వచ్చేస్తోంది.. మెటావర్స్ ప్రపంచం
మనిషి పనిని సులభతరం చేసేది సాంకేతికత. కొత్త ఆవిష్కరణలతో మానవుడు ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతలను రూపొందిస్తూనే ఉన్నాడు. అంతర్జాలం, స్మార్ట్ఫోన్, కంప్యూటర్ వంటి సాధనాలు..విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయి. ఇప్పుడు వీటికి మించిన సాంకేతికత రానుంది. అదే ‘మెటావర్స్’.
ఇక అంతా వర్చువల్గానే..
రేసులో దిగ్గజ సంస్థలు
మనిషి పనిని సులభతరం చేసేది సాంకేతికత. కొత్త ఆవిష్కరణలతో మానవుడు ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతలను రూపొందిస్తూనే ఉన్నాడు. అంతర్జాలం, స్మార్ట్ఫోన్, కంప్యూటర్ వంటి సాధనాలు..విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయి. ఇప్పుడు వీటికి మించిన సాంకేతికత రానుంది. అదే ‘మెటావర్స్’. ఇంటర్నెట్ తర్వాత దీన్ని అతి పెద్ద మార్పుగా పేర్కొంటున్నారు. మనుషులను పూర్తిగా వర్చువల్ ప్రపంచంలో ఓలలాడించే ఈ సాంకేతికత.. ఆన్లైన్ అనుభూతిని సమూలంగా మార్చేస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఫేస్బుక్ సహా ప్రముఖ సంస్థలు.. ఈ సరికొత్త టెక్నాలజీపై దృష్టిపెట్టాయి.
రంగంలో జుకర్బర్గ్..!
ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్.. మెటావర్స్ సాంకేతికతపై దృష్టి పెట్టారు. ఫేస్బుక్ను ఓ సామాజిక మాధ్యమ సంస్థగా కంటే.. భవిష్యత్తులో మెటావర్స్ కంపెనీగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇప్పటికే వేలాది మందిని ఈ పని కోసం నియమించుకున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి విభాగాలనూ మెటావర్స్ పరిధిలోకి తీసుకురానున్నారు. దీనిపై ఫేస్బుక్ వార్షిక వర్చువల్ రియాలిటీ కాన్ఫరెన్స్లో జుకర్బర్గ్ ప్రకటన చేయనున్నారని ‘ది వర్జ్’ అనే పత్రిక వెల్లడించింది. ఫేస్బుక్ తాజా నివేదికలోనూ మెటావర్స్ గురించి వివరించింది. దీంతో టెక్ నిపుణుల దృష్టి దీనిపై పడింది. ఇదే అంతర్జాల భవిష్యత్ కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఈ పరిజ్ఞానం ఏమిటంటే..?
అంతర్జాలం రాకతో పనులన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. మెటావర్స్ వీటిని తలదన్నే సాంకేతికత. భౌతిక ప్రపంచంలోని మనుషులను కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లనుంది. ఆడుకోవడం, మాట్లాడుకోవడం, పని చేసుకోవడం.. ఇలా అన్ని పనులూ వర్చువల్గా రియల్టైమ్లో ఒకరినొకరు చూస్తూ చేసుకోవచ్చు. ఇంట్లో ఉంటూనే ప్రపంచంలో ఏ మూలన ఉన్న వ్యక్తినైనా కలవొచ్చు. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. నచ్చిన ప్రాంతాన్ని సందర్శించవచ్చు. వీడియో కాల్స్లో సహోద్యోగులను చూడటానికి బదులుగా.. వర్చువల్ వాతావరణంలో వారితో కలిసి పనిచేసుకోవచ్చు. హెడ్సెట్లు, అగ్మెంటెడ్ రియాలిటీ కళ్లద్దాలు, స్మార్ట్ఫోన్ యాప్లు, ఇతర పరికరాల సాయంతో ఈ మెటావర్స్ను అభివృద్ధి చేయనున్నారు. ‘‘ఇది తర్వాతి తరం కనెక్టివిటీ. ఈ విశ్వంలో ఇక్కడ ప్రతీదీ ఒకే చోట లభిస్తుంది. భౌతిక జీవితాన్ని గడిపినట్లే.. వర్చువల్గా మీ జీవితాన్ని గడుపుతారు’’ అని అధునాతన సాంకేతికతలపై పనిచేసే విశ్లేషకులు విక్టోరియా పెట్రాక్ వివరించారు. ‘మెటావర్స్’ పదాన్ని మొదటిసారి నీల్ స్టీఫెన్సన్ అనే రచయిత ఉపయోగించారు. 1992లో రాసిన సైన్స్ ఫిక్షన్ నవల ‘స్నో క్రాష్’లో దీని గురించి ప్రస్తావించారు.
వీడియో గేమ్స్ కంపెనీలకు వరం
ఫేస్బుక్ కాకుండా.. చాలా సంస్థలు మెటావర్స్పై పనిచేస్తున్నాయి. వీడియో గేమ్స్ కంపెనీలకు ఈ సాంకేతికత ఒక వరం లాంటిదని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆన్లైన్ గేమ్స్కు విపరీతమైన ఆదరణ ఉంది. ఇక వర్చువల్ ప్రపంచంలోకి అడుగుపెట్టి.. నెట్టింట ప్రత్యక్షంగా ఆడుకోవడమంటే.. గేమర్లకు సరికొత్త అనుభూతి అనే చెప్పాలి. ఎపిక్ గేమ్స్ అనే సంస్థ ఈ సాంకేతికతపై వేగంగా పనిచేస్తోంది. దీర్ఘకాలిక లక్ష్యాల్లో భాగంగా మెటావర్స్ను తీర్చిదిద్దేందుకు పెట్టుబడిదారుల నుంచి రూ.ఏడున్నర వేల కోట్లను సమీకరించింది. రోబ్లాక్స్ అనే మరో దిగ్గజ సంస్థ ఈ దిశగా అడుగులు వేస్తోంది. 3డీ ప్రపంచంలో నేర్చుకోవడం, ఆడుకోవడం, పని చేసుకోవడం, సామాజికంగా అనుసంధానమవ్వడం వంటి అంశాలపై దృష్టిసారిస్తోంది. ఇటాలియన్ ఫ్యాషన్ సంస్థ గూచీ.. జూన్లో రోబ్లాక్స్తో జట్టుకట్టింది. ‘డిజిటల్ ఓన్లీ’ పరికరాలను విక్రయించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కోకాకోలా, క్లినిక్ సంస్థలు డిజిటల్ టోకెన్లను విక్రయిస్తున్నాయి. మెటావర్స్కు ఇది తొలి అడుగు అని భావిస్తున్నారు. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే క్రిప్టోకరెన్సీకి డిమాండ్ పెరుగుతుందన్న చర్చలూ సాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వీక్షణలు
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
‘ఆ చీకటి చట్టం’ రాకముందే ఇన్ని అగచాట్లా?
‘వారసత్వంగా వచ్చిన పట్టా భూమి మ్యుటేషన్ చేయడానికి స్పెషల్ సీఎస్గా పనిచేసిన నన్నే ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే.. రాష్ట్రంలో సాధారణ రైతులు, బడుగులు, చదువురాని వాళ్లు ఏమైపోవాలి.. వారికి న్యాయం జరిగేదెలా?’ అని ఆర్థికవేత్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. -
సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు
పింఛనుదార్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటి వద్దే నగదు అందించేలా చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి పట్టించుకోలేదు. -
నడవాలు ‘నాశనం’!
‘నాకు దక్కకపోతే ఎవరికీ దక్కకూడదు’... ఇది ముఖ్యమంత్రి జగన్ వైఖరి. కేవలం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రాజెక్టులను కొనసాగిస్తే ఆ కీర్తి వారికి చెందుతుందనే వికృత ఆలోచనతో అభివృద్ధికి చోదక శక్తిలాంటి పారిశ్రామిక నడవాల నడకను ఆపేశారు. -
కావలిలో ఇంకా తొలగించని డబుల్ ఓట్లు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో డబుల్ ఓట్లపై గతంలో ‘ఈనాడు’లో వరుస కథనాలు రాగా.. వాటిలో చాలా వరకు తొలగించారు. -
అమరావతి అభివృద్ధితోనే ఏపీ పురోగతి
రాజధాని అమరావతిపై ప్రధాని మోదీ ఇస్తున్న భరోసాతో రాజధాని వాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. -
‘అంబేడ్కర్’ను తొలగించి.. తన పేరు తగిలించి..!
గొప్పింటి బిడ్డలే విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలా? ప్రతిభ ఉన్న పేద పిల్లలు చదువుకోకూడదా? ప్రఖ్యాత వర్సిటీల్లో సీటు పొందిన పేద విద్యార్థులకు ఫీజు చెల్లించే స్థోమత ఉండదు. -
విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలి
రానున్న 25 ఏళ్లలో రాష్ట్ర, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు రంగనాథబాబు గొర్రెపాటి సూచించారు. -
జీపీఎఫ్ ఖాతాల నుంచి ప్రభుత్వమే రూ.500 కోట్లు దొంగిలించింది
జగన్ సర్కారు ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోగా.. జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.500 కోట్లు దొంగతనంగా లాగేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
పోలీసు వ్యవస్థపైనే స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోన్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత పోలీసు వ్యవస్థపైనే ఉందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
దురుద్దేశంతో కేసు నమోదు
పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. -
‘సొంత’వారికే వంత!
ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. కానీ, మన రాష్ట్రంలో మొత్తం రివర్స్ కదా.. పేదల పక్షపాతినని డబ్బా కొట్టుకునే సీఎం జగన్.. తన అరాచకాల్ని ప్రశ్నించే విపక్ష నాయకులు, ఇతరులపై పెత్తందారులని ముద్ర వేస్తారు. -
రాజమహేంద్రవరం విలవిల
అధికారమిస్తే ప్రగతిని పరుగులు పెట్టిస్తానని మాయమాటలు చెప్పిన సీఎం జగన్.. అయిదేళ్ల పాలనలో కనీసం నగరాలను పట్టించుకోలేదని తేలిపోయింది. -
పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదు
ప్రభుత్వ పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదని.. 5 నుంచి 10 రోజుల తరువాత అమలు చేయాలని సూచించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా స్పష్టం చేశారు. -
అంత అత్యవసరం ఏమిటో చెప్పమనండి
ఎన్నికలు పూర్తయ్యేవరకూ రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత పథకాల కింద నిధుల విడుదలకు అనుమతి నిరాకరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు మంగళవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయులపై వేటు
అధికార వైకాపాకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీర విధేయుల్లా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు మంగళవారం వేటు వేసింది. -
అనూహ్య వర్షాలతో అతలాకుతలం
వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన అనూహ్య మార్పులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. -
‘బందోబస్తు’ బహుపరాక్!
సిద్ధం.. సిద్ధం.. అంటూ హోరెత్తిస్తున్న అధికార వైకాపా.. ఎన్నికల వేళ తీవ్ర హింసకు సర్వం సిద్ధం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు(4)
మహారాష్ట్రలో ఎన్నికల బందోబస్తులో ఉన్న ఏపీఎస్పీకిచెందిన 10కంపెనీల సిబ్బంది పోస్టల్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ నెల 10న అవకాశం కల్పించాలని కోరుతున్నారు.