MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలకు వేళాయె
రాష్ట్రంలో శాసనసభ్యుల కోటా కింద ఆరు శాసనమండలి స్థానాలకు నవంబరు 29న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలు ...
ఆరు స్థానాలకు 29న పోలింగ్
షెడ్యూలు విడుదల చేసిన ఈసీ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో శాసనసభ్యుల కోటా కింద ఆరు శాసనమండలి స్థానాలకు నవంబరు 29న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలు విడుదల చేసింది. నవంబరు 9న నోటిఫికేషన్తో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆకుల లలిత, ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిలకు ఆరేళ్ల పదవీకాలం ఈ ఏడాది జూన్ 3న పూర్తయింది. సాధారణంగా సభ్యుల పదవీ కాలం ముగియటానికి ముందే ఈసీ ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తుంది. కరోనా కారణంగా అప్పట్లో వాయిదా వేసింది. ‘ఎన్నికల నిర్వహణపై అధికారులతో సంప్రదింపులు జరిపాక, పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అందుకే ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించాం. కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికల్లో కొవిడ్ మార్గదర్శకాలను పర్యవేక్షించేందుకు ఒక సీనియర్ అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. డిసెంబరు ఒకటో తేదీలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.
షెడ్యూల్ ఇదే
ఎమ్మెల్సీ ఎన్నికలకు నవంబరు 9 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17న పరిశీలన... నవంబరు 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏకగ్రీవాలు కాని పక్షంలో 29వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు అయిదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు మన ‘నీడ’ మనకు కనిపించదు!
మనం ఎండలో ఎక్కడికి వెళ్లినా.. కూర్చున్నా.. నిల్చున్నా.. మన నీడ వెన్నంటే ఉంటుంది కదా.. గురువారం మిట్టమధ్యాహ్న సమయంలో మాత్రం అలా ఉండదు. -
రాజధానిలో భారీ వర్షాలకు 14 మంది మృత్యువాత
రాజధాని నగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కారణంగా వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. -
రైతులెవరూ ఆందోళన చెందొద్దు..
ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. -
నేనూ కేసీఆర్ బాధితుడినే!
తాను కేసీఆర్ బాధితుడినంటూ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు సంచలన విషయాలను వెల్లడించారు. -
ఇక త్వరత్వరగా ధాన్యం తూకం!
అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడుస్తుండటం.. లారీల కొరత, హమాలీల సమస్యతో రవాణాలో, తూకం వేయడంలో జాప్యమవుతున్న నేపథ్యంలో పౌరసరఫరాల సంస్థ దృష్టి సారించింది. -
దలైలామాకు పీవీ స్మారక పురస్కారం
ప్రపంచ శాంతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు పీవీ నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ‘భారతరత్న పీవీ నరసింహారావు స్మారక పురస్కారా’న్ని అందించింది. -
నేటి నుంచి ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియను ఈ నెల 9వ తేదీ (గురువారం) నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. -
యూరప్ వెళ్తా.. అనుమతించండి
విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హైదరాబాద్లోని సీబీఐ కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. -
పారిశ్రామికవేత్త రామభద్రకు జపాన్ పురస్కారం
హైదరాబాద్లోని ‘నాగ రామ జపాన్ హబ్’ సంస్థ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్ర జపాన్ ప్రభుత్వ ‘ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్, గోల్డ్ రేస్ విత్ రోసెట్’ పురస్కారం అందుకున్నారు. -
మత్తు దందాపై ఆబ్కారీ నిఘా..!
మత్తు దందాపై ఆబ్కారీశాఖ నిఘా తీవ్రతరం చేసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మాదకద్రవ్యాల రవాణా ముఠాలు, సారా తయారీ స్థావరాలు, సుంకం చెల్లించని మద్యం విక్రయాలపై దాడులు ముమ్మరం చేసింది. -
అభిషేక్ బోయిన్పల్లి మధ్యంతర బెయిల్ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ బోయిన్పల్లి మధ్యంతర బెయిల్ను జులై 8 వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. -
నిర్మాణాల తొలగింపునకు ఆదేశాలిచ్చే పరిధి లోకాయుక్తకు లేదు: హైకోర్టు
ప్రైవేటు వ్యక్తులకు చెందిన నిర్మాణాలను తొలగించాలంటూ ఆదేశాలిచ్చే పరిధి లోకాయుక్తకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సికింద్రాబాద్ నుంచి ఖుర్దారోడ్కు 10, 11 తేదీల్లో ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్ నుంచి ఒడిశాలోని ఖుర్దారోడ్ స్టేషన్కు రెండు రోజులపాటు రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. -
వేతనాల్లో వ్యత్యాసాలను సవరించాలి
గ్రూప్-1 పోస్టుల వేతనాల్లో వ్యత్యాసాలను సవరించాలని, ఆ పోస్టుల్లో పనిచేసే వారికి సమాన వేతనాలు ఇవ్వాలని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
దేశంలోనే అత్యుత్తమ పంటల బీమా పథకం తెస్తాం
‘‘గడిచిన ఐదేళ్లుగా కేసీఆర్ అనుసరించిన విధానాలు రైతులకు అనుకూలంగా లేవు. కఠినతర నిబంధనలతో రైతులందరికీ పంటల బీమా వర్తించలేదు. -
కాంగ్రెస్ సామాజిక మాధ్యమ కార్యదర్శులపై.. కఠిన చర్యలు తీసుకోకుండా దిల్లీ పోలీసులను ఆదేశించండి
దిల్లీలో నమోదైన ఎఫ్ఐఆర్లో దర్యాప్తు పేరుతో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) సామాజిక మాధ్యమ రాష్ట్ర కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకోకుండా దిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలంటూ పీసీసీ హైకోర్టును ఆశ్రయించింది. -
గౌరవెల్లి వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదు
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలంటూ నీటిపారుదల శాఖ కరీంనగర్ ఈఎన్సీకి గోదావరి బోర్డు మెంబర్ సెక్రటరీ అజిగేషన్ తాజాగా లేఖ రాశారు. -
దేవాదాయ భూములు కాపాడటానికి చర్యలు తీసుకోండి
దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. -
ఫారెస్ట్ సర్వీస్లో తెలుగువారి సత్తా
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి మరోసారి సత్తా చాటారు. -
నేడు.. రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ బుధవారం పేర్కొంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఊయల కట్టిన స్టూల్ మీదపడి చిన్నారి మృతి
-
పోలింగ్ బూత్ నుంచి ఇన్స్టా లైవ్.. బోగస్ ఓటింగ్కు పాల్పడ్డాడంటూ అరెస్టు చేసిన పోలీసులు
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ప్రచార జోరు.. వ్యూహాలకు పదును