KCR: రెండు జాతీయ పార్టీలు ఏకమై.. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే యత్నం: కేసీఆర్‌

పదేళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన వంద నినాదాల్లో ఒక్కటైనా నిజం చేశారా? అని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ధ్వజమెత్తారు.

Published : 27 Apr 2024 10:08 IST

      పదేళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన వంద నినాదాల్లో ఒక్కటైనా నిజం చేశారా? అని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ధ్వజమెత్తారు. రాష్ట్రం విజ్ఞప్తులను పెడచెవిన పెట్టిన మోదీకి పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు ఓటెయ్యాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. అమల్లో ఉన్న పథకాలను పట్టించుకోవడం లేదన్నారు. కళ్లముందే రాష్ట్రం నాశమవుతుంటే చూస్తూ ఊరుకోబోమని యుద్ధం చేస్తానన్నారు. రెండు జాతీయ పార్టీలు ఏకమై, ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయని పాలమూరు పర్యటనలో కేసీఆర్‌ మండిపడ్డారు.

Tags :

మరిన్ని