కోడ్ కూసే సమయంలో హడావుడి నియామకాలు
దేవాదాయ శాఖలో కాంట్రాక్టు విధానంలో ఇంజినీర్ల నియామకాల కోసం నాలుగు నెలల కిందట ఇచ్చిన నోటిఫికేషన్కు సంబంధించి ఇప్పుడు పోస్టింగు ఆదేశాలివ్వడం వివాదాస్పదమైంది.
దేవాదాయ శాఖలో ఏఈల భర్తీకి డిసెంబరులో నోటిఫికేషన్
జనవరిలో రాత పరీక్ష
ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సమయంలో పోస్టింగులు
ఫలితాల ప్రకటనలో జాప్యం వెనక ఓ అమాత్యుని ఒత్తిళ్లు?
ఈనాడు, అమరావతి: దేవాదాయ శాఖలో కాంట్రాక్టు విధానంలో ఇంజినీర్ల నియామకాల కోసం నాలుగు నెలల కిందట ఇచ్చిన నోటిఫికేషన్కు సంబంధించి ఇప్పుడు పోస్టింగు ఆదేశాలివ్వడం వివాదాస్పదమైంది. మెరిట్ జాబితా ప్రకటించకుండానే హడావుడిగా పోస్టింగులు ఎలా ఇస్తారని కొందరు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. వివిధ జిల్లాల దేవాదాయశాఖ అధికారుల పరిధిలో పనిచేసేందుకు, పలు ముఖ్య ఆలయాల్లో పనుల పర్యవేక్షణకు 40 మంది ఏఈలు (సివిల్, ఎలక్ట్రికల్), 30 మంది టెక్నికల్ అసిస్టెంట్ల పోస్టులకు గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ ఇచ్చారు. అయిదేళ్ల కాలానికి కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణ, రాత పరీక్ష, ఫలితాల ప్రకటన అంతా హైదరాబాద్లోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు అప్పగించారు. దాదాపు 2 వేల మందికి పైగా దరఖాస్తు చేశారు. వారికి ఈ ఏడాది జనవరి 21న రాత పరీక్ష నిర్వహించారు.
ఫలితాలు నెల రోజులు ఎందుకు ఆపారు?
పరీక్ష తర్వాత ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా కీ విడుదల చేసింది. రిజర్వేషన్, మెరిట్ జాబితాను ఫిబ్రవరిలోనే దేవాదాయ శాఖకు ఇచ్చింది. అయితే దేవాదాయశాఖ అధికారులు మాత్రం దాదాపు నెలపాటు ఈ ఫలితాలు ప్రకటించలేదు. ఎంపికైన అభ్యర్థుల హాల్టిక్కెట్ల నంబర్లను ఈనెల 13న ప్రకటించారు. వీరంతా 15, 16వ తేదీల్లో ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని సూచించి ఆ తేదీల్లో సర్టిఫికేట్లను పరిశీలించి నియామక ఆదేశాలిచ్చేశారు. వారికి కేటాయించిన దేవాదాయశాఖ కార్యాలయాలు, ఆలయాలను పేర్కొని విధుల్లో చేరేలా చూశారు.
అమాత్యుని ఒత్తిళ్లే కారణమా?
ఫలితాలు ప్రకటించకుండా దాదాపు నెలకుపైగా ఎందుకు జాప్యం చేశారని అభ్యర్థుల్లో చర్చ జరుగుతోంది. కేవలం హాల్టికెట్ల నంబర్లు ప్రకటించి ధ్రువపత్రాల పరిశీలనకు రావాలని సూచించారని, ఎవరికెన్ని మార్కులు వచ్చాయో, ఏ విధంగా ఎంపికయ్యారనేది స్పష్టం చేయలేదని చెబుతున్నారు. అయితే ఈ ఫలితాల ప్రకటన జాప్యంలో ఓ అమాత్యుడి ఒత్తిళ్లు ఉన్నాయని ప్రచారమవుతోంది. ఈ పరీక్షలో అర్హత సాధించలేకపోయిన తమవాళ్లు కొందరికి ఎలాగైనా అవకాశం ఇవ్వాలంటూ ఆ అమాత్యుని ఓఎస్డీ ద్వారా ఒత్తిళ్లు చేసినట్లు సమాచారం. దీనివల్లే దాదాపు నెలపాటు ఫలితాల విడుదలలో దోబూచులాట జరిగిందనే వాదన వినిపిస్తోంది. చివరకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారని తెలిసి హడావుడిగా ఫలితాల ప్రకటన, ధ్రువపత్రాల పరిశీలన, పోస్టింగు ఆదేశాలివ్వడం యుద్ధప్రాతిపదికన చేసినట్లు తెలుస్తోంది. పోస్టులను పారదర్శకంగా భర్తీ చేశామని, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫలితాలు యథాతథంగా ప్రకటించి వాళ్ల వెబ్సైట్తోపాటు దేవాదాయశాఖ వెబ్సైట్లోనూ ఉంచామని దేవాదాయశాఖ అధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిక్ష ఎస్పీకి.. నేరం ఎవరిది?
పల్నాడులో పోలింగ్ రోజు, అనంతర హింసాకాండ నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. -
రెండు రోజుల్లో రూ.4వేల కోట్ల చెల్లింపులు
పోలింగ్ ముగిసి నాలుగు రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరో వైపు ఉన్న నిధుల్లో అనుయాయ గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
రక్తపు మడుగులో ఉన్నవారిని లంచం అడిగిన పోలీసులు!
తాము నమ్మిన పార్టీకి ఓటేస్తామని ధైర్యంగా చెప్పడమే వారు చేసిన తప్పు! వైకాపా నాయకులు డబ్బులిస్తామని ఆశ చూపినా, భయపెట్టినా వెరవక స్థిరంగా నిలవడమే మహాపరాధం!! అది విని రెచ్చిపోయిన వైకాపా రౌడీమూకలు ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. -
పోలీసులు కాదు.. గులాములే
వైకాపాతో అంటకాగుతూ.. పోలింగ్ నాడు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసకు అన్ని విధాలుగా సహకరించి సస్పైండైన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలపై ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. -
విభాగాల విలీనంతో ప్రాధాన్యం కోల్పోతున్న వర్సిటీలు
చదువుల పెన్నిధిగా.. పరిశోధనలకు పట్టుగొమ్మలుగా విరాజిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో మొక్కుబడి విద్యా సంస్థలుగా మారుతున్నాయి. -
చిన్నారులను వేధిస్తున్న పోషకాహార లోపం
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు చిన్నారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. రేపటి పౌరులను ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితే ఇలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
గడువు ముగిసినా.. పౌర సేవలు గగనమే!
ప్రజలకు నిర్దేశిత గడువులోగా పౌర సేవలు అందించాలన్న విధానం పట్టణ స్థానిక సంస్థల్లో పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
విజయనగరంలో జిందాల్ పరిశ్రమ మూసివేత
ఏపీలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ పరిశ్రమను సంబంధిత యాజమాన్యం మూసివేసింది. -
వేతనాల సొమ్ము తిరిగి ఇవ్వండి
ప్రభుత్వ సర్వీసులో ఉంటూ పీజీ వైద్య విద్యను పూర్తిచేసి, అయిదేళ్ల పాటు పనిచేయకుండా అనధికారికంగా సెలవులో ఉన్న 70 మంది వైద్యులు.. రూ.20 లక్షలతోపాటు చదివే సమయంలో పొందిన ప్రభుత్వ వేతనాల్ని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రి(కేజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్కుమార్ గురువారం అస్వస్థతకు గురై నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రెండో రోజు ఏపీఈఏపీసెట్కు 91.62 శాతం మంది హాజరు
జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించిన ఏపీఈఏపీ సెట్-2024.. రెండోరోజు రాష్ట్రంలో, హైదరాబాద్లోనూ ప్రశాంతంగా జరిగిందని సెట్ ఛైర్మన్, ఉపకులపతి జి.వి.ఆర్.ప్రసాదరాజు తెలిపారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ ప్రక్రియ వాయిదా
రాష్ట్రంలో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించాలన్నది ప్రభుత్వ ఆలోచన. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
గోదావరిలో ఇసుక మా‘రీచు’లు!
ఇసుక అక్రమ తవ్వకాలను కట్టడి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. -
ఇసుక లారీలకు టార్పాలిన్ తప్పనిసరి చేయండి
ఇసుక, ఇతర ఖనిజ సంపద రవాణా సమయంలో లారీల ద్వారా కలుగుతున్న వాయు, శబ్ద కాలుష్య నివారణ, గ్రామస్థులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేందుకు హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
పేద విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహక విషయంలో ఇచ్చిన మాట ప్రకారం స్పందించారు తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన ఉమాపతి. -
రాబడుల్లో ఇలా మిగిలాం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులు తెలంగాణతో పోలిస్తే గడిచిన ఐదేళ్లుగా మరీ దిగజారిపోయాయి. ఆ రాష్ట్రంలో సొంత రెవెన్యూ రాబడులు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్