Happy Forgings IPO: 19 నుంచి హ్యాపీ ఫోర్జింగ్స్ ఐపీఓ.. పూర్తి వివరాలు ఇవే..!
Happy Forgings IPO: హ్యాపీ ఫోర్జింగ్స్ ఐపీఓ డిసెంబర్ 19న ప్రారంభం కానుంది. ధరల శ్రేణి రూ.808-850గా కంపెనీ నిర్ణయించింది.
Happy Forgings IPO | దిల్లీ: ఆటోమొబైల్ రంగంలో విడిభాగాల తయారు చేసే హ్యాపీ ఫోర్జింగ్స్ లిమిటెడ్ ఐపీఓ (Happy Forgings IPO) డిసెంబర్ 19న ప్రారంభం కానుంది. రూ.1008 కోట్లు సమీకరించే ఉద్దేశంతో ఐపీఓకు (IPO) వస్తున్న ఈ కంపెనీ ఒక్కోషేరు ధరల శ్రేణిని రూ.808-850గా కంపెనీ నిర్ణయించింది. డిసెంబర్ 21న సబ్స్క్రిప్షన్ ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 18నే సబ్స్క్రిప్షన్ విండో తెరుచుకోనుంది.
ఐపీఓలో భాగంగా రూ.400 కోట్లు విలువైన షేర్లను ఫ్రెష్గా ఇష్యూ చేయనున్నారు. 71.6 లక్షల షేర్లు ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా సమకూరిన మొత్తంతో పరికరాలు, ప్లాంట్స్, మెషినరీ కొనుగోళ్లకు; రుణాల తిరిగి చెల్లింపులు; సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు. ఐపీఓలో జారీ చేస్తున్న షేర్లలో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు 50 శాతం కేటాయించారు. 35 శాతం షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం నాన్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 17 ఈక్విటీ షేర్లు (లాట్) కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
యూపీఐతో క్రెడిట్ కార్డు జత చేస్తున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే..!
లుథియానాకు చెందిన హ్యాపీ ఫోర్జింగ్స్ సంస్థ కమర్షియల్ వాహన విభాగంలో విడిభాగాలను తయారుచేస్తుంటుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఈ సంస్థకు కస్టమర్లు ఉన్నారు. అశోక్ లేల్యాండ్, జేసీబీ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్ఎంఎల్ ఇసుజు, టాటా కమిన్స్ వంటి పెద్ద పెద్ద సంస్థలు ఈ సంస్థకు కస్టమర్లుగా ఉన్నాయి. భారత్ సహా బ్రెజిల్, ఇటలీ, జపాన్, స్పెయిన్, స్వీడన్, థాయ్లాండ్, తుర్కియే, యూకే, యూఎస్లో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.860.05 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 39.12 శాతం పెరిగి 1196.53 కోట్లుగా నమోదైంది. నికర లాభం సైతం రూ.142.29 కోట్ల నుంచి రూ.208.70 కోట్లకు పెరిగింది. జేఎం ఫైనాన్షియల్, యాక్సిస్ క్యాపిటల్, ఈక్విరస్ క్యాపిటల్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ బుక్ రన్నింగ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ఈ షేర్లు లిస్ట్ కానున్నాయి.
అదే రోజు ముఫ్తీ జీన్స్ ఐపీఓ
ముఫ్తీ జీన్స్ తయారీ సంస్థ క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ లిమిటెడ్ ఐపీఓ కూడా 19నే ప్రారంభం కానుంది. రూ.550 కోట్ల ఐపీఓలో భాగంగా ధరల శ్రేణిని రూ.266-280గా కంపెనీ నిర్ణయించింది. డిసెంబర్ 21న సబ్స్క్రిప్షన్ ముగియనుంది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించనున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు (లాట్) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. దేశీయంగా 1807 టచ్ పాయింట్లతో పాటు 404 ఎక్స్క్లూజివ్ బ్రాండ్ ఔట్లెట్లు, 71 లార్జ్ ఫార్మాట్ స్టోర్లు, 1332 బ్రాండ్ ఔట్లెట్లు ఈ కంపెనీకి ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.341.17 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం 2022-23లో 46 శాతం పెరిగి రూ.498.18 కోట్లుగా నమోదైంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ఈ షేర్లు లిస్ట్ కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్