Paddy Cultivate: వరి పంట వద్దేవద్దు
ఈ యాసంగిలో రైతులు వరి వేయవద్దని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయబోదని స్పష్టం చేశారు. వరికి బదులు పత్తి, ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అభ్యర్థించారు.
యాసంగిలో వేస్తే కొనుగోలు చేయం
ఇదే రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయం
బియ్యంపై కేంద్రం చేతులెత్తేసింది
రాష్ట్రం కొనే పరిస్థితి లేదు
మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టీకరణ
వానాకాలం ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని వెల్లడి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి. పక్కన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
ఈనాడు, హైదరాబాద్: ఈ యాసంగిలో రైతులు వరి వేయవద్దని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయబోదని స్పష్టం చేశారు. వరికి బదులు పత్తి, ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అభ్యర్థించారు. ఉప్పుడు బియ్యం ఎఫ్సీఐ కొనుగోలు చేయదంటూ కేంద్రం స్పష్టం చేసిందని.. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరిని కొనే పరిస్థితి లేదని, ఎగుమతులు కూడా మన పరిధిలో లేవని, రైతులు అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. కంపెనీలతో ఒప్పందం మేరకు విత్తన వడ్లు సాగు చేసే రైతులు, మిల్లర్లతో అవగాహన గల వారు నిరభ్యంతరంగా వరి సాగు చేసుకోవచ్చన్నారు. విపక్షాలు రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయని.. అన్నదాతలు వారి చేతుల్లో పావులుగా మారవద్దని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను ప్రభుత్వం సిద్ధం చేస్తోందని చెప్పారు. ప్రస్తుత వానాకాలం వరి పంటను ఎఫ్సీఐ కొనకున్నా ప్రభుత్వం అండగా నిలుస్తుందని.. దొడ్డు వడ్లయినా, సన్నరకాలైనా కొనుగోలు చేస్తామని చెప్పారు. నిరంజన్రెడ్డి శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
‘వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నానా యాగీ చేస్తోంది. తన చేతగానితనాన్ని రాష్ట్రాల మీదకు నెడుతోంది. వ్యవసాయ ఉత్పత్తులను కొనే బాధ్యత కేంద్రానిదే. వానాకాలం పంటలో కేంద్రం ఎంత కొన్నా... మిగతాది రాష్ట్ర అవసరాలకు, మిల్లర్ల వ్యాపారానికి వినియోగం అవుతుంది. యాసంగిలో ఉప్పుడు (దొడ్డు) బియ్యం కొనేది లేదని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎఫ్సీఐ నొక్కి చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వమే కొని వాడే పరిస్థితి లేదు. ఎగుమతులు సాధ్యం కానందున రైతుల బాగు కోసం వరి సాగు వద్దని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది కేంద్రం మాట ఇచ్చిన నేపథ్యంలో తీసుకున్న ధాన్యంలోనే ఇంకా 5 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ ప్రభుత్వం వద్ద మూలుగుతున్నాయి. కేంద్రం బాధ్యతారాహిత్యానికి ఇది నిదర్శనం. దేశంలో పంటల కొనుగోళ్ల విషయంలో వారికి ఒక విధానం లేదు. తెలంగాణ ప్రభుత్వం చెప్పేది అబద్ధమనుకుంటే.. యాసంగిలో కొనుగోళ్లు ఉంటాయని భాజపా ప్రజాప్రతినిధులు కేంద్రం నుండి లిఖితపూర్వక హామీ తీసుకురావాలి. భారత ఆహారరంగాన్ని కార్పొరేట్లు, ప్రైౖవేటుపరం చేసే కుట్రలో భాగంగా కేంద్రం కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పుకొంటోంది. విపత్కర పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో వరి వేయవద్దు.. ప్రభుత్వం కొనలేదని బద్నాం చేయొద్దు.
పత్తి కోటి ఎకరాల్లో వేసినా..
ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు మనసుతో వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దారు. ఆయన కృషి ఫలితమే తెలంగాణలో పెద్దఎత్తున పంటల దిగుబడి వస్తోంది. ఈ వానాకాలం ఎక్కువగా పత్తి సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశాం. కానీ, అనుకున్నంతగా పత్తి వేయలేదు. ఈ రోజు మద్దతు ధరకు మించి మూడు వేలు ఎక్కువగా పత్తి ధర పలుకుతోంది. కోటి ఎకరాలలో పత్తి సాగు చేసినా రైతులకు మద్దతు ధర దక్కుతుంది. కామారెడ్డిలో రైతు మరణం దురదృష్టకరం. ప్రభుత్వం ఈ ఘటనపై నివేదిక తెప్పించుకుంది’’ అని నిరంజన్రెడ్డి తెలిపారు.
అపోహలు వద్దు: గంగుల
‘‘వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో అపోహలు అవసరం లేదు. కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలో 6,570 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు 2100 కేంద్రాల ద్వారా 3562 మంది రైతుల నుంచి 2.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. మిల్లర్ల వద్ద టోకెన్ పద్ధతి ఉంది. అది సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు పరిమితం’’ అని గంగుల తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, పౌరసరఫరాల కమిషనర్ అనిల్కుమార్లు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల బాధలు వర్ణనాతీతం. -
కళాశాల గురువును కలిసిన కేసీఆర్
జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాకు బయలుదేరేముందు తన గురువైన చరిత్రకారుడు డాక్టర్ జైశెట్టి రమణయ్య ఇంటికి కేసీఆర్ వెళ్లారు. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సోమవారం పంపింది. -
ఐదు ఎకరాలు దాటిన వారికి రైతుబంధు
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద యాసంగి సీజన్కు గాను ఐదు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు సైతం ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను ప్రారంభించింది. -
కొనసాగిన తీవ్ర ఎండలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం ఎండలు మంటలు రేపాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
2024.. అత్యంత వేడి సంవత్సరం
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్లు ‘క్లైమేట్ ట్రెండ్స్’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
కవితకు బెయిల్ నిరాకరణ
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇవ్వడానికి ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67 శాతం కరవుభత్యంతో కలిపి 2023 జులై మొదటి తేదీ వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీవోల సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
మరో రూ.20 చెల్లిస్తే డీలక్స్లో ప్రయాణం: ఆర్టీసీ
ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి మంత్లీ సీజన్ టికెట్ పాస్లు ఉన్న వారు డీలక్స్ బస్సులూ ఎక్కొచ్చని అయితే ప్రతిసారి అదనంగా రూ.20 చెల్లించాలని ఆర్టీసీ పేర్కొంది. -
ఆ భూముల్లోంచి పిటిషనర్లను ఖాళీ చేయించొద్దు
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిమిత్తం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 9.03 ఎకరాలు, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాములపర్తిలో 14 ఎకరాల నుంచి యజమానులను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు నివేదికివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి.. అమలు నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియో కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. దిల్లీ పోలీసులు గందరగోళం సృష్టించాల్సిన అవసరం లేదని హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
న్యుమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్
చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియాను నిర్ధారించేందుకు ట్రిపుల్ఐటీ హైదరాబాద్లోని ఐసీ-వైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. -
మారిన ‘నీట్’ ప్రశ్నపత్రం.. ఆందోళనలో విద్యార్థులు
ఆసిఫాబాద్లోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం కలెక్టర్ వెంకటేశ్కు ఫిర్యాదు చేశారు. -
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన బకాయిలు చెల్లించాలి
రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. -
పంట నష్టపరిహారం నిధుల విడుదల
రాష్ట్రంలో గత మార్చి 16 నుంచి 21 వరకు వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం