ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ ఎన్నిక
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల నుంచి తొలి ప్రాధాన్య ఓట్లతోనే యూటీఎఫ్ రాష్ట్రాధ్యక్షుడు షేక్ సాబ్జీ విజేతగా నిలిచారు. మరో పక్క గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి కల్పలత ఆధిక్యంలో ఉన్నారు.
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ స్థానంలో విజయం
గుంటూరు-కృష్ణా జిల్లాల్లో ఆధిక్యంలో కల్పలత
ఈనాడు- కాకినాడ, అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల నుంచి తొలి ప్రాధాన్య ఓట్లతోనే యూటీఎఫ్ రాష్ట్రాధ్యక్షుడు షేక్ సాబ్జీ విజేతగా నిలిచారు. మరో పక్క గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి కల్పలత ఆధిక్యంలో ఉన్నారు.
1,534 ఓట్ల మెజారిటీతో సాబ్జీ గెలుపు
ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్, ఏపీటీఎఫ్-1938, పీడీఎఫ్లతో పాటు 25 ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థి షేక్ సాబ్జీ విజేతగా నిలిచారు. తొలి ప్రాధాన్య ఓట్లతోనే ఆయన విజయం సాధించారని బుధవారం ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 17,467 మంది ఓటర్లు ఉండగా... 16,054 ఓట్లు పోలయ్యాయి. అందులో షేక్ సాబ్జీకి 7,987 ఓట్లు రాగా... వైకాపాతో పాటు పీఆర్టీయూ ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో బరిలోకి దిగిన సమీప ప్రత్యర్థి గంధం నారాయణరావుకు 6,453 ఓట్లు దక్కాయి. షేక్ సాబ్జీ 1,534 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 11 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీపడ్డారు. వీరిలో తెదేపా మద్దతు తెలిపిన చెరుకూరి సుభాష్ చంద్రబోస్కు 706 ఓట్లు, భాజపా మద్దతుతో పోటీ చేసిన ఇళ్ల సత్యనారాయణకు 300 ఓట్లు పడ్డాయి. చెల్లని ఓట్లు 363 నమోదయ్యాయి.
ఇదీ ప్రస్థానం..: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన షేక్ సాబ్జీ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఏలూరు మండలం మాదేపల్లి ఉన్నత పాఠశాలలో స్కూలు అసిస్టెంటుగా పని చేస్తూ.. ఇంకా ఐదేళ్ల సర్వీసు మిగిలి ఉండగానే రాజీనామా చేసి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. 2019 ఫిబ్రవరిలో సీపీఎస్ రద్దు కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు నుంచి విజయవాడ వరకు నిర్వహించిన పాదయాత్రకు నాయకత్వం వహించారు. ఆయన తండ్రి, తాత, ముత్తాతా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు.
విద్యారంగం ప్రక్షాళనపై సీఎం దృష్టి సారించాలి: షేక్ సాబ్జీ
‘ఇద్దరు అధికారులు విద్యాశాఖను ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వారిని నియంత్రించాలి. ఉపాధ్యాయులతో, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడాలి. ఖాళీగా ఉన్న 25వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి’ అని ఎమ్మెల్సీగా ఎన్నికైన షేక్ సాబ్జీ కోరారు. సీపీఎస్ రద్దు కోసం పోరాడతానని, మంచి పీఆర్సీ ఫిట్మెంట్ కోసం, పోగొట్టుకున్న డీఏలు రాబట్టుకోవడానికి కృషి చేస్తానని చెప్పారు.
గుంటూరు-కృష్ణాలో కొనసాగుతున్న లెక్కింపు
గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో కల్పలత ఆధిక్యంలో ఉన్నారు. గుంటూరులోని ఏసీ కళాశాలలో బుధవారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి దాటినా కొనసాగుతూనే ఉంది. మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 12,554 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెల్లని ఓట్లు పోగా అభ్యర్థి విజయానికి 6153 ఓట్లు అవసరమని అధికారులు నిర్ణయించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికి 6153 ఓట్లు రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో స్వతంత్ర అభ్యర్థి తమనం కల్పలతకు 3,870 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావుకు 2,831 ఓట్లు, సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎ.ఎస్.రామకృష్ణకు 1,958 ఓట్లు, ఏపీటీఎఫ్ అభ్యర్థి పి.పాండురంగ వరప్రసాదరావుకు 1,490, స్వతంత్ర అభ్యర్థి చందు రామారావుకు 1,063, ఎస్టీయూ అభ్యర్థి పి.వి.మల్లిఖార్జునరావుకు 459, జనసేన మద్దతుతో పోటీ చేసిన గాదె వెంకటేశ్వరరావుకు 231 ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో ప్రథమ ప్రాధాన్యత ఓట్లు తక్కువగా వచ్చిన తొమ్మిది మంది అభ్యర్థులను తప్పించారు. అనంతరం ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. ఇలా లెక్కించుకుంటూ 16 మంది అభ్యర్థులను తప్పించారు. చివరకు మిగిలిన ముగ్గురి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కల్పలతకు 5094, బొడ్డు నాగేశ్వరరావుకు 3835, రామకృష్ణకు 2581 ఓట్లు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగికి బేడీలు.. కుటుంబసభ్యులు, నాయకుల అభ్యంతరం
ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని, రైతును అరెస్టుచేసిన పోలీసులు.. వైద్యపరీక్షల కోసం వారికి బేడీలు తొడిగి ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకోవడం వివాదాస్పదంగా మారింది. -
గుంటూరు పశ్చిమలో.. పోస్టల్ బ్యాలట్ బాక్సులకు సీలు వేయని అధికారులు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ బాక్సుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తెదేపా నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
అంతా మెతక వైఖరే
వందల మంది వైకాపా వర్గీయులు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు. అధికారపార్టీ నాయకులే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపజేయలేదు. -
అంతరిక్ష యాత్రికుడు బెజవాడ బిడ్డే
భారతదేశ తొలి స్పేస్ టూరిస్టు గోపీచంద్ తోటకూరకు విజయవాడతో విడదీయలేని బంధం ఉంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్-25 వ్యోమనౌకలో ఆయన ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. -
రెవెన్యూ రికార్డుల్లో ఇష్టానుసారం మార్పులేంటి?
భూ యజమానులకు తెలియకుండా, నోటీసిచ్చి వారి వాదనలు వినకుండా అధికారులు రెవెన్యూ రికార్డుల్లో పేర్లను మార్చడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. -
ఏపీకి తుపాను ముప్పు లేనట్లే..!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
సోషల్ ట్రోలింగ్.. లైట్ తీసుకుందాం!
అసలే చదువుల ఒత్తిళ్లు. ఉరుకులు పరుగులు. ఇతరులతో సమానంగా ఎదగాలనే ఆశతో ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకుంటూ ఉంటారు. -
శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్ల జారీ పునఃప్రారంభం
ఎన్నికల కోడ్ అమలుతో గత నెల నుంచి ఆగిపోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను సోమవారం నుంచి అనుమతిస్తున్నారు. -
ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) సోమవారం వెల్లడించింది. -
24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,61,877 మంది హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. -
ఏపీసీపీఎస్ఈఏ నూతన కార్యవర్గం ఎన్నిక
ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పఠాన్ బాజీ, కరిమి రాజేశ్వరరావు ఎన్నికయ్యారు. -
గులకరాయి కేసు.. నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సీఎం జగన్పై జరిగిన గులకరాయి దాడి ఘటనలో నిందితుడు సతీష్కుమార్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. -
జూ.ఎన్టీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్
జూనియర్ ఎన్టీఆర్కు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ
కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. -
పోలీసులు అమాయకులను బలిచేశారు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు సుధాకర్రెడ్డి, హరికృష్ణను అన్యాయంగా ఇరికించి కడప జైలుకు తరలించారని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
మీ పిల్లలకు పలక ఇచ్చారా?
-
విధి వంచితులకు చేయూత
అప్పటివరకు సాఫీగా సాగుతున్న వారి జీవితంపై విధి పగబట్టింది. ఆడుకుంటూ విద్యుత్తు షాక్కు గురై చేయి కోల్పోయిన చిన్నారి ఒకరు. -
నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!
విద్యార్థులూ, తాజా గ్రాడ్యుయేట్లూ తమ అభిరుచిమేరకు కెరియర్ను రూపొందించుకునే ప్రయత్నాల్లో ఉంటారు. వీరు వాస్తవ ప్రపంచ విలువైన అనుభవాన్ని గడించడానికి ఇంటర్న్షిప్లు తోడ్పడతాయి. -
ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ ఎదుగుతోంది
ప్రపంచంలోనే భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని.. అందుకు యువత, విద్యార్థులు కీలకపాత్ర పోషించనున్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. -
నాలుగు సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలు
రాష్ట్రంలోని నరసరావుపేట, గురజాల, తిరుపతి, తాడిపత్రి సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలను ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రైవేటు, ప్రభుత్వ బడులు రెండూ అవసరమైన ఆస్తులే: మంత్రి బొత్స
ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉత్తమ విద్యార్థులను ఆశిస్తున్నందున.. రెండింటినీ అవసరమైన ఆస్తులుగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ మరచిపోయిన బైడెన్.. ఈసారి ‘వైస్ ప్రెసిడెంట్’
-
దేశ ప్రజలే నా వారసులు - విపక్షాలపై మండిపడ్డ మోదీ
-
ధోనీ ఆడటం చూడాలి.. ఇదంతా బీసీసీఐ చేతుల్లోనే..!: అంబటి రాయుడు
-
ఆ ముగ్గురి కనుసన్నల్లోనే దాడులు: మాజీ ఎంపీ కనకమేడల
-
ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్
-
ఫోన్ల రికవరీలో తెలంగాణది రెండోస్థానం: డీజీ మహేశ్ భగవత్