ఆ టోపీ పెడితే ఉద్యోగం గోవిందా
స్వాతంత్య్రోద్యమ కాలంలోనే కాదు... ఇప్పటికీ తిరుగులేని భారతీయ స్వదేశీ బ్రాండ్ ఏదైనా ఉందంటే అది గాంధీ టోపీనే! మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా అది అందరినీ ఆకర్షించిందంటే అతిశయోక్తి కాదు.
స్వాతంత్య్రోద్యమ కాలంలోనే కాదు... ఇప్పటికీ తిరుగులేని భారతీయ స్వదేశీ బ్రాండ్ ఏదైనా ఉందంటే అది గాంధీ టోపీనే! మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా అది అందరినీ ఆకర్షించిందంటే అతిశయోక్తి కాదు. జాతీయోద్యమంలో గాంధీటోపీని చూస్తేనే బ్రిటిష్వారికి కంపరం పుట్టేది. ఇంతకూ దీని వెనకాల చరిత్ర ఏంటి?
మహాత్మా గాంధీ ధరించిన కారణంగా గాంధీటోపీగా పేరొంది... సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో (1920-22) వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అంతా దీన్నే అనుసరించటం ఆరంభించారు. ఎటు చూసినా గాంధీ టోపీలు ధరించి నిరసనలు, ఆందోళనలు చేసేవారు. మామూలు సమయాల్లోనూ... కాంగ్రెస్వాదులు, గాంధేయవాదులు ఈ టోపీలతోనే కన్పించేవారు. భారతీయ సాంస్కృతిక ప్రతీకగానే కాకుండా.... విదేశీకి వ్యతిరేకంగా తయారైన స్వదేశీ ఉత్పత్తిగా ఈ టోపీ మారింది. పట్టణాలు, గ్రామీణం అనే తేడా లేకుండా అందరూ గాంధీ టోపీని ఓ స్వాభిమాన పతాకగా చూశారు. ప్రజలు దీన్ని తమంతట తామే తయారు చేసుకునేవారు. లేదంటే రాజకీయ సభల వద్ద కొనుక్కునేవారు. అలా... భారతీయుల రోజువారీ ఆహార్యంలో గాంధీటోపీ చేరిపోయింది.
ఆంక్షలు పెట్టినా...
విదేశీ వస్తువులు, దుస్తులు, ఫ్యాషన్లతో భారతీయులను ప్రభావితులను చేస్తూ, దేశీయ దుస్తులను ధరించటం వెనకబాటుకు నిదర్శనమనే భావనను, ఆత్మన్యూనతను నింపుతున్న బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ గాంధీటోపీ కంపరంగా మారింది. అచిరకాలంలోనే జాతీయోద్యమానికి ప్రతీకగా మారిన ఈ టోపీని విప్లవ వస్తువుగా పరిగణించిన బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని నిషేధించాలని చూసింది. ఈ టోపీ ధరించిన ప్రభుత్వ ఉద్యోగులను కొలువుల నుంచి తొలగించారు. జరిమానాలు విధించారు. కొన్నిచోట్ల వారిని కొట్టారు కూడా. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులెవ్వరూ గాంధీ టోపీలు, ఖద్దరు దుస్తులు ధరించటానికి వీల్లేదంటూ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం ఎంతగా ఆంక్షలు విధించినా గాంధీ టోపీ సృష్టించిన ప్రభంజనం మామూలుగా సాగలేదు. గాంధీజీతో విభేదించిన సుభాష్ చంద్రబోస్లాంటి వారు కూడా ఆ టోపీని ధరించారు. స్వాతంత్య్రానంతరం కూడా తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సహా చాలా మంది గాంధీటోపీ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఇప్పటికీ ఆమ్ ఆద్మీపార్టీ నేత కేజ్రీవాల్ దీనితో కనిపిస్తుంటారు. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ టోపీని సామాన్యులు, రైతులు ఇప్పటికీ ధరిస్తూ ఉంటారు.
వచ్చిందెలా..
అలా ఇటు భారతీయుల్ని, నాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేసిన గాంధీ టోపీ ఇంతకూ ఎలా పుట్టిందంటే మాత్రం భిన్న కథనాలున్నాయి. భారత్లో జాతీయోద్యమానికి ముందు దక్షిణాఫ్రికాలో జాతివివక్షపై పోరాడే సమయంలో జైలు శిక్ష అనుభవించారు గాంధీజీ. ఆ సమయంలో ఆఫ్రికన్ ఖైదీలను నీగ్రోలుగా (భారతీయులను కూడా ఇదే కోవలోకి పరిగణించేవారు) వర్గీకరించేవారు. వారందరికీ జైలులో ఒకేరకమైన టోపీ ఉండేదని.... అక్కడి నుంచి వచ్చిందే గాంధీ టోపీ అనేది ఆయన స్నేహితుడు హెన్రీ పొలాక్ అభిప్రాయం. 1919లో రాంపూర్ సంస్థానం నవాబు సయ్యద్ హమీద్ అలీఖాన్ బహదూర్ను కలవటానికి వెళ్లారు గాంధీజీ. అప్పట్లో నవాబును కలిసేవారు తల కనిపించకుండా టోపీ పెట్టుకోవాల్సిన సంప్రదాయం ఉండేది. అందుబాటులో ఉన్నదేదీ గాంధీజీకి సరిపోకపోవటంతో... అబాదీ బేగమ్ అనే మహిళ అప్పటికప్పుడు ఆయనకు ఓ టోపీని కుట్టి ఇచ్చారని... అదే గాంధీటోపీగా పేరొందిందని మరో వాదన ఉంది. అయితే... ప్రముఖ సాహిత్యకారుడు, గాంధేయవాది, సంఘసంస్కర్త దత్తాత్రేయ బాలక్రిష్ణ కలేల్కర్కు రాసిన ఓ లేఖలో... ఈ టోపీకి స్ఫూర్తి కశ్మీరీ టోపీ అంటూ మహాత్ముడు పేర్కొనటం గమనార్హం. గాంధీజీ ఈ టోపీ ధరించి కన్పించిన సందర్భాలు చాలా తక్కువే కావటం కొసమెరుపు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ