారు. -
ఆలస్యరుసుంతో పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2024)కు రూ.100 ఆలస్యరుసుంతో దరఖాస్తు గడువును మే ఏడో తేదీ వరకు పెంచామని ఎస్బీటీఈటీ కార్యదర్శి ఎ.పుల్లయ్య తెలిపారు. -
వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కొత్త రిజిస్ట్రార్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్ట్రార్గా రఘురామిరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. -
7న బీసీ సంక్షేమ సంఘం కీలక సమావేశం: ఆర్.కృష్ణయ్య
రాష్ట్రంలోని బీసీల డిమాండ్లపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంతో ఈ నెల 7న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సమాజ సేవకులను సత్కరించుకోవాలి
‘‘లాభాపేక్ష లేకుండా సమాజం కోసం పనిచేసే వారిని గుర్తించి సత్కరించుకోవాలి. అయితే దురదృష్టవశాత్తూ ప్రస్తుత సమాజం రాజకీయాల్లో ఉన్నవారికి అధిక ప్రాధాన్యమిస్తూ గౌరవించుకుంటోంది’’ అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. -
నేత్రాధికారులకు న్యాయం చేయాలి
రాష్ట్రంలోని నేత్రాధికారుల (ఆఫ్తాల్మిక్ ఆఫీసర్స్)కు న్యాయం చేసి, పదోన్నతులను చేపట్టాలని రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర నేత్రాధికారుల సంఘం కోరింది. -
ఎన్వోసీల పేరుతో..కాసులవేట!
భవన నిర్మాణాలకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు నీటిపారుదల శాఖలోని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు లేవంటూ ధ్రువీకరించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. -
ఓయూలో సర్క్యులర్ ప్రచారంపై పోలీసు కేసు
సర్క్యులర్ను తప్పుగా మార్చి ప్రచారం చేస్తూ ఉస్మానియా ప్రతిష్ఠకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని అధికారులు మంగళవారం ఓయూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఎండ.. ప్రచండం
రాష్ట్రంలో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం ఎండ తీవ్రత తారస్థాయికి చేరింది. జగిత్యాల, నల్గొండ, కరీంనగర్లు మసిలిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు
-
12 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
-
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లంటూ తాయిలం
-
తగ్గిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్ ధర
-
వసూల్ రాజాలు.. ఎన్నికలొచ్చాయని వెనక్కి తగ్గారు!
-
సంచలనానికి 50 ఏళ్లు.. ‘అల్లూరి సీతారామరాజు’ తెర వెనక ఎన్ని విశేషాలో..!