షోడశ గుణనిధి శ్రీరాముడు
పురుషుడు పుణ్యపురుషుడిగా రాణించాలంటే ఉత్తమగుణాలు అలవరచుకొని జీవనం సాగించాలని స్కాందపురాణం చెబుతోంది. ఉత్తములంటే ఎవరు, ఎటువంటివి ఉత్తమగుణాలని నారదుణ్ని అడిగాడు వాల్మీకి.
పురుషుడు పుణ్యపురుషుడిగా రాణించాలంటే ఉత్తమగుణాలు అలవరచుకొని జీవనం సాగించాలని స్కాందపురాణం చెబుతోంది. ఉత్తములంటే ఎవరు, ఎటువంటివి ఉత్తమగుణాలని నారదుణ్ని అడిగాడు వాల్మీకి. ఇతరులకు ఏ మాత్రం కష్టం కలిగించక, వారిని సదా ప్రేమిస్తూ, ప్రజోపకర చర్యలతో అందరి హృదయాలను చూరగొనే గుణాలు కలిగినవాడే ఉత్తముడు, అతడు పాటించే గుణాలే శ్రేష్ఠమైనవని చెప్పాడు నారదుడు. అటువంటి వ్యక్తి ఉత్తమ గుణాలను లోకానికి విశదపరచాడు.
త్వరగా కార్యాన్ని నిర్వహించమని ఇతరులు చెప్పేముందే దాన్ని నిర్వహించి మెప్పు పొందే లక్షణం ఉత్తములది. ఇది విజయానికి సోపానం. ఎల్లవేళలా శ్రీరాముడు దీన్ని ఆచరించి చూపించాడు. కార్యంపట్ల అలసట ప్రదర్శించక దీక్షతో ముందుకు సాగాలి. యుద్ధరంగంలో రాత్రింబగళ్లు పద్నాలుగు వేలమంది రాక్షసులను అలవోకగా జయించి, ఏ మాత్రం అలసట కనబరచనివాడు రాముడు. ధర్మాన్ని ఆచరించడం మహాపురుషుల లక్షణం. రాజ్యార్హత నీకే ఉందని భరతుడు ఎంత వేడినా, అతడి ప్రార్థనను సున్ని తంగా తిరస్కరించి ధర్మాన్ని, ధర్మస్వరూపాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించాడు రఘురాముడు. జటాయువు చేసిన మేలును గుర్తుంచుకొని అతడి అంతిమ సంస్కారాన్ని తానే స్వయంగా నిర్వహించి కృతజ్ఞతకు మారుపేరై నిలిచాడు రాఘవుడు.
అగ్నిసాక్షిగా ఏర్పరచుకొన్న స్నేహబంధాన్ని దృఢతరం చేస్తూ సుగ్రీవుణ్ని రాజును చేసేందుకు వాలి వధకు పూనుకొన్న సత్యవాక్పరిపాలకుడు రఘునందనుడు. తండ్రి ఆదేశాన్ని తలదాల్చి పితృవాక్పరిపాలన అనే దృఢవ్రతాన్ని చేపట్టిన వందనీయుడు దాశరథి. విశ్వామిత్రుడి వెంట కారడవుల్లో సాధారణ వ్యక్తిలా సంచరించి, కంద మూలాలు స్వీకరించి భూశయనం చేశాడు దశరథనందనుడు. గురువు చెప్పిన రాక్షసిమూకలను మట్టుపెట్టి ఆనందం కలిగించాడు. కబంధుడి వధానంతరం ఉదారహృదయంతో అతడికి అగ్ని సంస్కారం చేసిన కరుణాంతరంగుడు. శ్రద్ధాసక్తులు కనబరచి, క్రమశిక్షణతో సకల శాస్త్రాలు, వేదవేదాంగాలు నేర్చి వాటి ఆవశ్యకతను లోకానికి అందించాడు. కార్యదీక్షాదక్షుడై అపార పారావారధిని దాటి దుర్భేద్యమైన లంకను చేరి అరివీరభయంకరుడై శత్రుసేనను నిర్జించాడు.
అంతులేని భక్తివిశ్వాసాలతో తనను వేడిన మునిజన బృందాన్ని కాపాడేందుకు కంకణం కట్టుకొని శత్రుమూకలను చీల్చిచెండాడిన అభయమూర్తి. కోపాన్ని జయించినవారు జితక్రోధులు. తనను అడవికి పంపిన పినతల్లి కైకను కొంచమైనా నిందించక, శాంతవర్తనుడై ఆమె పాదాలకు ప్రణమిల్లిన పుణ్యమూర్తి శ్రీరాముడు. అపూర్వ తేజస్సుతో వెలుగొందుతూ శత్రువులకు కంటిపై కునుకు లేకుండాచేసిన కాంతిమంతుడు. ఇతరుల దోషాలను లెక్కించనివాడు, అసూయ అంటే తెలియనివాడు రాఘవుడు. తనవారి దోషాలను ఎంచక, రాజ్యాన్ని తృణప్రాయంగా త్యజించి, అడవులపాలైన రాముడు స్తవనీయుడు. ధర్మపరిరక్షణ కోసం వీరత్వం ప్రదర్శించి శత్రువులకు గుణపాఠం చెప్పమని బోధిస్తోంది రాజనీతి. యుద్ధంలో వైరివీరులను తుద ముట్టించి లోకకల్యాణానికి నాందిపలికాడు శ్రీరామచంద్రుడు. ఇన్ని గొప్ప గుణాల మేలుకలయికే రాముడి జీవితం అని చెప్పాడు నారదుడు. అందుకే ఆయన సకల గుణాభిరాముడు. వీటిలో కొన్నింటినైనా అందిపుచ్చుకొని ఆచరిస్తే మానవ జీవితం ధన్యమవుతుంది.
మాడుగుల రామకృష్ణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోకులు పలు కాకులు
ఈ నానుడి మనం తరచుగా వింటుంటాం. లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరి అభిప్రాయమూ వేరొకరి అభిప్రాయంతో దాదాపుగా కలవదు. ఎవరి ఆశయాలు వారివి. ఎవరి అభిరుచులు వారివి. ఎవరి అలవాట్లు వారివి. ఒకరినొకరు మార్చడమనేది అసాధ్యం. అసంభవం. -
శాంతి సౌభాగ్యాలు
కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతచిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు. -
సాధన పంచకం
మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం. -
ధర్మ స్వరూపం
ఏ పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి... -
విద్యాదానం
విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది. -
వైరాగ్య సుఖం
మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. -
పొందిగ్గా విజ్ఞతాయుతంగా...
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. -
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. -
నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. -
కర్మయోగం - జ్ఞానయోగం
పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు. -
విజయానికి సోపానం
జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో... వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. -
సహనానికీ హద్దుంటుంది...
సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే! ఎంతవరకు సహనం వహించాలనేదీ ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలుడైనా తిరగబడతాడు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతగానితనంగా భావిస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు. ఒదిగి ఉండటం వల్ల చిన్నతనం రాదు. -
ధర్మమే సర్వం
‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు. సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది. -
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన.
తాజా వార్తలు (Latest News)
-
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. కొత్త వీడియో వైరల్!
-
‘ప్రాజెక్ట్-జెడ్’కు సీక్వెల్.. ఈసారి హైఓల్టేజ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో..
-
ఇంధనం కటకట..! రఫా ఆస్పత్రులపై ‘డబ్ల్యూహెచ్వో’ ఆందోళన
-
పారిస్ ఒలింపిక్స్లో ఏదైనా జరగొచ్చు: నీరజ్ చోప్రా
-
రన్వే పై జారిన బోయింగ్ 737 విమానం.. 10మందికి గాయాలు
-
కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వదిలేస్తాడా? వచ్చే మెగా వేలానికి ముందు భారీ షాక్ తప్పదా?