నిపుణులైన కార్మికులకు ఇజ్రాయెల్ ఆహ్వానం.. జీతమెంతో తెలుసా?
ఇజ్రాయెల్ తమ దేశంలో మౌలిక సదుపాయాలను భారీగా విస్తరించుకునే క్రమంలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టులతో భారతీయ కార్మికులకు ఉపాధి అవకాశాలు అందివస్తున్నాయి.
ఈనాడు, హైదరాబాద్: ఇజ్రాయెల్ తమ దేశంలో మౌలిక సదుపాయాలను భారీగా విస్తరించుకునే క్రమంలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టులతో భారతీయ కార్మికులకు ఉపాధి అవకాశాలు అందివస్తున్నాయి. ఆ దేశంలో నిర్మాణ రంగంలో నిపుణులైన కార్మికులకు డిమాండ్ పెరిగింది. దీంతో నమ్మకమైన దేశాల నుంచి నైపుణ్యం కలిగిన మానవ వనరులను నియమించుకోవాలని ఆ దేశం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు ఉత్తరాది రాష్ట్రాల్లో కార్మికుల కోసం రిక్రూట్మెంట్ మొదలుపెట్టింది. తెలంగాణలో నుంచి 10 వేల మంది కార్మికులను తీసుకోవాలని భావిస్తోంది. వచ్చే నెలలో రాష్ట్రంలో ఇజ్రాయెల్ అధికారులు నైపుణ్య పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ (టామ్కామ్) అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆ పరీక్షల్లో విజయం సాధించిన కార్మికుల వ్యక్తిగత, కుటుంబ వివరాలను పోలీస్ వెరిఫికేషన్ ద్వారా పరిశీలించి వర్క్ వీసాలు మంజూరుచేస్తారు. ఇజ్రాయెల్లో నిర్మాణ రంగంలో పనిచేసేందుకు ఎంపికైన కార్మికుల కోసం స్వల్పకాలిక నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) నిర్ణయించింది.
నెలకు రూ.1.37 లక్షల వేతనం...
సంక్షోభ సమయాల్లో పలు దేశాల్లో భారతీయ కార్మికులు పనిచేశారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన అనేక మందికి పశ్చిమాసియా దేశాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఇజ్రాయెల్లో కార్మికుల కోసం ఆ దేశ ప్రతినిధులు టామ్కామ్ అధికారులను సంప్రదించినపుడు ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఎవరైనా వెళతారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే టామ్కామ్ అధికారులు నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్లో చేపట్టిన ఉద్యోగ మేళాలకు భారీ స్పందన వచ్చింది. అక్కడ పనిచేసేందుకు దాదాపు రెండువేల మందికి పైగా దరఖాస్తు చేశారు. వీటిని టామ్కామ్ అధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే పూర్వ మహబూబ్నగర్, మెదక్, నల్గొండ జిల్లాల్లో నియామక డ్రైవ్లు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుభవజ్ఞులైన కార్మికులకు నెలకు రూ.1.37 లక్షల వేతనం వచ్చే అవకాశం ఉంది. ‘ఈ విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దు. నియామకాల కోసం టామ్కామ్ అవసరమైన సహాయం చేస్తుంది. ఇజ్రాయెల్ వెళ్లేందుకు విమాన టికెట్, వైద్యపరీక్షలు మినహా ఇతర ఖర్చులేమీ ఉండవు. టామ్కామ్ ద్వారా విదేశాలకు వెళ్లిన వారికి ఉద్యోగ, సామాజిక భద్రత ఉంటుంది’ అని టామ్కామ్ అధికారులు తెలిపారు.
ఉద్యోగావకాశాలు ఇలా...
రంగాలు : ఫ్రేమ్వర్క్, షట్టరింగ్ కార్పెంటర్, ఐరన్ బెండింగ్, సిరామిక్ టైల్, ప్లాస్టరింగ్
నెలవారీ వేతనం : 6,100 ఇజ్రాయెలీ న్యూషెకల్ (దాదాపు రూ.1,37,260పైగా)
అర్హతలు : కనీసం పదోతరగతి ఉత్తీర్ణత, సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభవం
వయోపరిమితి : 25-45 ఏళ్లు.
కాలపరిమితి : తొలుత ఏడాది... అవసరమైతే పనికాలాన్ని పొడిగిస్తారు.
పని గంటలు : రోజుకు 9 గంటలు పనిచేయాలి. ఎక్కువ గంటలు పనిచేస్తే నిబంధనల ప్రకారం ఓవర్టైమ్ చెల్లిస్తారు.
నిబంధనలు : ఆహారం, వసతి, విమాన టికెట్ల ఖర్చులు కార్మికుడు భరించాలి. వసతి, భోజనం కోసం నెలకు 278-449 ఇజ్రాయెలీ న్యూషెకల్ వేతనం నుంచి మినహాయిస్తారు.
అర్హులైన కార్మికులు వ్యక్తిగత వివరాలను tomcom.resume@gmail.com కు మెయిల్ చేయాలి. మరిన్ని వివరాలకు 7893566493, 9849639539, 9100798204 లేదా 040-23342040 నంబర్లలో సంప్రదించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.