TS News: మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు!
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి 1 నుంచి ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమోదం తీసుకొని ఈ వారం రోజుల్లో టైంటేబుల్ను ప్రకటించనుంది.
ప్రతిపాదనలు సిద్ధం చేసిన బోర్డు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి 1 నుంచి ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమోదం తీసుకొని ఈ వారం రోజుల్లో టైంటేబుల్ను ప్రకటించనుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎగ్జామ్స్కు, జవాబుపత్రాల మూల్యాంకనానికి ఇబ్బంది లేకుండా ఈసారి కొంత ముందుగా పరీక్షలను ప్రారంభించాలని భావిస్తున్నారు. గత విద్యా సంవత్సరం మార్చి 15 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 1-15 మధ్య జేఈఈ మెయిన్ చివరి విడత ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత కనీస గడువు ఉంటే విద్యార్థులు సన్నద్ధమవడానికి వీలవుతుంది. దానికితోడు ఇంటర్ తర్వాతే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలి. ఈసారి జూన్ 1వ తేదీ నుంచే ఇంటర్ కళాశాలలు ప్రారంభం కావడంతో కనీసం మార్చి 1వ తేదీ నుంచి పరీక్షలు మొదలుపెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఉంటాయి.
ఈసారి మార్పులివీ...
- ఈసారి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నైతికత, మానవీయ విలువల ఎగ్జామ్ ఉండదు. అందులోని అంశాలను ఆంగ్లం సబ్జెక్టులో మిళితం చేసినట్లు ఇంటర్బోర్డు వర్గాలు ఇప్పటికే స్పష్టంచేశాయి. గతంలో రాయని పాత విద్యార్థులకు మాత్రం ఉంటుంది. అయితే మొదటి సంవత్సరంలో పర్యావరణ విద్య పరీక్ష మాత్రం అందరికీ ఉంటుంది.
- ఇంటర్ ఫస్టియర్లో ఆంగ్లం సబ్జెక్టులో 20 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. రాత పరీక్ష 80 మార్కులకే నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్ను ఆయా కళాశాలలే నిర్వహిస్తాయి. భాష అనేది మాట్లాడితేనే వస్తుందని భావించి ఈసారి మార్పులు చేశారు. జస్ట్ ఏ మినిట్ పేరిట.. ఇచ్చిన అంశంపై ఒక నిమిషం ఆంగ్లంలో మాట్లాడటం, ఒక పేరాను చదవడం, సొంతంగా ఏదైనా ఒక అంశంపై రాయడం, ఒక ఆడియో పాఠాన్ని విని ప్రశ్నలు రూపొందించడం లాంటి వాటిని ప్రాక్టికల్స్లో చేరుస్తున్నారు.
బ్రిడ్జి కోర్సు పరీక్షకు దరఖాస్తు, ఫీజు అవసరం లేదు
ఇంటర్ బైపీసీ, ఒకేషనల్ విద్యార్థులు బీటెక్లో చేరేందుకు గణితం బ్రిడ్జి కోర్సును పూర్తి చేసి ఉండాలి. ఇంటర్ పరీక్షలప్పుడు చివరిలో బ్రిడ్జి కోర్సు ఎగ్జామ్ నిర్వహిస్తారు. అది రాయాలంటే ఫీజు చెల్లించాలి. చాలా మంది విద్యార్థులకు ఇది తెలియడం లేదు. దాంతో వారు పరీక్షలు రాయడానికి వీల్లేకుండా పోతోంది. అందుకే ఈసారి బ్రిడ్జి కోర్సు పరీక్షకు ప్రత్యేకంగా దరఖాస్తు, ఫీజు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందరూ బ్రిడ్జి కోర్సుకు హాజరయ్యేలా హాల్టికెట్లపై తేదీలను ముద్రించనున్నారు. ఆసక్తి ఉన్న ప్రతి ఇంటర్ బైపీసీ, ఒకేషనల్ గ్రూపు విద్యార్థులు హాజరు కావచ్చు.
ప్రత్యేకావసరాల పిల్లలకు ఒక సబ్జెక్టు మినహాయింపు
ప్రత్యేకావసరాల పిల్లలకు ద్వితీయ భాష పరీక్ష మినహాయింపు ఉంటుంది. అది రాయకున్నా ఇబ్బంది లేదు. చాలా మందికి ఆ విషయం తెలియడం లేదు. సెకండియర్లో తెలుసుకొని మినహాయింపు అడిగితే ఫస్టియర్లో రాసినందున ఇప్పుడు మినహాయింపు కుదరదని అధికారులు తేల్చిచెబుతున్నారు. దాంతో ఈసారి ప్రథమ సంవత్సరంలో రాసినా రెండో ఏడాది మినహాయింపు ఇవ్వనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ