మా అనుమతి లేకుండా ఓట్లెలా బదిలీ చేస్తారు?
‘మాకు సమాచారం ఇవ్వకుండా మా ఓట్లు ఎలా బదిలీచేస్తారు? నిర్వాసితుల సమస్యలు పరిష్కరించని అధికారులు.. ఓట్ల తరలింపుపై శ్రద్ధ చూపడంలో మర్మమేంటి?’ అని దేవీపట్నం మండల పోలవరం నిర్వాసితులు నిలదీశారు.
పునరావాసంపై లేని శ్రద్ధ ఓట్ల తరలింపుపై చూపడంలో మర్మమేంటి?
అధికారులను నిలదీసిన పోలవరం నిర్వాసితులు
‘ఈనాడు- ఈటీవీ’ కథనంతో యంత్రాంగం పరుగులు
ఈనాడు- రాజమహేంద్రవరం, న్యూస్టుడే- దేవీపట్నం, గోకవరం: ‘మాకు సమాచారం ఇవ్వకుండా మా ఓట్లు ఎలా బదిలీచేస్తారు? నిర్వాసితుల సమస్యలు పరిష్కరించని అధికారులు.. ఓట్ల తరలింపుపై శ్రద్ధ చూపడంలో మర్మమేంటి?’ అని దేవీపట్నం మండల పోలవరం నిర్వాసితులు నిలదీశారు. తమ అనుమతి లేకుండా ఓట్లను ఎలా తరలిస్తారంటూ జగ్గంపేట నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు, ఇతర అధికారులపై మండిపడ్డారు. ఓటర్లకు తెలియకుండా 2,400 ఓట్లు రంపచోడవరం నియోజకవర్గం నుంచి కాకినాడ జిల్లా జగ్గంపేటకు మార్చిన వైనంపై ‘ఈ అరాచకం అనంతం’ శీర్షికన ‘ఈనాడు’లో బుధవారం కథనం ప్రచురితమవడంతో అధికారులు పరుగులు పెట్టారు. గోకవరం తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు, గోకవరం తహసీల్దార్ హేమకుమారి సమావేశం నిర్వహించి పలువురి నుంచి స్టేట్మెంట్లు నమోదుచేశారు.
దీంతో తొయ్యేరు, దేవీపట్నం గ్రామాల నిర్వాసితులు వచ్చి, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఓటు రంపచోడవరంలోనే ఉంచాలని, జగ్గంపేటకు బదిలీ చేస్తే నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత అధికారులు కృష్ణునిపాలెం కాలనీకి వెళ్లి పలు కుటుంబాలతో మాట్లాడారు. అక్కడా ఓట్ల బదిలీపై స్థానికులు ప్రశ్నించారు. నిర్వాసితుడు పోలిశెట్టి శివరామకృష్ణ ‘ఈనాడు’తో మాట్లాడుతూ తొయ్యేరులోనే 100 మందికి ఇళ్లు నిర్మించాల్సి ఉందని, 70మందికి ప్యాకేజీలు రావాల్సి ఉందని తెలిపారు. తమ ఓట్లను మళ్లీ రంపచోడవరం నియోజకవర్గంలో చేర్చాలని డిమాండ్ చేశారు. కృష్ణునిపాలెంలో గురువారం ఉదయం 10 గంటలకు ఈఆర్వో ప్రశాంత్కుమార్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహిస్తామని డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ తెలిపారని చెప్పారు.
అధికార పార్టీ నేత అత్యుత్సాహం
ఓట్ల బదిలీ అక్రమాలపై అధికారులు విచారణ జరిపినప్పుడు.. అధికార పార్టీ స్థానిక నేత ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించారు. కృష్ణునిపాలెంలో నివాసముంటూ, ఓట్లు బదిలీకాని 17 గ్రామాల వారిలో కొందరిని అధికారుల వద్దకు తీసుకెళ్లి.. ఓట్ల బదిలీకి అనుకూలంగా మాట్లాడించినట్లు తెలిసింది.
ఓట్ల బదిలీకి చర్యలు తీసుకుంటాం
రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రశాంత్కుమార్
ఈనాడు-అమరావతి: తొయ్యేరు, దేవీపట్నం గ్రామాల ఓటర్లతో చర్చించి.. వారి ఓట్ల మార్పునకు ఉన్న అవకాశాలు పరిశీలించి, ఫాం-8 ద్వారా బదిలీకి తగిన చర్యలు తీసుకుంటామని రంపచోడవరం సబ్ కలెక్టర్, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎస్.ప్రశాంత్కుమార్ తెలిపారు. పోలవరం నిర్వాసితుల ఓట్లు అడ్డగోలుగా బదిలీ చేయడంపై ‘ఈ అరాచకం అనంతం’ శీర్షికన ‘ఈనాడు’లో బుధవారం ప్రచురితమైన కథనానికి సబ్ కలెక్టర్ స్పందించి, వివరణ ఇచ్చారు. దీనిపై దేవీపట్నం తహసీల్దార్ బీవీ చలపతిరావు సైతం స్పందించారు. తొయ్యేరు, దేవీపట్నం గ్రామాల్లోని నిర్వాసితుల్లో 2,475 మంది ఓటర్లు అక్కడ నివాసం ఉండకపోవడంతో వారి పునరావాస కాలనీలున్న జగ్గంపేట నియోజకవర్గంలోకి మార్పు చేశామని, ఇందులో అధికారులకు ఎలాంటి దురుద్దేశం లేదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!