సుబ్రహ్మణ్య వైభవం
శివతేజస్సు, శక్తితత్వం ఏకీకృతంగా భాసిల్లే సుబ్రహ్మణ్యుడు ఆనందసిద్ధికి సంకేతం. సుబ్రహ్మణ్యం అంటే సువర్చస్సు కలిగిన రూపధారి అని అర్థం.
శివతేజస్సు, శక్తితత్వం ఏకీకృతంగా భాసిల్లే సుబ్రహ్మణ్యుడు ఆనందసిద్ధికి సంకేతం. సుబ్రహ్మణ్యం అంటే సువర్చస్సు కలిగిన రూపధారి అని అర్థం. ఆ వర్చస్సు జ్ఞాన సాధన ద్వారా స్వామికి చేకూరింది. జ్ఞానానికి శక్తి సమ్మిళితమైతే ఆత్మోన్నతి సాధించవచ్చని వేదం ప్రతిపాదించింది. ఆ వేద ధర్మానికి సమున్నత ప్రతీక కార్తికేయుడు. తారకాసుర సంహార నిమిత్తం అవతరించిన కారణజన్ముడు షణ్ముఖుడు.
మార్గశిర శుద్ధ షష్ఠినాడు సుబ్రహ్మణ్యుడు అవతరించాడంటారు. అందుకే ఈ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా, చంపాషష్ఠిగా, మంగళషష్ఠిగా, వరఫల షష్ఠిగా, గుహప్రియ వ్రతంగా వ్యవహరిస్తారు. స్కంద, శివ, బ్రహ్మవైవర్త పురాణాలు స్కందుడి ఆవిర్భావ ఉదంతాల్ని విశదీకరించాయి. మహాదేవుడి నుంచి వెలువడిన దివ్య యశస్సు అనంత తేజోకిరణమై పంచభూతాల సమన్వితంగా ఆకృతి దాల్చింది. ఆ సమ్మోహన రూపమే సుబ్రహ్మణ్యుడిగా వ్యక్తమైందంటారు. ఆరుగురు కృత్తికా దేవతల ఆశీర్వాద శక్తితో ఆరు ముఖాల షణ్ముఖుడిగా స్వామి తేజరిల్లాడు. ఈ షడాననాలు ఆరు విధాలతో కూడిన శివశక్తి రూపుడి మూర్తిమత్వాన్ని వెల్లడిస్తాయి. వీరం, అభయం, ఆనందం, యోగం, జ్ఞానం, విజయం- ఈ ఆరు అంశాలకు సుబ్రహ్మణ్యుడి షణ్ముఖాలు ప్రతిబింబాలు.
మార్గశిర శుద్ధ షష్ఠినాడే కుమారస్వామి తారకాసురుణ్ని సంహరించాడని, ఈ తిథినాడే దేవసేనాధిపత్యం పొందాడని స్కందపురాణం చెబుతోంది. బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడు సంపూర్ణ వైరాగ్యమూర్తి. ఆయన తన తపస్సు తప్ప ప్రపంచంలోని సుఖదుఃఖాల గురించి పట్టించుకోని స్థితప్రజ్ఞుడు. శివపార్వతుల మహిమా విశేషంవల్ల ఆ వైరాగ్య సంపన్నుడే ఆది దంపతులకు పుత్రుడిగా జన్మించాడంటారు. శివసంకల్పంతో సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా అవతరించి, జ్ఞానయోగ వరదాయకుడిగా వర్ధిల్లుతున్నాడు.
ప్రతి వ్యక్తీ తనలోనే అనంతమైన శక్తి ఒదిగి ఉందని జ్ఞానపూర్వకంగా తెలుసుకోగలగడమే- ‘అహం బ్రహ్మాస్మి’. ఈ విశేష అనుభూతినే తురీయావస్థ అంటారు. ఈ తురీయావస్థకు అధినాయకుడు సుబ్రహ్మణ్యుడు! సంపూర్ణమైన వ్యక్తిత్వ వికాసానికి జ్ఞాన యోగ మార్గాలు ఆలంబనగా నిలుస్తాయని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఆ పరంపరలో యోగశాస్త్రరీత్యా శక్తి మూలాధారం నుంచి సహస్రారానికి ప్రసరించినప్పుడు సాధకుడికి తేజస్సు రూపంలో దివ్యత్వం ఆపాదితమవుతుంది. కుండలినీ శక్తిని సర్పాకృతితో సమన్వయం చేస్తారు. ఈ సర్పం గుప్తంగా మనిషిలో అరిషడ్వర్గాలనే విషాన్ని విడుదల చేస్తుంటుంది. ఈ ఆరు శత్రువులు మనిషిలో సత్వగుణాన్ని హరించివేస్తాయి. ధ్యాన స్థితిలో ఉన్న వ్యక్తి వెన్నుపాము నిటారుగా ఉంటుంది. ఆ వెన్నుపాముకు శీర్షభాగం శిరస్సు. ఆ శిరస్సులో జ్ఞానమనే క్షీర భాండాన్ని నిక్షిప్తం చేసుకోవడం ద్వారా ప్రతి హృదయమూ నిష్కల్మషమై శోభిల్లుతుంది. ఈ యోగశాస్త్ర రహస్య విషయాల్ని ప్రతిఫలింపజేయడానికే సుబ్రహ్మణ్యస్వామి సర్పాకృతిలో అవతరించాడని పతంజలి యోగశాస్త్రం వివరించింది.
సుబ్రహ్మణ్యుడు శూలాయుధాన్ని ధరించి ఉంటాడు. బిందువుగా ఉండే శూలశీర్ష భాగం, దిగువన విస్తారమవుతుంది. సృష్టిలో అణువు నుంచి బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ చైతన్యానికి శూలాయుధం సంకేతం.
డాక్టర్ కావూరి రాజేశ్పటేల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ