మరో రెండు క్యాథ్ల్యాబ్లు
గుండెజబ్బులకు చికిత్స అందించే అత్యాధునిక క్యాథ్ల్యాబ్ సౌకర్యం త్వరలో సిద్దిపేట, మహబూబ్నగర్ బోధనాసుపత్రుల్లో రానుంది. ప్రస్తుతం ఉస్మానియా, నిమ్స్ల్లో ఈ సేవలు కొనసాగుతున్నాయి. గాంధీలో ఈ సౌకర్యం కల్పించినా ఉపయోగించక పాడవడంతో మరో 2 నెలల్లో కొత్తగా నెలకొల్పడానికి
త్వరలో సిద్దిపేట, మహబూబ్నగర్లలో ఒక్కోటి రూ.7 కోట్లతో అందుబాటులోకి
నేడు ఖమ్మంలో ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు
గుండె వైద్యంలో మెరుగైన సేవలు
ఈనాడు - హైదరాబాద్: గుండెజబ్బులకు చికిత్స అందించే అత్యాధునిక క్యాథ్ల్యాబ్ సౌకర్యం త్వరలో సిద్దిపేట, మహబూబ్నగర్ బోధనాసుపత్రుల్లో రానుంది. ప్రస్తుతం ఉస్మానియా, నిమ్స్ల్లో ఈ సేవలు కొనసాగుతున్నాయి. గాంధీలో ఈ సౌకర్యం కల్పించినా ఉపయోగించక పాడవడంతో మరో 2 నెలల్లో కొత్తగా నెలకొల్పడానికి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మూడింటితో పాటు ఖమ్మంలో అత్యాధునిక క్యాథ్ల్యాబ్ను శుక్రవారం వైద్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మినహా జిల్లాల్లో నెలకొల్పనున్న తొలి క్యాథ్ల్యాబ్ ఇదే. వీటికి అదనంగా వచ్చే ఏడాదికి సిద్దిపేటలో, 2024లో మహబూబ్నగర్ బోధనాసుపత్రిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కోదానికి రూ.7 కోట్ల వ్యయం కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తాజాగా వైద్యఆరోగ్యశాఖ సర్కారుకు నివేదించింది. క్యాథ్ల్యాబ్లో గుండెజబ్బులకు పరీక్షలు, చికిత్సకు సంబంధించిన అత్యాధునిక సౌకర్యాలుంటాయి.
రోగులకు మేలు
* ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిలో నెలకొల్పిన అధునాతన క్యాథ్ల్యాబ్ విశేష సేవలందిస్తోంది. ఇప్పుడు జిల్లాల్లో ఏర్పాటు చేయడం ద్వారా గుండె చికిత్సల వికేంద్రీకరణ జరుగుతుంది.
* గుండె రక్తనాళాల్లో పూడికలుంటే క్యాథ్ల్యాబ్లో గుర్తించవచ్చు. స్థానికంగానే సరిచేయవచ్చు. అప్పుడు హైదరాబాద్కు రావాల్సిన శ్రమ తప్పుతుంది.
* ఖమ్మం క్యాథ్ల్యాబ్ పరిధిలో మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, మహబూబాబాద్ తదితర 12 అనుబంధ చికిత్స కేంద్రాలను చేర్చారు.
* వీటిల్లో టెలీ ఈసీజీ యంత్రాలను పెట్టారు.
* గుండెపోటు లక్షణాలతో వచ్చిన వ్యక్తికి ఈ కేంద్రాల్లో వైద్యుడు ముందుగా ఈసీజీ తీస్తారు. వెంటనే ఆ ఫలితం కాపీ ఆన్లైన్లో ఖమ్మం జిల్లా ఆసుపత్రిలోని క్యాథ్ల్యాబ్లో సేవలందిస్తున్న గుండె వైద్యనిపుణుడికి చేరుతుంది.
* ఆ ఫలితాన్ని వైద్యుడు ఆన్లైన్లో పరీక్షించి.. ఒకవేళ అందులో తేడాలున్నట్లుగా గుర్తిస్తే.. వెంటనే రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు ఇంజక్షన్(థ్రాంబోలైసిస్) ఇవ్వమని సూచిస్తారు.
* థ్రాంబోలైసిస్ ఇచ్చిన అనంతరం రోగి ఆరోగ్యం కుదుటపడగానే.. అక్కడ్నించి ఖమ్మం తరలించి, రక్తనాళాల్లో పూడికలున్నాయా అని తెలుసుకునే పరీక్ష(యాంజియోగ్రామ్) చేస్తారు. అవసరమైతే స్టెంటు చికిత్స(యాంజియోప్లాస్టీ) కూడా చేస్తారు.
* అచ్చంగా ఇదే తరహా విధానాన్ని సిద్దిపేట, మహబూబ్నగర్లలోనూ అమలు చేయనున్నారు.
బహుళ ప్రయోజనాలు
* ఈ క్యాథ్ల్యాబ్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినవి. ఇందులో ‘3 డి ఇమేజ్’ వెసులుబాటు ఉంటుంది.
* ‘ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వు’ విధానం కూడా ఉంటుంది. అంటే గుండె రక్తనాళాల్లో ఒక్కోసారి 50-60 శాతం పూడికలు ఏర్పడితే దీనికి స్టెంట్ వేయలా వద్ద అనేదాన్ని గుర్తించడానికి ‘ప్రెజర్ వైర్’ను వాటి వద్ద పెడతారు. తద్వారా పూడిక వద్ద రక్త ప్రసరణ ఒత్తిడిని గుర్తిస్తారు. దీన్ని ఆధారంగా చేసుకొని స్టెంట్ వేయాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారు.
* గుండె కవాటాల మార్పిడి, మరమ్మతులు, పేస్మేకర్ అమర్చడం, గుండె చుట్టూ నీరు చేరడం(పెరికార్డియల్ ఎఫ్యూజన్) వంటి వాటికి చికిత్సలు కూడా ఇందులోనే చేస్తుంటారు.
* గుండె రక్తనాళాల్లోనే కాదు.. చేతుల్లో, కాళ్లలోని రక్తనాళాల్లో కూడా స్టెంట్లను వేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు క్లోమగ్రంధిలోనూ స్టెంట్లు వేయాల్సి ఉంటుంది. వీటిని కూడా క్యాథ్ల్యాబ్లోనే చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్