సీబీఐ దృష్టంతా విశాఖలోని కంటెయినర్ భద్రతపైనే!
సంచలనం రేపిన ‘డ్రగ్స్ దిగుమతి’ కేసులో సీబీఐకి కొత్త భయం పట్టుకుంది. విశాఖ కంటెయినర్ టెర్మినల్లో సీజ్ చేసిన ఉంచిన సరకు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది.
డ్రగ్స్ కలిసిన ‘డ్రైడ్ ఈస్ట్’ పాడవుతుందనా?
కంటెయినర్ను ఏమైనా చేస్తారనా?
అన్ని వాతావరణాలనూ తట్టుకునే ప్రదేశానికి తరలించాలని నిర్ణయం
ఈనాడు, విశాఖపట్నం: సంచలనం రేపిన ‘డ్రగ్స్ దిగుమతి’ కేసులో సీబీఐకి కొత్త భయం పట్టుకుంది. విశాఖ కంటెయినర్ టెర్మినల్లో సీజ్ చేసిన ఉంచిన సరకు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. బ్రెజిల్ నుంచి ఆరు రకాల నిషేధిత మాదకద్రవ్యాల అవశేషాలతో ‘డ్రైడ్ ఈస్ట్’ విశాఖ పోర్టుకు దిగుమతి అయినట్లు గుర్తించిన విషయం విదితమే. రెండు రోజులు నమూనాలు సేకరించాక, న్యాయమూర్తి సమక్షంలో తిరిగి 25 వేల కిలోల బ్యాగ్లను కంటెయినర్లో ఉంచి ప్రత్యేక సీల్ వేశారు. ప్రస్తుతం ఇది వీసీటీపీఎల్ ప్రధాన గేటు కుడివైపు ఉన్న ఎగ్జామినేషన్ పాయింట్లో ఉంది. అత్యంత ఖరీదైన సరకు కావడం, మున్ముందు కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉండటంతో కంటెయినర్ భద్రతను కీలకంగా భావించారు. శుక్రవారం రాత్రి అక్కడి నుంచి తరలించాలని భావించినా సాధ్యపడలేదు. ఈ కంటెయినర్ను ‘ఆల్ వెదర్ ఫ్రూఫ్’(అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకునే) ప్రదేశంలో ఉంచేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సరకు దిగుమతి అయిన బెర్త్లో ఈ సదుపాయం లేదు. డ్రైడ్ ఈస్ట్తో వచ్చిన కంటెయినర్ను తెరిచి నమూనాలు పరీక్షించాక... ‘వర్షం కురిసే అవకాశం ఉంది. తడిచి సరకు పాడైపోవచ్చు. సరకును కంటెయినర్లో ఉంచండి’ అంటూ సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధులు సీబీఐ బృందాన్ని అభ్యర్థించారు. అదే సమయంలో పోర్టు ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు సంఘటన స్థలం వద్ద గుమిగూడటం వల్ల విచారణకు జాప్యమైందని సీబీఐ ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్న విషయం విదితమే. ఇలాంటి పరిస్థితుల్లో కంటెయినర్ భద్రతపై సీబీఐ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సీజ్ చేసిన కంటెయినర్ను ఎవరైనా ఏమైనా చేస్తారనే అనుమానమా? లేక అందులోని డ్రగ్స్ అవశేషాలు వాతావరణానికి దెబ్బతింటాయని భయమా? అనేది కీలకాంశంగా మారింది.
కేసులో దూకుడు పెంచి
కంటెయినర్లోని సరకు నమూనాల్ని సేకరించక ముందే.. విశాఖ లాసన్స్బే కాలనీలోని సంధ్య ఆక్వా సంస్థ కార్యాలయంలో రికార్డుల్ని సీబీఐ స్వాధీనం చేసుకుంది. మరోవైపు శుక్రవారం సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కు సంబంధించి కాకినాడ మూలపేట, వజ్రకూటంలో ఏడుగురు అధికారుల బృందం తనిఖీలు చేసింది. న్యాయమూర్తి సమక్షంలో సేకరించిన నమూనాల్ని దిల్లీలోని ల్యాబ్కు పంపనున్నారు. ఇప్పటికే సంధ్య ఆక్వా సంస్థపై కేసు నమోదు చేసిన సీబీఐ... వ్యక్తుల పాత్రపై, బ్రెజిల్ నుంచి కస్టమ్స్ తనిఖీలు తప్పించుకుని ఎలా నౌక కదిలిందనే దానిపై క్షుణ్నంగా ఆరా తీస్తోంది. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, ఓ మంత్రి సలహాతో... సీబీఐ విచారణలో ఉన్న సంస్థ ప్రతినిధులు ఆఘమేఘాలపై శుక్రవారం ప్రకటన విడుదల చేశారన్న విమర్శలున్నాయి. ‘మాకు పార్టీలతో సంబంధం లేదు. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాం’ అంటూ ఆ ప్రకటనలో వారు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య