కష్టాలు కనలేరా? కరెంటు కొనలేరా?
వాతావరణ మార్పులతో ఎండల నుంచి కొంత ఉపశమనం లభించినా.. విద్యుత్ కోతల నుంచి ప్రజలకు విముక్తి లభించడం లేదు.
గ్రామాల్లో ఎడాపెడా కోతలు
రాత్రి వేళల్లో కనీసం గంటపాటు నిలిచిపోతున్న సరఫరా
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
* ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని అధిక గ్రామాల్లో. రోజూ 2, 3 గంటల పాటు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజుల కిందటి వరకు పగలు, రాత్రి వేళల్లో నిర్దేశిత వ్యవధి లేకుండా కోతలు అమలయ్యాయి.
* విజయనగరం జిల్లా గజపతినగరంలో పగటి వేళల్లో గంట పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. ఒకేసారి కాకుండా.. 2, నుంచి 4 సార్లుగా కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతోంది.
* ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వాసాగు చేసుకునే రైతులకు విద్యుత్ కోతలతో ఇబ్బందులు తప్పడంలేదు. రోజూ ఒకటి రెండు గంటల పాటు సరఫరా నిలిచిపోతుండటంతో ప్రత్యామ్నాయంగా జనరేటర్లపై ఆధారపడాల్సి వస్తోంది.
ఈనాడు, అమరావతి: వాతావరణ మార్పులతో ఎండల నుంచి కొంత ఉపశమనం లభించినా.. విద్యుత్ కోతల నుంచి ప్రజలకు విముక్తి లభించడం లేదు. ఒకేసారి 2, 3 గంటల పాటు కోత విధిస్తుండటంతో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ఏడాది సైతం ప్రభుత్వానికి ఇదే అనుభవం ఎదురైంది. ఈ దృష్ట్యా కోతల పంథాను అధికారులు మార్చారు. తక్కువ సమయం పాటు.. ఎక్కువ సార్లు కోత విధించే విధానానికి శ్రీకారం చుట్టారు. విద్యుత్ డిమాండ్ పెరిగినప్పుడు.. అందుకు అనుగుణంగా మండలాల వారీగా షెడ్యూల్ వేసి సరఫరా నిలిపివేస్తున్నారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో సాధ్యమైనంత మేరకు సరఫరా చేస్తున్న డిస్కంలు.. డిమాండ్ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోత పెడుతున్నాయి. ‘‘డిమాండ్ మేరకు విద్యుత్ అందుబాటులో లేనప్పుడు మార్కెట్లో కొని సరఫరా చేయాలి. అలా కాకుంటే ఉత్పత్తి చేయాలి. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు లేని కోతలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఎన్నాళ్లు ఉక్కపోత బాధలు’’ అని ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. డిమాండ్ మేరకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు రికార్డుల్లో లెక్కలు చూపుతున్నారు. ఆదివారం రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 233.81 ఎంయూలు(మిలియన్ యూనిట్లు)గా ఉంది. బహిరంగ మార్కెట్ నుంచి 42.2 ఎంయూలు కొన్న తర్వాత కూడా 0.24 ఎంయూల లోటు ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపారు.
శనివారం విద్యుత్ డిమాండ్ 244.24 ఎంయూలు ఉంటే.. 0.19 ఎంయూలు లోటు విద్యుత్ ఉన్నట్లు డిస్కంలు లెక్కలు చూపాయి. ఈ లోటును సర్దుబాటు చేయడానికి ఏదో ఒక ప్రాంతంలో కోతలు విధించక తప్పడంలేదు. రాష్ట్రంలో డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు పగటి వేళల్లో ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్న డిస్కంలు.. రాత్రి వేళల్లో అనూహ్యంగా పెరిగే డిమాండ్ను నియంత్రించలేని పరిస్థితి. రాత్రి 10 గంటల తర్వాత ఏసీల వినియోగం ఎక్కువగా ఉండటమే కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఫీడర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ కారణంగా డిమాండ్ సర్దుబాటు చేయడానికి రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఇలా విధించే కోతలకు అధికారులు సాంకేతిక కారణాలను సాకుగా చెబుతున్నారు. వాస్తవానికి పంపిణీ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో లోడ్ను అంచనా వేసి.. ఆ మేరకు అదనపు ట్రాన్స్ఫార్మర్లను డిస్కంలు ఏర్పాటు చేయాలి. ఇలా చేయకపోవడం వల్ల ట్రాన్స్ఫార్మర్పై ఒత్తిడి పెరిగి కొన్ని చోట్ల సమస్యలు తలెత్తుతున్నాయి. అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం.. కొద్ది సేపటికి మళ్లీ సరఫరా పునరుద్ధరించడం వల్ల కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ ఉపకరణాలు దెబ్బతింటున్నాయి. సరఫరా వచ్చి.. ఆగుతుండటంతో ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతోంది. లోఓల్టేజి కారణంగా కొన్ని రోజుల కిందట నాయుడుపేటలో ఓ అపార్టుమెంటులోని ఇళ్లలో ఏసీలు దెబ్బతిన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వీక్షణలు
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
‘ఆ చీకటి చట్టం’ రాకముందే ఇన్ని అగచాట్లా?
‘వారసత్వంగా వచ్చిన పట్టా భూమి మ్యుటేషన్ చేయడానికి స్పెషల్ సీఎస్గా పనిచేసిన నన్నే ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే.. రాష్ట్రంలో సాధారణ రైతులు, బడుగులు, చదువురాని వాళ్లు ఏమైపోవాలి.. వారికి న్యాయం జరిగేదెలా?’ అని ఆర్థికవేత్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. -
సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు
పింఛనుదార్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటి వద్దే నగదు అందించేలా చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి పట్టించుకోలేదు. -
నడవాలు ‘నాశనం’!
‘నాకు దక్కకపోతే ఎవరికీ దక్కకూడదు’... ఇది ముఖ్యమంత్రి జగన్ వైఖరి. కేవలం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రాజెక్టులను కొనసాగిస్తే ఆ కీర్తి వారికి చెందుతుందనే వికృత ఆలోచనతో అభివృద్ధికి చోదక శక్తిలాంటి పారిశ్రామిక నడవాల నడకను ఆపేశారు. -
కావలిలో ఇంకా తొలగించని డబుల్ ఓట్లు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో డబుల్ ఓట్లపై గతంలో ‘ఈనాడు’లో వరుస కథనాలు రాగా.. వాటిలో చాలా వరకు తొలగించారు. -
అమరావతి అభివృద్ధితోనే ఏపీ పురోగతి
రాజధాని అమరావతిపై ప్రధాని మోదీ ఇస్తున్న భరోసాతో రాజధాని వాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. -
‘అంబేడ్కర్’ను తొలగించి.. తన పేరు తగిలించి..!
గొప్పింటి బిడ్డలే విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలా? ప్రతిభ ఉన్న పేద పిల్లలు చదువుకోకూడదా? ప్రఖ్యాత వర్సిటీల్లో సీటు పొందిన పేద విద్యార్థులకు ఫీజు చెల్లించే స్థోమత ఉండదు. -
విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలి
రానున్న 25 ఏళ్లలో రాష్ట్ర, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు రంగనాథబాబు గొర్రెపాటి సూచించారు. -
జీపీఎఫ్ ఖాతాల నుంచి ప్రభుత్వమే రూ.500 కోట్లు దొంగిలించింది
జగన్ సర్కారు ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోగా.. జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.500 కోట్లు దొంగతనంగా లాగేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
పోలీసు వ్యవస్థపైనే స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోన్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత పోలీసు వ్యవస్థపైనే ఉందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
దురుద్దేశంతో కేసు నమోదు
పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. -
‘సొంత’వారికే వంత!
ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. కానీ, మన రాష్ట్రంలో మొత్తం రివర్స్ కదా.. పేదల పక్షపాతినని డబ్బా కొట్టుకునే సీఎం జగన్.. తన అరాచకాల్ని ప్రశ్నించే విపక్ష నాయకులు, ఇతరులపై పెత్తందారులని ముద్ర వేస్తారు. -
రాజమహేంద్రవరం విలవిల
అధికారమిస్తే ప్రగతిని పరుగులు పెట్టిస్తానని మాయమాటలు చెప్పిన సీఎం జగన్.. అయిదేళ్ల పాలనలో కనీసం నగరాలను పట్టించుకోలేదని తేలిపోయింది. -
పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదు
ప్రభుత్వ పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదని.. 5 నుంచి 10 రోజుల తరువాత అమలు చేయాలని సూచించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా స్పష్టం చేశారు. -
అంత అత్యవసరం ఏమిటో చెప్పమనండి
ఎన్నికలు పూర్తయ్యేవరకూ రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత పథకాల కింద నిధుల విడుదలకు అనుమతి నిరాకరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు మంగళవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయులపై వేటు
అధికార వైకాపాకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీర విధేయుల్లా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు మంగళవారం వేటు వేసింది. -
అనూహ్య వర్షాలతో అతలాకుతలం
వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన అనూహ్య మార్పులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. -
‘బందోబస్తు’ బహుపరాక్!
సిద్ధం.. సిద్ధం.. అంటూ హోరెత్తిస్తున్న అధికార వైకాపా.. ఎన్నికల వేళ తీవ్ర హింసకు సర్వం సిద్ధం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు(4)
మహారాష్ట్రలో ఎన్నికల బందోబస్తులో ఉన్న ఏపీఎస్పీకిచెందిన 10కంపెనీల సిబ్బంది పోస్టల్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ నెల 10న అవకాశం కల్పించాలని కోరుతున్నారు.