అనుచిత ప్రవర్తనను అడ్డుకోవడం అప్రజాస్వామికమా!
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎగువ సభ కార్యకలాపాలకు తీవ్ర అవరోధం కలగడంపై రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల అనుచిత ప్రవర్తనను అడ్డుకోవడం
1962-2010 మధ్య 11 సందర్భాల్లో సభ్యులపై చర్యలు
అవన్నీ సమర్థనీయం కాకుంటే అన్నిమార్లు ఎందుకు చేశారు!
ఎంపీల సస్పెన్షన్పై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు
సభను అపవిత్రం చేసే చర్యలను ప్రజాస్వామ్యమని.. వాటిని నిరోధించడం అప్రజాస్వామ్యమని ప్రచారం చేయడం దురదృష్టకరం. దేశ ప్రజలు ఇలాంటి కొత్త పోకడలను సమర్థించరని విశ్వసిస్తున్నా.
- రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు
దిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎగువ సభ కార్యకలాపాలకు తీవ్ర అవరోధం కలగడంపై రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల అనుచిత ప్రవర్తనను అడ్డుకోవడం అప్రజాస్వామికం ఎలా అవుతుందని ప్రశ్నించారు. 12 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ సభలో వరుసగా నాలుగో రోజు కూడా నిరసనలు కొనసాగాయి. వీటి కారణంగా గురువారం సమావేశం ప్రారంభమైన వెంటనే రాజ్యసభ 50 నిమిషాల పాటు వాయిదా పడింది. ‘‘12 మంది సభ్యుల సస్పెన్షన్ను విపక్ష నేతలు అప్రజాస్వామ్యంగా ఎలా అభివర్ణిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన తీర్మానాలను కొనసాగించడం కోసం 1962 నుంచి 2010 వరకు 11 సందర్భాల్లో అవరోధం కలిగిస్తున్న సభ్యులను సస్పెండ్ చేశారు. అవన్నీ అప్రజాస్వామిక చర్యలేనా? అలాగైతే.. అన్నిసార్లు సభ్యులను ఎలా సస్పెండ్ చేశారు’’అని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులు.. సస్పెన్షన్ విధించటానికి దారితీసిన కారణాలపై సభలో కానీ, వెలుపల కానీ ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆక్షేపించారు. ‘తమ అనుచిత ప్రవర్తనపై సభ్యులు కనీసం మీడియా సమావేశాల్లో కూడా విచారం వ్యక్తం చేయకపోవడం బాధాకరం. క్షమాపణ కోరకుంటే సభా నిబంధనల ప్రకారం వారిపై సస్పెన్షన్ను ఎత్తివేయడం సాధ్యంకాద’ని పేర్కొన్నారు. అధికార, విపక్ష సభ్యులు చర్చించుకొని ప్రస్తుత ప్రతిష్టంభనను తొలగించేంద]ుకు ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. సభ్యుల సస్పెన్షన్ అంశంపై మాట్లాడేందుకు విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను అనుమతించాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేయగా వెంకయ్యనాయుడు నిరాకరించారు. దీనిపై ఖర్గే ఇప్పటికే మాట్లాడారని తెలపడంతో కాంగ్రెస్ సభ్యులు సభామధ్యంలోకి దూసుకెళ్లారు.
గురువారం రాజ్యసభలో చర్చలు
ఆనకట్టల భద్రత బిల్లుకు ఆమోదం
దేశంలో ఎంపిక చేసిన ఆనకట్టల భద్రత పర్యవేక్షణ, నిర్వహణ, వాటిపై నిరంతర నిఘాకు సంస్థాగతమైన యంత్రాంగం ఏర్పాటు కోసం రూపొందించిన బిల్లుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్న ఈ బిల్లును పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపించాలని చర్చ సందర్భంగా కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే సభ్యులు డిమాండ్ చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బిల్లును సభలో ప్రవేశపెట్టిన అనంతరం సభ్యులు దీనిపై చర్చించారు. బిల్లులోని నిబంధనలను మార్చాల్సి ఉందని, దానిని సెలెక్ట్ కమిటీకి పంపించాలంటూ డీఎంకే నేత తిరుచ్చి శివ సవరణలను ప్రతిపాదించారు. ఆనకట్టల భద్రత కోసం ఏర్పాటు చేసే జాతీయ స్థాయి కమిటీ, అధికార యంత్రాంగం నియంత్రణ మొత్తం కేంద్ర ప్రభుత్వ గుప్పిట్లో ఉంటుందన్నారు. కాంగ్రెస్, టీఎంసీ సభ్యులు కూడా బిల్లుకు సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం, ఏఐడీఎంకే, ఆర్జేడీ, ఎండీఎంకే సభ్యులు బిల్లును పూర్తిగా వ్యతిరేకించారు. సెలెక్టు కమిటీకి పంపించాలన్న తీర్మానానికి వ్యతిరేకంగా 80 ఓట్లు రాగా అనుకూలంగా 26 ఓట్లే వచ్చాయి. సవరణలు చేసినందున ఈ బిల్లును మరోసారి లోక్సభకు పంపించనున్నారు.
పార్లమెంటు ఎదుట ధర్నాలో ప్రతిపక్ష సభ్యులతో కలిసి కూర్చొన్న రాహుల్గాంధీ
మద్దతుధరలపై వాకౌట్
అధిక ధరలు, ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలపై రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ఈ అంశాలపై చర్చించాలన్న డిమాండ్ను డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తిరస్కరించడంతో తొలుత కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోగా టీఎంసీ, తెరాస, డీఎంకే, వామపక్షాల సభ్యులూ వారిని అనుసరించారు. రైతుల సమస్యలపై నిరసనను తెరాస సభ్యులు లోక్సభలో గురువారం కూడా కొనసాగించారు. ప్రశ్నోత్తరాల సమయం వాయిదా పడలేదు. ప్రస్తుత సమావేశాల్లో లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తిగా కొనసాగడం ఇదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య