Apple: యాపిల్కు భారత్ చాలా కీలక మార్కెట్: టిమ్ కుక్
Apple: భారత్లో చాలా మంది మధ్య తరగతి ఆదాయ వర్గంలోకి వస్తున్నారని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. ఈ నేపథ్యంలో యాపిల్ ఉత్పత్తుల విక్రయాలు మెరుగవుతున్నాయని వెల్లడించారు.
న్యూయార్క్: భారత్ మార్కెట్ను యాపిల్ (Apple) చాలా కీలకంగా భావిస్తోందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) పునరుద్ఘాటించారు. తాము ప్రధానంగా దృష్టి సారించిన మార్కెట్లలో ఇదొకటి తెలిపారు. అతిపెద్ద మార్కెట్ అయిన భారత్లో తమ వాటా చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. తమ కంపెనీ వృద్ధికి ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో భారత్లో యాపిల్ (Apple) ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైనట్లు టిమ్ కుక్ (Tim Cook) తెలిపారు. రెండంకెల వృద్ధి నమోదైనట్లు వెల్లడించారు. భారత్లో చాలా మంది మధ్య తరగతి ఆదాయ వర్గంలోకి వస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యాపిల్ ఉత్పత్తుల విక్రయాలు మెరుగవుతున్నాయని తెలిపారు. ముంబయి, దిల్లీలో రిటైల్ స్టోర్లను తెరిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అవి తమ అంచనాల కంటే మెరుగ్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఆరంభంలో లభించినంత స్పందన మాత్రం లేదన్నారు. మరోవైపు చైనాలో నమోదైన వృద్ధితో భారత్ను పోల్చలేమని.. ప్రాంతాన్ని బట్టి పరిస్థితులు మారతాయన్నారు.
సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో యాపిల్ (Apple) ఆదాయం 89.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది నమోదైన 90.1 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఒక శాతం క్షీణత కనిపించింది. మరోవైపు భారత్లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 48 శాతం పెరిగి రూ.49,322 కోట్లకు చేరినట్లు బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ టోఫ్లర్ ఇటీవల వెల్లడించింది.
మరోవైపు ఐఫోన్ 17 మోడల్ను భారత్లో అభివృద్ధి చేయడంతో పాటు, ఇక్కడే తయారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం రెండో అర్ధభాగంలో ఈ ఫోన్ల తయారీని ప్రారంభించేందుకు యాపిల్కు కాంట్రాక్టు తయారీ సంస్థలైన ఫాక్స్కాన్, పెగట్రాన్, టాటా గ్రూపు కొనుగోలు చేసిన విస్ట్రాన్ సన్నద్ధమయ్యే అవకాశం ఉందని ఓ ఆంగ్ల వెబ్సైట్ తెలిపింది. ఇదే జరిగితే చైనా వెలుపల యాపిల్ కొత్త మోడల్ ఉత్పత్తుల తయారీ ప్రారంభం కావడం ఇదే మొదటిసారి అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్