కళ తప్పిన పసుపు!
రాష్ట్రంలో పసుపు పంట సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒకవైపు వర్షాలతో తెగుళ్లు వ్యాప్తి చెంది దిగుబడులు తగ్గుతుండగా, ఇదే సమయంలో మార్కెట్లో పంటకు ధరలు తగ్గడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది.
పడిపోతున్న ధర
రైతుకు నష్టాల భారం
అధిక వర్షాలు, తెగుళ్లతో దెబ్బతిన్న పంట
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పసుపు పంట సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒకవైపు వర్షాలతో తెగుళ్లు వ్యాప్తి చెంది దిగుబడులు తగ్గుతుండగా, ఇదే సమయంలో మార్కెట్లో పంటకు ధరలు తగ్గడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా శుక్రవారం క్వింటా కొత్త పసుపు ధర రూ.300 దాకా తగ్గి రూ.8411కి చేరింది. కనిష్ఠ ధర క్వింటాకు రూ.4501 మాత్రమే ఇచ్చారు. ఎక్కువ మంది రైతులకు సగటు ధర రూ.5333 చొప్పున వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లకు వస్తున్న కొత్త పసుపు పంటలో తేమ అధికంగా ఉంటోందని వ్యాపారులు ధర బాగా తగ్గించేస్తున్నారు. రాష్ట్రంలో పసుపు సాగవుతున్న కొన్ని జిల్లాల్లో సాధారణంకన్నా 30 నుంచి 50 శాతం అదనంగా కురిసిన వర్షాలతో నేలలో తేమ పెరిగి దుంపకుళ్లు తెగులు వ్యాపించింది. ఈ కారణంగా పంట దిగుబడి 20 శాతానికి పైగా తగ్గవచ్చని ‘భారత పసుపు వ్యాపారుల సంఘం’(ఐటీఏ) అంచనా వేసింది. సాధారణంగా తెలంగాణతో పోలిస్తే మహారాష్ట్ర మార్కెట్లలో ధరలు అధికంగా ఉంటాయి. ప్రస్తుతం అక్కడే తక్కువగా ఉంది. క్వింటా ధర రూ.9 వేలకుపైగా ఉంటేనే రైతుకు గిట్టుబాటవుతుందని రాష్ట్ర ఉద్యానశాఖ అంచనా. ‘‘సాధారణంగా పసుపు సాగుకు ఎకరాకు రూ.1.20 లక్షలు ఖర్చవుతుంది. 20-25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం 15 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ధరలు పుంజుకోకపోతే పెట్టుబడుల్లో సగం కూడా వచ్చే పరిస్థితి ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించి రైతులను ప్రోత్సహించాలని తెలంగాణ ఉద్యానశాఖ కేంద్రానికి లేఖ రాసినా స్పందన లేదు. ‘‘ఈ పంటకు ఎంత ధర ఇవ్వాలనేది వ్యాపారుల ఇష్టాయిష్టాలపైనే ఆధారపడి ఉంటోంది. ఇక్కడి వ్యాపారులు మహారాష్ట్రకన్నా ఎప్పుడూ క్వింటాకు రూ.వెయ్యి నుంచి 3 వేల దాకా తక్కువ చెల్లిస్తున్నారు. అందుకే ఏటా పంట విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది’’ అని రైతులు వాపోతున్నారు.
వేచిచూస్తే ధరలు పెరగొచ్చు
‘‘వర్షాలతో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ పంట దిగుబడులు తగ్గాయి. 2020లో దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లకు 97 లక్షల బస్తాల పసుపు వచ్చింది. ఒక్కో బస్తా 50 కిలోలుంటుంది. ఈ ఏడాది 94.20 లక్షల బస్తాలకు మించి రాకపోవచ్చని భారత పసుపు వ్యాపారుల సంఘం అంచనా. ఇందులో తెలంగాణలోనే అత్యధికంగా 25.90 లక్షల బస్తాలుండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మళ్లీ పసుపు వినియోగం పెరిగి ఎగుమతులు పుంజుకునే అవకాశాలున్నాయి. రాష్ట్ర రైతులు కొత్త పసుపు పంటను ఈ నెలాఖరు నుంచి మార్కెట్లకు తేవడం ఆరంభిస్తారు. వారు వేచిచూస్తే కొంతకాలానికి ధరలు పెరిగే అవకాశాలున్నాయి’’ అని ఐటీఏ ప్రతినిధులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు