80 శాతానికిపైగా అనర్హులే!
అటవీ భూములపై హక్కుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో 80 శాతానికిపైగా అనర్హులవే ఉన్నట్లు ఆ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
సాగు చేయని పోడు భూమికీ దరఖాస్తులు
దాదాపు 50 శాతం గిరిజనేతరులవే..
అధికారుల పరిశీలనలో విస్మయకర విషయాలు..
ఈనాడు, హైదరాబాద్: అటవీ భూములపై హక్కుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో 80 శాతానికిపైగా అనర్హులవే ఉన్నట్లు ఆ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,14,353 లక్షల మంది 12,46,846 లక్షల ఎకరాల అటవీ భూముల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో దాదాపు సగం దరఖాస్తులు గిరిజనేతరులవేనని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో సర్వే, గ్రామసభలు నిర్వహించగా.. పలుచోట్ల విస్మయం కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు. కొన్నిచోట్ల సాగు చేయని భూములకూ, మరికొన్నిచోట్ల ప్రభుత్వ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల పేర్లతోనూ దరఖాస్తులిచ్చారని గుర్తించారు. కొన్ని జిల్లాల్లో 90-95 శాతానికి పైగా దరఖాస్తులు అర్హమైనవి కావని అధికారులు తెలిపారు.
పెద్దపల్లిలో 8 దరఖాస్తులకే అర్హత
పెద్దపల్లి జిల్లాలో 8,292.61 ఎకరాల భూములపై పోడు హక్కుల కోసం 4,592 దరఖాస్తులందాయి. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఏకంగా 4,584 దరఖాస్తులు ఆర్ఓఎఫ్ఆర్(అటవీ హక్కుల గుర్తింపు) చట్టం ప్రకారం అనర్హమైనవిగా అధికారులు తేల్చారు. అంటే అర్హమైనవి కేవలం 8 దరఖాస్తులే. వాటికి సంబంధించి సాగులో ఉన్న భూమి 9.19 ఎకరాలే. ఇక్కడ ఎస్టీలు 485 మంది 942.55 ఎకరాల భూమికి హక్కులు కోరగా.. ఏకంగా 4,107 మంది గిరిజనేతరులు 7,350.6 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
నాలుగో వంతు భద్రాద్రి కొత్తగూడెంలోనే..
రాష్ట్రవ్యాప్తంగా 12.46 లక్షల ఎకరాల అటవీ భూములపై హక్కుల కోసం దరఖాస్తులు రాగా.. వాటిలో ఒక్క భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని భూముల విస్తీర్ణమే 2,99,478 ఎకరాలుంది. అంటే దాదాపు నాలుగో వంతు. ఆ తర్వాత అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,19,903, మహబూబాబాద్లో 1,16,496, ఆదిలాబాద్లో 96,760 ఎకరాలకు దరఖాస్తులు వచ్చాయి.
* కామారెడ్డి జిల్లాలో 69,210 ఎకరాలకు 27,482 దరఖాస్తులు రాగా.. ఇందులో 80 శాతానికిపైగా ఆర్ఓఎఫ్ఆర్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. వికారాబాద్ జిల్లాలో 20,797 ఎకరాలకు 9,973 దరఖాస్తులు రాగా.. ఇందులో దాదాపు 90 శాతానికి పైగా అనర్హమైనవే ఉన్నాయని ఆ జిల్లా అటవీ అధికారి ఒకరు తెలిపారు. ఇతర జిల్లాల్లోనూ దాదాపు అవే పరిస్థితులున్నట్లు సమాచారం. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో కానిస్టేబుల్ తల్లి పేరుతో మూడు ఎకరాల భూమిపై హక్కు కోసం దరఖాస్తు వచ్చింది. ఇదే జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి తన భార్య పేరుతో రెండెకరాలకు దరఖాస్తు చేశారు.
జిల్లా కమిటీలదే తుది నిర్ణయం
దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో సర్వే, గ్రామసభలు పూర్తయ్యాయి. కొన్నిచోట్ల డివిజన్ కమిటీల పరిశీలన పూర్తయింది. అన్ని డివిజన్లలో పరిశీలన పూర్తయ్యాక కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. మునుగోడు నియోజకవర్గంలో మాత్రం ఉప ఎన్నిక కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యంగా నడుస్తోంది. పోడు సర్వేలో ఇతర శాఖలతో పాటు అటవీ బీట్ అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తులో పేర్కొన్న భూమి రక్షిత అటవీ ప్రాంతంలో ఉందా.. లేదా? అక్కడ పోడు సాగవుతోందా? దరఖాస్తుదారు అధీనంలోనే ఉందా? వంటి అంశాల్ని పరిశీలించారు.
ఆక్రమణ, సాగు చేయకుండానే..
అటవీ హక్కుల చట్టం-2005 నిబంధనలకు లోబడి పోడు దరఖాస్తులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీకి ముందే అటవీ ప్రాంతంలో గిరిజనులు సాగు చేస్తుండాలి. దరఖాస్తు చేసినవారి అధీనంలోనే అటవీ భూమి ఉన్నట్లు ఆధారాలుండాలి. గిరిజనేతరులైతే చట్టం అమలులోకి రావడానికి 75 ఏళ్ల ముందు నుంచి సాగు చేస్తుండాలి. ‘‘చాలామంది మూడు నాలుగేళ్ల క్రితం, కొందరైతే ఏడాది క్రితం ఆక్రమించిన భూములకు దరఖాస్తు చేసుకున్నారు. మరికొందరు అసలు ఆక్రమణ, సాగు చేయకుండానే దరఖాస్తు చేశారు’’ అని ఓ జిల్లా అటవీ అధికారి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, తాండూరు, వికారాబాద్ రేంజ్లో పోడు సాగు లేకుండానే భారీగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. చట్టం అమలులోకి వచ్చే నాటికే అక్కడ గిరిజనులు పోడు సాగు చేస్తున్నారా? లేదా? అన్న విషయాల్ని శాటిలైట్ చిత్రాలు, గూగుల్ ఎర్త్ మ్యాప్లను పోల్చుకుని నిర్ధారణకు వస్తున్నారు. 2005కి ముందు ఆక్రమణల్లో లేని భూముల దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు అర్హత లేని దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. -
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు.. నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’నా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, వైజయంతిమాల
ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్ నటి, ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. -
అమెరికాలో హనుమకొండ విద్యార్థి అదృశ్యం
అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి కొద్ది రోజుల క్రితం షికాగోలో అదృశ్యమయ్యాడు. -
ఎర్రని ఎండ.. కానరాని నీడ
‘శూన్య నీడ దినం’ సందర్భంగా హైదరాబాద్లో గురువారం మధ్యాహ్నం 12:12 గంటలకు నడినెత్తిన సూర్యుడున్నా కాసేపు ‘నీడ’ మాయమైంది. దీన్ని వీక్షించేందుకు బీఎం బిర్లా సైన్స్ సెంటర్లోని నక్షత్రశాల (ప్లానెటోరియం) ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో..
ఇన్నాళ్లూ ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే.. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు పడొచ్చని భావించేవారు. -
మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలి: ఐకార్ డీడీజీ శర్మ
వరి, పత్తిలతో సమానంగా మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలని, అధిక ఉత్పత్తినిచ్చే నూతన వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్ శర్మ పిలుపునిచ్చారు. -
ఓటేస్తే కన్సల్టేషన్, వైద్య పరీక్షల్లో రాయితీ
ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకొచ్చాయి. -
పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలి: యూఎస్పీసీ
విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠశాలల్లో విద్యావాలంటీర్లను, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, ఉచిత విద్యుత్తు అమలు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. -
‘బ్యారేజీ’ పేరుతో.. ‘డ్యాం’ నిర్మాణం జరుగుతున్నట్లు ముందే తెలుసా?
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్లను జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
ఉత్తమ పర్యావరణ వీడియోలకు ఆహ్వానం: పీసీబీ
పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వీడియోలను పంపాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కోరింది. -
పాడి రైతులకు బిల్లులు చెల్లించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయడెయిరీ)కి పాలను విక్రయిస్తున్న రైతులు గత 40 రోజులుగా బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని పలు పాడి ఉత్పత్తిదారుల సంఘాల నేతలు సమాఖ్య ఎండీ చిట్టెం లక్ష్మిని కోరారు. -
ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీఎస్ఈఏపీసెట్-2024లో గురువారం మూడో రోజు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
అమిత్షా నకిలీ వీడియో కేసు.. తెలంగాణకే పరిమితం కాదు
కేంద్ర హోంమంత్రి అమిత్షా నకిలీ వీడియోకు సంబంధించిన కేసు కేవలం తెలంగాణకే పరిమితం కాదని, దేశం నలుమూలలా వ్యాపించిందని దిల్లీ పోలీసులు గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. -
ఆ పురుగుల మందుపై నిషేధం
టీస్పేన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్కు చెందిన ట్రైకో డెర్మా విరిడి 1.50% లిక్విడ్ ఫార్ములేషన్ క్రిమిసంహారక మందును నిషేధించినట్లు వ్యవసాయ సంచాలకుడు బి.గోపి గురువారం తెలిపారు. -
లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయిలు రూ.477.34 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయి పెరుగుతూ వస్తోంది. 2019లో నాటి సీఎం కేసీఆర్ లక్ష్మీ పంపుహౌస్ను ప్రారంభించగా 2022 జులై వరకు గోదావరి జలాలను ఎత్తిపోశారు.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..