Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితా.. మస్క్ను దాటేసిన బెజోస్
World's Richest People: ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మొదటి స్థానంలో నిలిచారు.
ఇంటర్నెట్ డెస్క్: టెస్లా (Tesla) అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రపంచ కుబేరుల జాబితా (World's Richest People)లో తొలి స్థానాన్ని కోల్పోయారు. దాన్ని అమెజాన్ (Amazon) వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) దక్కించుకున్నారు. గత తొమ్మిది నెలలుగా సంపన్నుల జాబితాలో మస్క్ మొదటి స్థానంలో ఉన్నారు. బ్లూమ్బర్గ్ (Bloomberg) బిలియనీర్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం జెఫ్ బెజోస్ సంపద విలువ 200 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక, మస్క్ సంపద 198 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. మూడో స్థానంలో ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ (Bernard Arnault), నాలుగులో మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ (Mark Zukerberg), ఐదులో బిల్ గేట్స్ (Bill Gates) ఉన్నారు.
గతేడాది మస్క్.. 31 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోగా.. అదే సమయంలో బెజోస్ సంపద విలువ 23 బిలియన్ డాలర్లు పెరిగింది. మరోవైపు టెస్లా షేర్ల విలువ 2021 తర్వాత 50 శాతం మేర తగ్గింది. షాంఘైలోని ఫ్యాక్టరీ ఆశించిన స్థాయిలో ఎగుమతులు చేయలేకపోవడంతో సోమవారం మరోసారి కంపెనీ షేర్లు నష్టాలను చవిచూశాయి. గత నెలలో టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన 55 బిలియన్ డాలర్ల భారీ వేతన ప్యాకేజీ అందుకునేందుకు మస్క్ అనర్హుడని డెలావేర్ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇది ఆయన సంపద విలువ తగ్గడానికి మరో కారణమని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎలాన్ మస్క్పై ట్విటర్ మాజీ ఉన్నతోద్యోగుల దావా
అమెజాన్లో 9 శాతం వాటా బెజోస్ సొంతం. గత నెలలో ఆయన 8.5 బిలియన్ డాలర్ల విలువ కలిగిన 50 మిలియన్ షేర్లను అమ్మేశారు. కరోనా సమయం నుంచి ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో అప్పటి నుంచి అమెజాన్ క్రమంగా వృద్ధిని సాధిస్తోంది. ఈ జాబితాలో భారతీయ బిలియనీర్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) 115 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానంలో, 104 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ (Gautam Adani) 12వ స్థానంలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?