Online Gaming: ఆన్లైన్ గేమింగ్పై పన్నుతో.. ఖజానాకు ఏటా ₹20వేల కోట్లు
Online Gaming: ఆన్లైన్ గేమింగ్లో గరిష్ఠ పన్నుతో ఖజానాకు ఏటా రూ.20వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.
దిల్లీ: ఆన్లైన్ గేమింగ్ (Online Gaming)ల్లో పూర్తి పందెం విలువపై 28శాతం పన్ను విధించాలని ఇటీవల జీఎస్టీ (GST) మండలి తీసుకున్న నిర్ణయంపై పరిశ్రమ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నిర్ణయంతో కేంద్ర ఖజానాకు ఏటా రూ.20వేల కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా అంచనా వేశారు. ఈ మేరకు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
‘‘ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్ (Online Gaming) కంపెనీలు నైపుణ్య ఆధారిత/అదృష్టం ఆధారిత అనే వర్గీకరణను ఆసరాగా చేసుకుని కేవలం ప్లాట్ఫామ్ ఫీజులు లేదా గ్రాస్ గేమింగ్ రెవెన్యూ (GGR) మీద మాత్రమే 18శాతం జీఎస్టీ చెల్లిస్తున్నాయి. పూర్తి పందెం విలువను పరిగణిస్తే ఈ పన్ను కేవలం 2-3శాతం మాత్రమే ఉంటుంది. సామాన్య ప్రజలు నిత్యం వినియోగిస్తున్న ఎన్నో ఆహార ఉత్పత్తులకు చెల్లిస్తున్న 5శాతం పన్ను రేటు కంటే కూడా ఇది తక్కువ. అందుకే పూర్తి పందెం విలువపై 28శాతం పన్ను విధించాలని నిర్ణయించాం’’ అని సంజయ్ మల్హోత్రా తెలిపారు.
- ఇది చదివారా: ఆన్లైన్ గేమింగ్పై 28% పన్ను
‘‘2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆన్లైన్ గేమింగ్ సంస్థలు రూ.1700 కోట్ల జీఎస్టీ (GST)ని చెల్లించాలి. తక్కువ పన్ను రేటు కారణంగా ఈ మొత్తం చాలా తక్కువగా ఉంది. నిజానికి పూర్తి పందెం విలువపై పన్ను విధిస్తే గనుక ఈ మొత్తం 8 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉండేది. అంటే తాజా నిర్ణయంతో ఏటా రూ.15వేల కోట్ల నుంచి రూ.20వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుంది’’ అని ఆయన వెల్లడించారు.
ఇక, దీనిపై వస్తున్న వ్యతిరేకత గురించి రెవెన్యూ కార్యదర్శి స్పందిస్తూ.. ‘‘ఈ అంశంపై ఏవైనా గేమింగ్ కంపెనీలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే.. ప్రభుత్వం పోరాడేందుకు సిద్ధంగా ఉంది. తీర్పులను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం. అందువల్ల అధిక పన్ను రేటుపై మా నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పుపై ఆధారపడి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ఆన్లైన్ గేమింగ్కు గరిష్ఠ జీఎస్టీ రేటును విధించడాన్ని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ వ్యతిరేకించింది. వ్యాపార విస్తరణ పైనా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!