ఏయ్‌ మాట్లాడకు.. నోరు మూసుకో..

మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు తనను ప్రశ్నించే వారిపై విరుచుకుపడ్డారు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలో గురువారం వేర్వేరు గ్రామాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

Updated : 15 Mar 2024 06:19 IST

గద్దించిన ఎమ్మెల్యే ముత్తంశెట్టి

విశాఖపట్నం, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు తనను ప్రశ్నించే వారిపై విరుచుకుపడ్డారు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలంలో గురువారం వేర్వేరు గ్రామాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో తునివలస గ్రామంలో జరిగిన సభలో స్థానికులు కాలువ పనుల విషయమై ఎమ్మెల్యేను నిలదీశారు. దాన్ని ముత్తంశెట్టి జీర్ణించుకోలేక తనను ప్రశ్నించిన వ్యక్తిని ‘ఏయ్‌ మాట్లాడకు..నోరు మూసుకో..వాడిని లాక్కొని రండి..ఎగస్ట్రాలు చేస్తున్నారు’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రవర్తనపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. గతంలో మీరిచ్చిన హామీ మేరకే కాలువ ఎందుకు నిర్మించలేదని అడిగితే ఇలా మాట్లాడడం తగదంటూ ఎమ్మెల్యే తీరును తప్పుపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని