Twitter: ట్విటర్లో పోస్టింగులకు ఇక డబ్బులు: ఎలాన్ మస్క్
Twitter: ట్విటర్లో చేసే పోస్ట్ల నుంచి యూజర్లు డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని మస్క్ కల్పిస్తున్నారు. సెట్టింగ్స్లోకి వెళ్లి మానిటైజ్పై క్లిక్ చేస్తే సరిపోతుందని తెలిపారు.
శాన్ఫ్రాన్సిస్కో: బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) అధీనంలోకి వెళ్లిన తర్వాత సామాజిక మాధ్యమం ట్విటర్ (Twitter)లో అనేక మార్పులు జరుగుతున్నాయి. తాజాగా యూజర్లు తమ కంటెంట్ నుంచి డబ్బు సంపాదించుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు మస్క్ వెల్లడించారు. సుదీర్ఘ సమాచారం నుంచి ఎక్కువ నిడివి గల వీడియోల వరకు దేనికైనా సబ్స్క్రిప్షన్ ఆప్షన్ను పెట్టుకొని డబ్బులు ఆర్జించుకోవచ్చని తెలిపారు. సెట్టింగ్స్లోకి వెళ్లి మానిటైజ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే సరిపోతుందని వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ ఆప్షన్ అమెరికాలోనే ఉందని తెలిపారు. త్వరలో ఇతర దేశాలకూ విస్తరిస్తామని తెలిపారు.
ఇలా తమ కంటెంట్ ద్వారా యూజర్లు సంపాదించిన డబ్బు నుంచి వచ్చే 12 నెలల పాటు ట్విటర్ (Twitter) ఎలాంటి రుసుములూ తీసుకోబోమని మస్క్ (Elon Musk) వెల్లడించారు. అంటే సబ్స్క్రిప్షన్ల ద్వారా వచ్చిన డబ్బులో గరిష్ఠంగా 70 శాతం వరకు యూజర్లకే వచ్చేస్తుందని తెలిపారు. ట్విటర్ (Twitter) ద్వారా ఆర్జిస్తున్న మొత్తంలో నుంచి ఐఓఎస్, ఆండ్రాయిడ్ 30 శాతం యాప్స్టోర్ ఫీజు కింద వసూలు చేస్తోంది. వెబ్లో అయితే 92 శాతం వరకు ఆదాయం యూజర్లకే చెందుతుందని మస్క్ (Elon Musk) స్పష్టం చేశారు. అలాగే కంటెంట్ను ప్రమోట్ చేసుకునేందుకూ ట్విటర్ సహకరిస్తుందని తెలిపారు. కావాలంటే ఎప్పుడైనా తమ కంటెంట్తో సహా ట్విటర్ నుంచి బయటకు వెళ్లొచ్చని పేర్కొన్నారు.
తాజా మార్పుల ద్వారా మరింత ఎక్కువ మంది కంటెంట్ క్రియేటర్లను ట్విటర్ (Twitter) వేదిక మీదకు తీసుకొచ్చేందుకు మస్క్ (Elon Musk) యత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. లేదా వారు ట్విటర్ను వీడి వెళ్లకుండా అట్టేపెట్టుకోవడం కోసం ఇదొక వ్యూహమైనా అయి ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. తొలి 12 నెలల పాటు ఎలాంటి రుసుము తీసుకోకపోయినప్పటికీ.. భవిష్యత్తో ఇది మంచి ఆదాయ వనరుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
కంటెంట్ నుంచి డబ్బు ఆర్జించుకునే ఆప్షన్ యూజర్లకు ఇవ్వడం ద్వారా ప్రముఖ న్యూస్లెటర్ కంపెనీ సబ్స్టాక్కు పోటీ ఇవ్వడం కూడా మస్క్ (Elon Musk) వ్యూహంలో ఒక భాగమై ఉండొచ్చన్నది టెక్ నిపుణుల అంచనా. సబ్స్టాక్ సైతం తమ వేదికపై యూజర్లు ఎలాంటి కంటెంట్నైనా సబ్స్క్రిప్షన్ ద్వారా అందించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అయితే, ఇటీవల ఈ సంస్థ నోట్స్ పేరిట ట్విటర్ (Twitter) తరహాలో పబ్లిక్ ఫీడ్ను పోస్ట్ చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో సబ్స్టాక్ సైతం ట్విటర్లా మారిపోయింది. ఈ నేపథ్యంలో సబ్స్టాక్ లింక్స్ ఉన్న ట్వీట్లను లైక్ చేయడం, రిప్లై ఇవ్వడం, రీట్వీట్ చేయడం వంటి వాటిని ట్విటర్ తాత్కాలికంగా నిలిపివేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల లాభంతో 74,059 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 22,505 దగ్గర కొనసాగుతోంది. -
3 ఏళ్లలో రూ.3,000 కోట్లు.. అపోలో హాస్పిటల్స్ పెట్టుబడులు!
వచ్చే మూడేళ్లలో రూ.3,000 కోట్ల పెట్టుబడులకు అపోలో హాస్పిటల్స్ సన్నాహాలు చేస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్తో ఒప్పందం ఫలితంగా, వస్తున్న నిధులకు మరికొంత జతచేసి, సంస్థ విస్తరణ కార్యకలాపాలపై పెట్టుబడి పెట్టాలని అపోలో నిర్ణయించింది. -
కార్పొరేట్ ఫలితాలు.. అమెరికా వడ్డీరేట్లే కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈవారంలో వెలువడే పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకు తోడు, వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్కు దిశానిర్దేశం చేయొచ్చంటున్నారు. -
అదానీకనెక్స్ రూ.11,520 కోట్ల రుణ సమీకరణ
అదానీ ఎంటర్ప్రైజెస్, ఎడ్జ్కనెక్స్ సంయుక్తంగా డేటా కేంద్రాల కోసం నెలకొల్పిన సంస్థ అదానీకనెక్స్ 1.44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.11,520 కోట్ల) వరకు రుణం సమీకరించినట్లు ప్రకటించింది. -
బ్యాంకుల రుణవృద్ధి అంతంతే!
దేశంలో ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నందున బ్యాంకుల లాభదాయకత, ఆస్తుల నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పటిష్ఠంగా ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. -
చైనాలో ఎలాన్ మస్క్
అమెరికా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హఠాత్తుగా చైనాలో పర్యటిస్తున్నారు. -
వెండిపై ఆచితూచి!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.72,462 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.72,944; రూ.73,425 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. -
సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. -
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
SBI Credit Card: ఎస్బీఐ కార్డు విమాన ప్రయాణికుల కోసం మూడు ప్రత్యేక క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది. వాటిలోని ప్రయోజనాలు, ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..!
తాజా వార్తలు (Latest News)
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!